logo

Guntur: ఆర్టీసీ బస్సు బీభత్సం.. అదుపుతప్పి గుడిసెలోకి..

ప్రత్తిపాడు మండలంలోని కోయవారిపాలెంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.

Updated : 29 Dec 2023 11:34 IST

ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని కోయవారిపాలెంలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లోలెవల్‌ చప్టాలో బస్సు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. బస్సులోని ప్రయాణికులందరినీ క్షేమంగా బయటకు దించినట్లు చెప్పారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించారు. లోలెవల్ చప్టా వద్ద కల్వర్టు నిర్మించాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. రహదారి పక్కనే ఉన్న వాగులో బస్సు పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని