logo

బడ్జెట్‌లో బీసీలకు రూ.12 వేల కోట్లు కేటాయించాలి

రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.12 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Published : 04 Feb 2023 03:19 IST

మాట్లాడుతున్న రాజేందర్‌పటేల్‌గౌడ్‌

గోల్నాక, న్యూస్‌టుడే: రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.12 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని కోరారు. గత బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి సర్కార్‌ రూ.5,698 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. శుక్రవారం చాదర్‌ఘాట్‌ మోతీ మార్కెట్‌లోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ బంధు ప్రకటించి ప్రత్యేకంగా రూ.20 వేల కోట్లు కేటాయించాలన్నారు. భూషణ్‌భాస్కర్‌, ప్రదీప్‌గౌడ్‌, ధీరేంద్రయాదవ్‌, నవీన్‌గౌడ్‌, నర్సింగ్‌, నేమూరి సాంబశివగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని