నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవు
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అధికారులను ఆదేశించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీసీ హాలులో మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖలో ప్రవేశపెడుతున్న వివిధ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జీజీహెచ్, ఆసుపత్రి, సీహెచ్సీలు, పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆన్లైన్లో హాజరు నమోదు చేసుకోవాలన్నారు. విధులకు ఆలస్యంగా వస్తున్న వారు, ముందుగా వెళ్లిపోతున్న వారిని సంజాయిషీ కోరుతూ మెమోలు జారీ చేయాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సైతం నూతనంగా వచ్చిన ఫేస్ రికగ్నజేషన్ యాప్ ద్వారా కచ్చితంగా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. ప్రయోగాత్మకంగా జరుగుతున్న ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని క్షేత్ర స్థాయిలోని అధికారులు నిరంతర పర్యవేక్షించాలన్నారు. ఓపీ తక్కువగా నమోదవుతున్న గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అక్కడి కారణాలు విశ్లేషించాలన్నారు. ఎనీమియా ముక్త్ భారత్ ద్వారా సక్రమంగా రక్త పరీక్షలు నిర్వహించి, రక్తహీనత ఉన్న గర్భిణులపై సంబంధిత పీహెచ్సీల వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వారికి రక్తహీనత లేకుండా మందులు, పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల భర్తీ, బయోమెట్రిక్ హాజరు తదితర అంశాలపై డీఎంహెచ్వో సక్రమంగా వివరాలు తెలియజేయకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, డీసీహెచ్ఎస్ డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ వైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త జయరామకృష్ణ, డీఐఓ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. -
ఊపిరి నేనన్నావు.. ఉసురు పోసుకున్నావు!
[ 07-05-2024]
ఆర్బీకేల ద్వారా భరోసా ఇచ్చామని జగన్ అన్నారు.. ఆ మాటలే నిజమైతే ఇన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు.. మిగ్జాం తుపానుతో రైతులు కుదేలైతే పంటల పరిశీలన పేరిట వేదికలు పెట్టి పిక్నిక్ స్పాట్లా మార్చారు. -
జగన్ మార్కు ఇసుక దోపిడీ
[ 07-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
పోస్టల్ బ్యాలట్లో..ప్రలోభాల పర్వం..
[ 07-05-2024]
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. -
ఎస్సీ రైతులపై కపట ప్రేమ
[ 07-05-2024]
రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చిన ఎస్సీలకు మూడేళ్లుగా కౌలు ఎగ్గొట్టారు. ఇందుకు సీఐడీ విచారణ అంటూ వంక పెట్టారు. వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. -
‘వైకాపాకు వేసే ఓటు మురిగిపోయినట్లే’
[ 07-05-2024]
ఎన్నికల్లో వైకాపాకు వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లేనని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్తో కలసి సోమవారం ఉదయం ఆయన రోడ్షో నిర్వహించారు. -
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి, కార్యకర్తలపై వైకాపా దాడి
[ 07-05-2024]
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్వలి సహా ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా మూకలు దాడి చేశాయి. సోమవారం మస్తాన్వలి కార్యకర్తలతో కలిసి 50వ డివిజన్లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. -
‘జగన్కు ఒకసారి ఓటేస్తేనే పదేళ్లు వెనుకబడ్డాం’
[ 07-05-2024]
మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్డర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నతో కలిసి సోమవారం పర్యటించారు. -
గడప గడపకు కిలాడి మాటలు
[ 07-05-2024]
భూమి పూజకు పరిమితం.. పాత పొన్నూరు ఇందిరాకాలనీలో రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పర్యటించగా.. మురుగుకాలువ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. -
పోరాట బాట.. గెలుపు బాసట
[ 07-05-2024]
చీరాలలో ఓ పెద్దాయనను గెలిపిస్తే.. పార్టీ మారి నమ్మక ద్రోహం చేశారు.. జిల్లా నుంచి తెదేపా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ ఈ అయిదేళ్లలో ఎన్నో కష్టాలు పడ్డారు.. -
నోటికాడ ‘అన్నం’ లాగేసిన జగన్
[ 07-05-2024]
పేదలు కడుపు నిండా అన్నం తిన్నా జగన్కు రుచించదు.అందుకే వారి నోటికాడ ముద్ద తీసి పొట్టపై కొట్టాడు. అర్ధాకలితో అలమటించేలా చేశాడు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశాడు. -
వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి బరితెగింపు
[ 07-05-2024]
నరసరావుపేటలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండోరోజు వైకాపా నేతల ఆరాచకం రాజ్యమేలింది. వైకాపా మూకల అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM