అన్నవరంలో నూతన ధ్వజస్తంభ పనులకు శ్రీకారం
అన్నవరం దేవస్థానంలో అనివేటి మండపంలో బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి గురువారం శ్రీకారం చుట్టారు.
అన్నవరం: అన్నవరం దేవస్థానంలో అనివేటి మండపంలో బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి గురువారం శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జీర్ణావస్థలో ఉన్న ధ్వజస్తంభాన్ని కళాపకర్షణకు గానూ తెల్లవారుజాము నుంచి వైదికబృదం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, మండపారాధన, హోమం నిర్వహించారు. అనంతరం గోమాతతో ధ్వజస్తంభం కదిపించారు. ఛైర్మన్ ఐ.వి. రోహిత్, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న ధ్వజస్తంభం తొలగింపు పనులు ప్రారంభించారు. కలశలను ఉపసంహరించి భధ్రపర్చనున్నారు. ఈ పనులు ఏప్రిల్ మొదటి వారానికి పూర్తవ్వనున్నాయి. ఏప్రిల్ 22న ఉదయం 10.45 గంటలకు నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట చేయనున్నారు. ప్రతిష్ట సందర్భంగా ఏప్రిల్ 18 నుంచి 5రోజుల పాటు హోమాలు, ప్రత్యేక పూజలు చేపడతారు. నెల్లూరుకు చెందిన ఓ దాత సుమారు రూ. 3 కోట్లు వ్యయంతో సుమారు 2 కేజీల పైబడి బంగారంతో ధ్వజస్తంభాన్ని తీర్చిదిద్దుతున్నారు. అన్నవరం సత్యదేవుని ఆలయ పునర్నిర్మాణం పూరై శిఖర ప్రతిష్ట జరిగి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఏప్రిల్ 1న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నివేదిక సమర్పించనున్నారు. భక్తులకు బూరి, పులిహోర, రవ్వకేశరి, గోదుమ నూక ప్రసాదం, కదంబం ప్రసాదం అందిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిలదీద్దాం.. వైకాపాను గద్దె దించేద్దాం
[ 28-04-2024]
కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెం, పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో శనివారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అధికార పార్టీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు. -
మత్స్యకార కుటుంబాల కల.. మాటలతో వైకాపా వల
[ 28-04-2024]
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారులో హార్బర్.. 20 వేల మత్స్యకార కుటుంబాల కల. ఇది అందు బాటులోకి వస్తే కష్టాలన్నీ తీరిపోయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశపడ్డారు. వైకాపా సర్కారు దీనిపై ఎన్నో గొప్పలు చెప్పింది. -
వేణుగోపాలా.. ఇదేం మాయ?
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు అధికారపక్షం ఎంతకైనా తెగిస్తోంది. ప్రభుత్వం తీరును ఎన్నికల సంఘం తప్పుపడుతున్నా.. అధికార పక్షానికి అంటకాగుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడంలేదు. -
జగనన్న సైనికులకు ఝలక్
[ 28-04-2024]
స్థానికంగా వాలంటీరు ఉద్యోగం వచ్చింది. కుటుంబంతో ఉంటూ ఊళ్లోనే ఇప్పటివరకు పనిచేసుకున్నా. అందులో భాగంగా రేషను పంపిణీలో భాగస్వామ్యం చేశారు. -
16,23,149.. ఇదీ ఓటర్ల సంఖ్య
[ 28-04-2024]
జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. రెండవ అనుబంధ జాబితా(సప్లిమెంటరీ)ను కూడా ప్రచురించి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే మొత్తం ఓటర్ల వివరాలను శనివారం కలెక్టర్ మాధవీలత వెల్లడించారు. -
ప్రలోభాలపై నిఘా వ్యవస్థ ప్రత్యేక దృష్టి
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న దృష్ట్యా విధి నిర్వహణలో యంత్రాంగం మరింత నిబద్ధతతో వ్యవహరించాలని, ప్రలోభాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని -
మహిళా గళం.. విజయపథం
[ 28-04-2024]
తెదేపా- జనసేన- భాజపా కూటమి నేతృత్వంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ శనివారం రాజమహేంద్రవరంలో మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. -
అయిదేళ్లలో ఆర్టీసీ ఆస్తవ్యస్తం
[ 28-04-2024]
జగన్ పాలనలో అన్ని వ్యవస్థల మాదిరిగానే ఆర్టీసీ సైతం చితికిపోయింది. ప్రభుత్వంలో విలీనం పేరిట ఆశలు కల్పించిన సీఎం.. తర్వాత అచేతన స్థితిలో వదిలేశారు. -
మా అందరి స్వస్థలం పిఠాపురం
[ 28-04-2024]
తమ స్వస్థలం పిఠాపురంగా భావిస్తున్నామని మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్తేజ్ అన్నారు. పి -
జగనన్నా.. ఇదేనా ‘మీ సేవ’..!
[ 28-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 215 మీసేవ కేంద్రాలు ఉండేవి. -
ఉమ్మడి జిల్లాల ఎక్సైజ్ అధికారులకు సహకరిస్తాం..
[ 28-04-2024]
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యానాంలో మద్యం అమ్మకాల నియంత్రణ, అక్రమ రవాణా జరక్కుండా తగిన చర్యలకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పరిపాలనాధికారి ఆర్.మునిస్వామి తెలిపారు. -
సత్యదేవుని కల్యాణోత్సవాలపై సమీక్ష నేడు
[ 28-04-2024]
మే 18 నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణ, భక్తులకు ఏర్పాట్లపై ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నామని ఆలయ అధికారులు తెలిపారు. -
జగన్ను నమ్మకండి: గిడుగు
[ 28-04-2024]
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని వైఎస్ జగన్మోహన్రెడ్డిని నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి
[ 28-04-2024]
ద్విచక్ర వాహనం అదుపుతప్పి విభాగినిని ఢీకొన్న ప్రమాదంలో కోమటి హర్షిణి (8) మృతిచెందగా తండ్రి సురేష్ తీవ్రగాయాలతో బయటపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు