logo

Telangana News: ఓయూలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం రేగింది. ముద్దం స్వామి

Published : 22 Feb 2022 13:23 IST

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం రేగింది. ముద్దం స్వామి అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నకిలీ సర్టిఫికెట్ తో విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్లాడని ఓయు విద్యార్థి నాయకుడు శరత్ హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశాడు. స్పందించిన సీపీ ఓయూ పోలీసులకు నకిలీ సర్టిఫికెట్‌పై విచారణ జరపాలని ఆదేశించారు. విచారించిన ఓయూ పోలీసులు సర్టిఫికెట్‌ నకిలీదని తేల్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఈ కేసును సిట్‌కు అప్పగిస్తామని అదనపు డీసీపీ మురళీధర్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని