చేసేది.. చేతికొచ్చేదానికే జై!
కొలువులు, కెరీర్పై బ్రెయిన్లీ సంస్థ సర్వే
ఈనాడు, హైదరాబాద్: కొలువుల విషయంలో కొత్తతరం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రస్తుత విద్యాభ్యాసం కోరుకున్న కెరీర్కు సిద్ధం చేస్తుందా? వేతనాలు, హోదా, సామాజిక ప్రభావంపై వారేమనుకుంటున్నారు? బ్రెయిన్లీ సంస్థ సర్వే చేయగా వేతనంతో పాటు హోదా ముఖ్యమని మన కుర్రకారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. పర్యావరణహితంగా నడుచుకుంటూ వేతనం తక్కువ ఇచ్చే సంస్థలో కంటే భారీగా వేతనమిచ్చే వాణిజ్య దృక్పథంతో నడిచే సంస్థకే తమ ప్రాధాన్యమని 64 శాతం మంది అంటున్నారు. హైదరాబాద్తో సహా దేశంలోని వేర్వేరు నగరాల్లో విద్యార్థుల అభిప్రాయాలను ఆన్లైన్ ద్వారా సేకరించారు.
కెరీర్ ప్రధానం.. ఇప్పటి పిల్లలు కెరీర్పై స్పష్టమైన అంచనాలతో ఉంటున్నారు. తల్లిదండ్రులు పాఠశాల దశలోనే కెరీర్కు కోసం అవసరమైన పునాదులు వేస్తున్నారు. ఈ కోణంలోనే తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. 77.8%విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టిపెట్టడం ముఖ్యమంటున్నారు.
నలుగురికీ చెప్పుకోగలిగేలా..
చేస్తున్న పనిని గర్వంగా చెప్పుకోవడమే కాదు అందుకు తగ్గ వేతనం ఉండాలంటున్నారు.
చదువుకొనే రోజుల్లో ఎన్ని కలలున్నా.. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అత్యధిక మంది విద్యార్థులు కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు నిర్ణయించుకుంటూ తగిన కొలువుల్లో చేరిపోతున్నారు.
* కుటుంబానికి ఆర్థిక చేదోడు అందించే వారు 56.1%
* భవిష్యత్తుకు ఆర్జించేవారు 49.6%
* 63% మంది కోరుకున్న కెరీర్కు ఇప్పుడున్న విద్యావిధానం సిద్ధం చేస్తుందని విశ్వసిస్తున్నారు.
* అధిక వేతనాలపై మొగ్గు.. 52.8%
* వేతనం కంటే పదవి ముఖ్యం.. 35.2%
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Sanjay Raut: మధ్యంతర ఎన్నికలొస్తే.. 100కి పైగా సీట్లు మావే: రౌత్ కీలక వ్యాఖ్యలు
-
India News
Twitter: కేంద్రంపై ట్విటర్ ‘న్యాయ’ పోరాటం..?
-
India News
Asaduddin Owaisi: తాజ్మహల్ నిర్మించకపోతే లీటరు పెట్రోల్ రూ.40కే వచ్చేది: ఒవైసీ
-
General News
APPSC: ఏపీలో 2018 గ్రూప్- 1 తుది ఫలితాలు విడుదల
-
Politics News
Ragurama: ఎంపీ రఘురామ కృష్ణరాజుపై హైదరాబాద్లో కేసు నమోదు
-
Business News
Service Charge: రెస్టారెంట్లు సర్వీసు ఛార్జ్ వసూలు చేస్తున్నాయా? ఈ నెంబరుకు ఫిర్యాదు చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!