logo

గోల్డేజ్‌ హోమ్‌లో వృద్ధుడి ఆత్మహత్య

ఐఎస్‌సదన్‌ డివిజన్‌ శంకేశ్వర్‌బజార్‌లోని గోల్డేజ్‌ హోమ్‌ (వృద్ధాశ్రమం)లో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం.. అక్బర్‌ అలీ(68) భార్యతో కలిసి సేవలు పొందుతున్నారు.

Published : 23 Mar 2023 01:55 IST

సైదాబాద్‌, న్యూస్‌టుడే: ఐఎస్‌సదన్‌ డివిజన్‌ శంకేశ్వర్‌బజార్‌లోని గోల్డేజ్‌ హోమ్‌ (వృద్ధాశ్రమం)లో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం.. అక్బర్‌ అలీ(68) భార్యతో కలిసి సేవలు పొందుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి ఆస్ట్రేలియాలో ఉండగా గతంలో చిన్నబ్బాయి మితిమీరిన అప్పులు చేసి అదృశ్యమయ్యాడు. దీంతో పెద్దబ్బాయి వీరిని గోల్డేజ్‌ హోమ్‌లో చేర్పించాడు. మంగళవారం అక్బర్‌ అలీ బాత్రూమ్‌ కడిగే ద్రావణాన్ని తాగాడు. గమనించిన సిబ్బంది కర్మన్‌ఘాట్‌లోని అవేర్‌ గ్లోబల్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాధితుడు బుధవారం మృతిచెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని