Hyderabad: ఇద్దరు చిన్నారులు కిడ్నాప్.. గంటల వ్యవధిలో నిందితుల అరెస్టు
హైదరాబాద్లో ఫుట్పాత్లపై నిద్రిస్తున్న తల్లిదండ్రుల వద్ద నుంచి ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు గంటల వ్యవధిలో అరెస్టు చేసి చిన్నారులను సురక్షితంగా కాపాడారు.
రెజిమెంటల్బజార్(హైదరాబాద్): సికింద్రాబాద్, సుల్తాన్బజార్ ప్రాంతాల్లో ఫుట్పాత్పై తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసిన ఓ మహిళతో పాటు ఆటోడ్రైవర్ను మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆదివారం మహంకాళి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనాదీప్తి, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్లు కావేటి శ్రీనివాసులు, నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు.
ఫలాక్నుమా ఇస్పాన్ హోటల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న షేక్ ఇమ్రాన్ (36) ఆటోడ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్ టౌన్లో నివాసం ఉండే సలీమ్ భార్య పర్వీన్ (30) గృహిణి. ఇంట్లో భర్తతో గొడవపడి శుక్రవారం నగరానికి వచ్చింది. అనంతరం కోఠి ప్రాంతానికి వెళ్లి అక్కడే ఫుట్పాత్పై ఉండగా శనివారం రాత్రి ఆటోడ్రైవర్ ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి చిన్నారుల అపహరణకు తెరలేపారు.
పథకం ప్రకారమే కిడ్నాప్లు..
కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన కాలే దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. గత 30 ఏళ్లగా హైదరాబాద్లోని ప్రధాన జంక్షన్ల వద్ద బెలూన్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఏడుగురు సంతానం ఉన్నారు. ప్రస్తుతం ప్యారడైజ్ ప్రాంతంలోని ఫుట్పాత్పై ఉంటున్నారు. అయితే శనివారం రాత్రి ప్యారడైజ్ సిగ్నల్లో సమీపంలోని ఫుట్పాత్పై భార్య పిల్లలతో కలిసి నిద్రిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు 3.30గంటల సమయంలో ఆటోలో వచ్చిన నిందితులు కాలే కుమార్తె కరిష్మా( మూడున్నరేళ్లు)ను ఎత్తుకుని ఆటోలో వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గుర్తించి ఆటోలో పాపను ఎత్తుకుని వెళ్లిన విషయాన్ని బాధితులకు తెలియజేశాడు. అతడి ద్విచక్రవాహనంపైనే వారు వెళ్లిన ట్యాంక్బండ్, ఇతర ప్రాంతాల్లో గాలించారు. ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో బాధితుడు మహంకాళి పోలీసులకు 4.15గంటల సమయంలో వచ్చి తన కుమార్తె కిడ్నాప్ అయినట్టు ఫిర్యాదు చేశాడు.
మహంకాళి పోలీసులు అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా అదే సమయంలో సుల్తాన్బజార్లోని హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో ఫుట్పాత్పై తల్లిదండ్రులతో పాటు నిద్రిస్తున్న శివకుమార్(7నెలలు)ను ఆటోలో వచ్చిన ఇద్దరు కిడ్నాప్ చేశారని ఫిర్యాదుతో సుల్తాన్బజార్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదైంది. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డులను కూడా పోలీసులు పరిశీలించి ఆటోను గుర్తించారు. రెండు గంటల్లోనే ప్యారడైజ్ వద్ద పాపను కిడ్నాప్ చేసిన నిందితులు సుల్తాన్బజార్ ప్రాంతంలో మరో బాలుడిని కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు. ఆటోడ్రైవర్ షేక్ ఇమ్రాన్ ఇంటివద్ద కిడ్నాప్ అయిన ఇద్దరు చిన్నారులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇమ్రాన్, పర్వీన్ను అరెస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?