logo

విమానాశ్రయంలో 258 గ్రాముల బంగారం పట్టివేత

సౌదీ అరేబియా నుంచి ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న నాలుగు బంగారు బిస్కెట్లను ఆదివారం శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 15 Aug 2022 03:16 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: సౌదీ అరేబియా నుంచి ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న నాలుగు బంగారు బిస్కెట్లను ఆదివారం శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు దమ్మం నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో స్వదేశానికి వచ్చారు. ఈ క్రమంలో 258 గ్రాముల బంగారం బిస్కెట్లను తన సామగ్రిలో రహస్యంగా పెట్టుకొని తీసుకొచ్చాడు. ప్రయాణికుడి ప్రవర్తనపై భద్రతాధికారులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని క్షుణ్నంగా తనిఖీ చేయగా గుట్టురట్టయింది. రూ.13.63 లక్షల విలువ ఉంటుందని అధికారుల తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని