పాఠాలకే పరిమితం.. ఆటల సాధనకు దూరం!
పాఠశాల స్థాయిలో విద్యార్థులను శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దేందుకు వ్యాయామ తరగతుల నిర్వహణకు సమయసారిణి ఖరారు చేశారు. క్రీడా సాధన..ఆటలతో విద్యార్థుల్లో ఉత్సాహం..ఉల్లాసం నింపే లక్ష్యంగా వీటిని నిర్వహించాలి.
బడుల్లో కొరవడిన సౌకర్యాలు
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ
కరణ్కోటలో ప్రభుత్వ పాఠశాల మైదానం
పాఠశాల స్థాయిలో విద్యార్థులను శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దేందుకు వ్యాయామ తరగతుల నిర్వహణకు సమయసారిణి ఖరారు చేశారు. క్రీడా సాధన..ఆటలతో విద్యార్థుల్లో ఉత్సాహం..ఉల్లాసం నింపే లక్ష్యంగా వీటిని నిర్వహించాలి. బడుల్లో మైదానాల్లేక, వ్యాయామ ఉపాధ్యాయుల కొరత కారణంగా చిన్నారులు కసరత్తుకు దూరమవుతున్న వైనంపై ‘న్యూస్టుడే’ కథనం.
పాఠశాలల్లో విద్యార్థులకు వారంలో రెండు వ్యాయామ తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ తప్పనిసరి చేసింది. క్షేత్ర స్థాయిలో చాలావరకు సదుపాయాల్లేక, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోచక ఆటలకు అందనంత దూరంగా ఉంటున్నారు. ఆసక్తి ఉన్నా అసౌకర్యాలతో సాధన చేయలేకపోతున్నారు. శిక్షకులులేక క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడం గగనంగా మారింది. క్షేత్రస్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్నిచోట్ల వారు ఉన్నప్పటికీ అనువైన మైదానాలు లేవు. ఇరుకైన తరగతి గదుల్లో పాఠాల బోధనకే పరిమితం చేస్తున్నారు.
భవిష్యత్తుపై ప్రభావం: వ్యాయామ తరగతుల నిర్వహణ వల్ల విద్యార్థులు శారీరక దేహదారుఢ్యాన్ని కలిగి ఉండేందుకు తోడ్పడుతుంది. దీంతో విద్యార్థులు చురుకుగా ఉండేందుకు దోహదపడనుంది. బడికి క్రమం తప్పకుండా హాజరయ్యేందుకు, ఉల్లాసంగా ఉండేందుకు వీలుంటుంది. అందుకు భిన్నంగా విద్యార్థులను వ్యాయామానికి దూరం చేయడంతో దుష్పరిణామాలకు దారితీస్తున్నాయి. భవిషత్తులో ఉన్నత చదువులు పూర్తిచేసి ఉద్యోగాలు పొందినా వ్యాయామానికి పరుగులు తీయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మూడు పదుల వయసులోనే వ్యాధులు చుట్టుముట్టేందుకు దారితీస్తున్నాయి. చిన్న సమస్యలకు, ఒడిదుడుకులను ఎదుర్కొనలేక వెనకబడుతున్నారు. ఉద్యోగం, కుటుంబంలోని సమస్యలను తట్టుకుని ఎదురొడ్డకుండా కుంగుబాటుకు గురవుతున్నారు.
జాడలేని క్రీడా సామగ్రి: గతంలో పాఠశాలలకు ప్రభుత్వం, దాతలు క్రీడా సామగ్రిని సమకూర్చేవారు. క్రమంగా విద్యాశాఖ ద్వారా సరఫరా నిలిచిపోయింది. పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు అందజేస్తున్న సర్కారు ఆటల సామగ్రి సరఫరాను విస్మరించింది. పాఠశాలలకు వాలీబాల్, బాస్కెట్బాల్, చెస్, క్రికెట్ బ్యాట్లు, బంతులు, స్కిప్పింగ్ రోప్లు వంటివి సమకూర్చితే సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆటల్లో రాణించేందుకు, వారిలో దాగివున్న క్రీడా ప్రతిభను చాటేందుకు, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడనుంది. గతంలో గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో గ్రామాలు, పట్టణాల్లో పలువురు దాతలు ముందుకొని బడులకు సామగ్రిని ఉచితంగా అందించే వారు. రానురాను తగ్గిపోతోంది. ప్రభుత్వం పాఠశాలల్లో మైదానాలను అందుబాటులోకి తెచ్చేందుకు, వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులను నియమించేందుకు దృష్టి సారించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
కొన్ని ఉదాహరణలు
* తాండూరు మండలం చెంగోల్ జడ్పీహెచ్ఎస్లో ఐదు గ్రామాలకు చెందిన 300లకుపైగా విద్యార్థులు చేరారు. వీరందరికీ ఆటలపై ఆసక్తి ఉన్నా, మైదానంలో మట్టి, బండరాయితోకూడిన పెద్దఎత్తున గుట్ట ఉంది. తరగతి గదుల ముందు అరకొర ఖాళీ స్థలం ఉండగా ట్యాంకులను నిర్మించారు.
* తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలతోపాటు పట్టణంలోని వేలాది మంది విద్యార్థుల క్రీడా సాధనకు, పోటీలకు చిన్నమైదానం(మినీస్టేడియం) నిర్మించారు. 2016లో తాండూరు రెవెన్యూ డివిజన్గా అవతరించడంతో అప్పట్లో చిన్నమైదానాన్ని ఆర్డీఓ కార్యాలయంగా మార్చేశారు.
* పెద్దేముల్ మండలంలో కందనెల్లి, తట్టెపల్లి, ఇందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో క్రీడలకు మైదానాలు అందుబాట్లో ఉన్నా వ్యాయామ ఉపాధ్యాయులు లేరు.
* దౌల్తాబాద్ మండలంలో ఆరు ఉన్నత పాఠశాలలు ఉండగా, మూడు పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు.
* తాండూరు పట్టణంలోని నంబర్ వన్ పాఠశాలలో జిల్లాలోనే అత్యధికంగా 756 మంది విద్యార్థులు ఉండగా వీరందరికి ఆటలు ఆడించేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. పక్కనే ఉన్న ఉర్దూ మాధ్యమ బడిలోనూ ఇదే పరిస్థితి.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 1,075
విద్యార్థులు: 90వేలు
మైదానాల్లేని బడులు: 400లకుపైగా
వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు: సుమారు 100
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
[ 26-04-2024]
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
[ 26-04-2024]
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్