logo

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ రిహార్సల్స్‌

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కాన్వాయ్‌ రిహార్సల్స్‌ నిర్వహించింది. శనివారం ఉదయం ప్రగతిభవన్‌ నుంచి బయలదేరింది. మెహిదీపట్నం, లంగర్‌హౌస్‌, రామ్‌దేవ్‌గుడా, మకైదర్వాజా మీదుగా గోల్కొండ కోటకు చేరుకుంది. సీఎం కాన్వాయ్‌లో

Published : 14 Aug 2022 03:34 IST

గోల్కొండ: స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కాన్వాయ్‌ రిహార్సల్స్‌ నిర్వహించింది. శనివారం ఉదయం ప్రగతిభవన్‌ నుంచి బయలదేరింది. మెహిదీపట్నం, లంగర్‌హౌస్‌, రామ్‌దేవ్‌గుడా, మకైదర్వాజా మీదుగా గోల్కొండ కోటకు చేరుకుంది. సీఎం కాన్వాయ్‌లో వచ్చిన ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌ కోట ప్రధాన ద్వారం వద్ద పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. గోల్కొండ కోటలో వజ్రోత్సవాల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, అదనపు డీజీ జితేందర్‌ తదితర పోలీసు ఉన్నతాధికారులు శనివారం మరోసారి పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని