logo

Vande Bharat Express: వందేభారత్‌పై రాళ్లు.. ఇద్దరు అరెస్టు

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కిటికీ అద్దాలు పగలుగొట్టిన ఘటనలో తాజాగా ఇద్దరిని చీరాల రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

Published : 24 Oct 2023 10:26 IST

చీరాల: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కిటికీ అద్దాలు పగలుగొట్టిన ఘటనలో తాజాగా ఇద్దరిని చీరాల రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12న చీరాల - స్టువర్టుపురం రైల్వే స్టేషన్ల మధ్య వెళ్తున్న వందే భారత్‌ రైలు( 20678)పై తాబ్రాజ్(18), శశి తరుణ్(19) అనే ఇద్దరు యువకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఈ-1 కోచ్‌లోని మూడు, నాలుగు సీట్లు దగ్గర ఉన్న అద్దాలు ధ్వంసమయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు యువకులను అరెస్టు చేశారు. ఈమేరకు ఆర్పీఎఫ్‌ సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు