logo

టీఎస్‌ఆర్టీసీ విశ్రాంత అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నాగవేందర్‌రావు

టీఎస్‌ఆర్టీసీ విశ్రాంత అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎంవీ నాగవేందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Published : 29 Mar 2023 02:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ విశ్రాంత అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎంవీ నాగవేందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన వరుసగా ఈ పదవికి మూడోసారి ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఆర్‌.నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా పి.విజయ కుమార్‌, సంయుక్త కార్యదర్శిగా సీతారామబాబు, కోశాధికారిగా గోపాలకృష్ణ నియమితులయ్యారు. ఈసీ సభ్యులుగా కొమురయ్య, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్‌, దేవదానం, విజయవల్లి, వెంకటరెడ్డి ఉన్నారు. పదవీ విరమణ చేసిన అధికారులతోపాటు ఆర్టీసీ ఉద్యోగులందరి ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామని, టీఎస్‌ఆర్టీసీ ఎదుగుదలకు విలువైన సూచనలు చేయాలని కొత్త కార్యవర్గాన్ని ఉద్దేశించి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు.
š

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని