logo

నల్లబజారులో ఐపీఎల్‌ టికెట్లు.. ముగ్గురి అరెస్టు

ఐపీఎల్‌ టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న ముగ్గురిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 27 Mar 2024 01:09 IST

రాంనగర్‌, న్యూస్‌టుడే: ఐపీఎల్‌ టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న ముగ్గురిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సీఐ సీతయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌కు చెందిన విజయ్‌, ప్రణయ్‌, సాత్విక్‌ బుధవారం హైదరాబాదులో జరిగే   మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లను మంగళవారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకొని రూ.1500 టికెట్లు ఆరు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని