సైనిక సంక్షేమ నిధి..చేయూత మన విధి
కన్నవారికి.. ఉన్న ఊరికి దూరంగా ఉంటూ.. మాతృ భూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. ప్రజా క్షేమం కోసం నిఘా నేత్రంతో విధులు నిర్వహిస్తారు. శత్రు సైన్యం భారత
నేడు సాయుధ దళాల పతాక దినోత్సవం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, వికారాబాద్ టౌన్, సిద్దిపేట టౌన్
విరాళాలు సేకరిస్తున్న ఎన్సీసీ వలంటీర్లు
కన్నవారికి.. ఉన్న ఊరికి దూరంగా ఉంటూ.. మాతృ భూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. ప్రజా క్షేమం కోసం నిఘా నేత్రంతో విధులు నిర్వహిస్తారు. శత్రు సైన్యం భారత భూ భాగంలో అడుగు పెట్టకుండా పగలూ రాత్రి అనే తేడాలేకుండా శ్రమిస్తారు. యుద్ధం వస్తే శత్రు మూకలకు ఎదురొడ్డి పోరాడతారు. ఈ యజ్ఞంలో కొందరు కాళ్లు, చేతులు పోగొట్టుకుని దివ్యాంగులవుతారు. కొందరు కంటిచూపు కోల్పోతారు. మరికొందరు తమ ప్రాణాలనే త్యాగం చేస్తారు. దేశం కోసం ఇంత చేసిన వారికి చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. యుద్ధ భూమి నుంచి తిరిగి వచ్చిన సైనికులకు, వితంతువులు, వారి పిల్లలకు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఏర్పడిందే సైనిక సంక్షేమ నిధి. నేడు ‘సాయుధ దళాల పతాక దినోత్సవం.’ ఈ సందర్భంగా ‘న్యూస్టుడే’ కథనం.
1948లోనే శ్రీకారం
మాజీ సైనికులు, వారి పిల్లల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. దీనికి అన్ని ప్రాంతాల నుంచి విరాళాలు సేకరించే ఉద్దేశంతో ఏటా డిసెంబరు 7న సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నారు. సైనిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి 1948లోనే శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయం
ఏం చేస్తారంటే..
కేంద్ర రక్షణ శాఖ మంత్రి అధ్యక్షుడిగా, సభ్యులుగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి, ఆర్మీ, నావికా, వాయుసేన దళాల సైన్యాధ్యక్షులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో సైనిక సంక్షేమ నిధికి అధ్యక్షుడిగా రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడిగా, వివిధ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వీరమరణం పొందిన సైనికులతోపాటు సమస్యల్లో ఉన్న వారి కుటుంబీకులకు, క్షతగాత్రులైన సైనికులకు అండగా ఉండేందుకు విరాళాలు సేకరిస్తారు.
వికారాబాద్లో పద్మనాభ కళాశాల విద్యార్థులు...
అర్మీ జవానుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ ఆర్మీ (ఎన్ఎఫ్సీహెచ్) నిధిని సేకరిస్తున్నారు. దీన్లో భాగంగా జిల్లా కేంద్రం వికారాబాద్లోని శ్రీ అనంత పద్మనాభ అర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు వారం రోజులపాటు పట్టణంలోని వివిధ వార్డులు తిరుగుతూ విరాళాలను సేకరించే వారు. ఇలా మూడేళ్ల క్రితం వరకూ చేశారు. కరోనా తదితర కారణాలతో వాయిదా పడింది. ఈ విద్యా సంవత్సరం మళ్లీ విరాళాలను సేకరిస్తామని కళాశాల ఎన్సీసీ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
సిద్దిపేటలో డిగ్రీ కళాశాల..
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు (కేడెట్లు) సామాజిక అంశాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు సైనిక సంక్షేమంలోనూ భాగస్వామ్యులవుతున్నారు. కళాశాల స్థాయిలో 160 మందితో ఎన్సీసీ కొనసాగుతోంది. ఎన్సీసీ కేర్ టేకర్ మహేందర్రెడ్డి పర్యవేక్షణలో నిత్యం విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఏటా నిర్వహించే సేవా శిబిరాలకు వెళ్తున్నారు. ఏడాదిలో ఒకరోజు సైనికుల సంక్షేమ నిధిని సేకరిస్తున్నారు. ఈ మొత్తాన్ని బెటాలియన్ ద్వారా వారికి అందేలా చొరవ చూపుతున్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు.. రాయితీలు
* గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగాల్లో రిజర్వేషన్లు.
* వివాహం కోసం ఆర్థిక సాయం రూ.40వేలు (ఇద్దరు కుమార్తెల వరకు)
* మాజీ సైనికుడు మరణిస్తే కుటుంబానికి రూ.10వేలు, భార్య, కుమారుడు, కూతురు మరణించినా అంతే మొత్తం అందజేస్తారు.
* స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కోసం పావలా వడ్డీపై రుణ సదుపాయం.
* ఇళ్ల స్థలాలు కేటాయింపు.
* సీఎస్డీ క్యాంటిన్ ద్వారా వ్యాట్ మినహాయింపుపై సరకుల పంపిణీ.
అందరూ బాసటగా నిలవాలి: కెప్టెన్ శ్రీనివాసులు, ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి, సంగారెడ్డి
సైనికులు, వారి కుటుంబాలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. విరాళాలు ఇవ్వడం ద్వారా వారికి చేయూతనిచ్చిన వారమవుతాం. మా శాఖ తరఫున సేవలందిస్తున్నాం. ప్రభుత్వ పరంగా వారికి ఉన్న పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
మేము సైతం...
రేగోడ్, న్యూస్టుడే: సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్న మాజీ సైనికులతో ఏర్పడిన పారా మిలటరీ రిటైర్డ్ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తున్నారు. రేగోడ్కు చెందిన మాజీ సైనికుడు రాజశేఖర్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి కుటుంబానికి సంఘం తరపున తమ వంచేసేందుకు రేగోడ్లో సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. రూ.50 వేల చెక్కును అందించారు.
సామాజిక సేవతోపాటు కుటుంబాలకు భరోసా
- సంగమేశ్వర్, పారామిలటరీ రిటైర్డ్ వెల్పేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు
విధి నిర్వహణలో ఉన్న సైనికుల కుటుంబాలు, విశ్రాంత సైనికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు పేద ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికను రూపొదిస్తున్నాం. అందుకోసం జిల్లాలోని మాజీ, ప్రస్తుత సైనికుల కుటుంబాలను గుర్తిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
[ 26-04-2024]
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
[ 26-04-2024]
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
[ 26-04-2024]
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!