logo

మోదీ ఆశయాలను జనాల్లోకి తీసుకువెళ్లాలి

మోదీ నాయకత్వంలో తెలంగాణలో అధికారం దిశగా భాజపా అడుగులు వేస్తోందని, ఆయన ఆశయాలను నాయకులు జనాల్లోకి తీసుకువెళ్లాలని భాజపా జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అనుపమ్‌ హజ్ర సూచించారు. పరిగిలో శుక్రవారం నియోజకవర్గ ముఖ్య

Published : 02 Jul 2022 02:04 IST

సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ కార్యదర్శి అనుపమ్‌ హజ్ర

పరిగి, న్యూస్‌టుడే: మోదీ నాయకత్వంలో తెలంగాణలో అధికారం దిశగా భాజపా అడుగులు వేస్తోందని, ఆయన ఆశయాలను నాయకులు జనాల్లోకి తీసుకువెళ్లాలని భాజపా జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అనుపమ్‌ హజ్ర సూచించారు. పరిగిలో శుక్రవారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తోందని, అందులో భాగంగానే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక జాతీయ నేతను పంపిందన్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలతో అధికారంలోకి రావాలని అందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాదరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సందానందరెడి, వెంకటయ్య మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని