logo

రూ.250 కోట్లతో మల్కారం చెరువులో మురుగు శుద్ధి

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్తకుప్పల నుంచి విడుదలైన గాఢ మురుగు జలం శుద్ధి ప్రక్రియ పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆదివారం ట్విటర్‌లో పేర్కొన్నారు.

Published : 20 Mar 2023 02:28 IST

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్తకుప్పల నుంచి విడుదలైన గాఢ మురుగు జలం శుద్ధి ప్రక్రియ పూర్తి స్థాయిలో జరుగుతున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆదివారం ట్విటర్‌లో పేర్కొన్నారు. రూ.250కోట్లతో మల్కారం చెరువులో చేరిన మురుగు నీటిని 2ఎంఎల్‌డీ సామర్థ్యంతో కూడిన ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌తో శుద్ధి చేసి వదులుతున్నామన్నారు. గడువులోపు పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని