తొలిఘట్టం మొదలైంది..
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు.
ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న మధు
ఈనాడు, హైదరాబాద్, రాజేంద్రనగర్, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. రాజధాని పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాలుండగా.. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు ఒక్కరు కూడా నామినేషన్ పత్రాలు సమర్పించలేదు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఇద్దరు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె.శశాంకకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
వెంకట్రమేష్
పార్టీలు వేరే.. ప్రధాన ప్రత్యర్థులు వారే
రాజేంద్రనగర్, న్యూస్టుడే: చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు గతంలోనూ ప్రత్యర్థులుగా బరిలో ఉన్న వారే కావడం విశేషం. అయితే గత ఎన్నికలలో ఇద్దరు వేరే పార్టీల నుంచి పోటీ చేయగా ప్రస్తుతం పార్టీలు మారి మళ్లీ బరిలో నిలిచారు. ఇందులో భాజపా అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి ఒకరు కాగా మరొకరు ప్రస్తుత ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డి. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. గత లోక్సభ ఎన్నికలలో రంజిత్రెడ్డి భారాస నుంచి పోటీలో నిలిచి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన పార్టీ మారి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. గతం, ప్రస్తుతం రెండు సందర్భాల్లోనూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచే రంజిత్రెడ్డి బరిలో ఉండడం గమనార్హం. ఇక గత ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ఈసారి ఎన్నికలలో భాజపా నుంచి పోటీలో ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారాస నుంచి బీసీ వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ పోటీపడుతున్నారు.
మహ్మద్రిజ్వాన్
తహసీల్ కార్యాలయంలో ప్రకటన సమాచారం
పత్రాన్ని చూపుతున్న తహసీల్దార్, విజయ్కుమార్
కొడంగల్,న్యూస్టుడే:పార్లమెంట్ ఎన్నికల సమాచారం ప్రజలకు, నేతలకు చేరువ చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు. కొడంగల్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ సమాచారం నోటిస్ బోర్డులో అతికించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బి.విజయ్కుమార్ మాట్లాడుతూ నామినేషన్ వేసే అభ్యర్థులు దరఖాస్తును మహబూబ్నగర్లో తీసుకొని అక్కడే నామినేషన్ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు.
డీకే అరుణ, మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్ నామినేషన్ దాఖలు
ఈనాడు, మహబూబ్నగర్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి భాజపా నుంచి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రెండు సెట్ల నామపత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఆమె ఉదయం మహబూబ్నగర్ పట్టణం పిల్లలమర్రి రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహబూబ్నగర్ - భూత్పూర్ మార్గంలో కార్యకర్తల భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి, పార్టీ సీనియర్ నేత నాగురావు నామాజీతో కలిసి రిటర్నింగ్ అధికారి రవినాయక్కు నామపత్రాలు అందించారు. ఈ లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్ నామపత్రాలు దాఖలు చేశారు.
నేడు వంశీచంద్రెడ్డి నామినేషన్కు సీఎం రేవంత్ రెడ్డి రాక..: నామినేషన్లకు ఈ నెల 18వ, 19వ, 25వ తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయి. గురువారం నామపత్రాలు దాఖలు చేయని ప్రధాన పార్టీ అభ్యర్థులు శుక్రవారం సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారం మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ నుంచి ర్యాలీగా తరలివెళ్లి నామపత్రాలు దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామపత్రాల దాఖలు అనంతరం గడియారం చౌరస్తాలో జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొని ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం పోలీసులు మహబూబ్నగర్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భారాస మహబూబ్నగర్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, నాగర్కర్నూల్ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్లు కూడా శుక్రవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు.
డీకే అరుణ ఆస్తుల వివరాలు
చరాస్తుల విలువ : రూ.3,21,73,518
స్థిరాస్తుల విలువ : రూ.3,10,00,000
బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు : లేవు
ప్రస్తుతం దగ్గర ఉన్న నగదు : రూ.1,50,000
డీకే అరుణ భర్త భరతసింహారెడ్డి ఆస్తులు..
చరాస్తుల విలువ : రూ.23,26,16,353
స్థిరాస్తులు విలువ : రూ.37,17,80,000
బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు : రూ.1,38,79,619
ప్రస్తుతం దగ్గర ఉన్న నగదు : 20,00,000
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పోలింగ్ సమయం పెంచిన ఈసీ
[ 01-05-2024]
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. -
తెలంగాణలో నిప్పులు చెరిగిన భానుడు
[ 01-05-2024]
రాష్ట్రంలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. -
భాజపా కుట్రను తిప్పికొట్టేందుకు పోరాడుతా: సీఎం రేవంత్రెడ్డి
[ 01-05-2024]
భాజపా కుట్రను తిప్పి కొట్టేందుకు కచ్చితంగా పోరాడుతానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
[ 01-05-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో భారాస నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వంట ఆలస్యమైందని భార్య హత్య
[ 01-05-2024]
ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రం నుంచి నాలుగు రోజుల క్రితం నగరానికి వలసొచ్చిన ఆ కుటుంబం మనుగడ మూణ్నాళ్ల ముచ్చటైంది. వంట ఆలస్యంపై దంపతుల మధ్య తలెత్తిన వివాదంలో క్షణికావేశానికి లోనైన భర్త ఇటుకతో భార్య తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
దివ్యాంగుడిని చితకబాది.. వృద్ధురాలిపై దాడి
[ 01-05-2024]
తన సెల్ఫోన్ను ఓ వ్యక్తి తీసుకొని తిరిగివ్వడంలేదని ఫిర్యాదు చేయడమే ఆ దివ్యాంగుడు చేసిన పాపం. రెండు కాళ్లు పనిచేయని అతడిని కానిస్టేబుల్ దారుణంగా చితకబాదాడు. తన కుమారుడిని ఎందుకు కొట్టారని ప్రశ్నించిన అతని తల్లినీ వదల్లేదు. -
నా ఒక్క ఓటే కదా... అనుకుంటే ఎలా?
[ 01-05-2024]
‘నా ఒక్క ఓటే కదా.. వేయకపోతే ఏమవుతుంది’ చాలా మందిలో ఉన్న భావన ఇదే. ఓటు హక్కు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటు వేసేందుకు చాలామంది ఆసక్తి చూపించరు. ఇలా ప్రతి ఒక్కరు నా ఒక్క ఓటే కదానుకుంటే అనర్హులు అందలమెక్కే ప్రమాదం ఉందని భావించాలి. -
మొబైల్ కోసం వ్యక్తి దారుణ హత్య
[ 01-05-2024]
గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
[ 01-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. నిత్యం 40-42 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 11 మంది మృత్యువాత పడ్డారు. -
ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి
[ 01-05-2024]
ప్రియురాలితో కలిసి ఓయో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఎస్సార్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై శ్రావణ్కుమార్ వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ (28) ఇటుకల వ్యాపారం చేస్తున్నాడు. -
మనోళ్లే పనోళ్లు.. బినామీ వసూళ్లు
[ 01-05-2024]
ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలని రాజకీయ నాయకులు.. ఎవరికి ఓటేయాలని ఓటర్లు ఆలోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాల్లోని కొందరు అధికారులు మాత్రం.. ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో మరోసారి సొమ్ము చేసుకోవడంపై దృష్టి సారించారు. -
సుడిగాలిలా చుట్టి రావలె
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార గడువు మరో పదకొండు రోజుల్లో ముగియనుంది. మొన్నటి వరకు పూర్తిస్థాయిలో ప్రచారం చేయని అభ్యర్థులు ఇప్పుడు గడువు దగ్గరపడుతుండడంతో రాత్రిపగలూ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. -
ఫలితాల్లో.. ‘పది’ పోయింది
[ 01-05-2024]
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా కిందకు దిగింది. 33 జిల్లాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే వరుసలో రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాలు నిలబడ్డాయి. -
కాలు కదలాలంటే.. డబ్బులు చేతిలో పడాల్సిందే!
[ 01-05-2024]
ప్రధాన పార్టీలు నిర్వహించే ర్యాలీలు, కూడళ్ల సమావేశాలకు జనం తరలింపు పెద్ద తలనొప్పిగా మారుతోంది. నగరంలో సభలు, సమావేశాలు, కూడళ్ల జాతరకు జనం స్వచ్ఛందంగా రావాలంటే కష్టమే. -
ఎర్లీబర్డ్లో రూ.820 కోట్ల పన్ను వసూలు
[ 01-05-2024]
ఆర్థిక సంవత్సరం(2024-25) మొదటి నెలలోనే జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం దాదాపు 40శాతం ఆస్తిపన్నును వసూలు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30 వరకు గ్రేటర్ పరిధిలో ఎర్లీబర్డ్ పథకం అమలైంది. -
డిటోనేటర్ పరిశ్రమలో భారీ పేలుడు: ఒకరి మృతి
[ 01-05-2024]
డిటోనేటర్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలి ఓ కార్మికుడు సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదం సోమవారం రాత్రి జరిగినా, పరిశ్రమ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వస్తుందని..మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోలీసులకు తెలియకుండా జాగ్రత్తపడింది. -
కన్నడిగులపై కన్ను
[ 01-05-2024]
నగరంలోని కన్నడిగులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మొదలుపెట్టింది. అక్కడి నేతలను రంగంలోకి దించడానికి కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ ప్రచారం చేయాలని కర్ణాటక నేతలను టీపీసీసీ నాయకులు కోరుతున్నారు. -
రాజకీయక్షేత్రం సకుటుంబ రాజకీయ ప్రచారం
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాదు..అభ్యర్థుల కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సొంత బాణీతో ఆకట్టుకుంటున్నారు. -
కొండంత న్యాయం నావైపే
[ 01-05-2024]
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఉప్పర్పల్లిలోని రాజేంద్రనగర్ కోర్టుల సముదాయంలో న్యాయవాదులను కలిసి సహకారం అభ్యర్థించారు. -
భేషజాలు వద్దు.. సమన్వయంతో పనిచేయండి
[ 01-05-2024]
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పనిచేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మెదక్ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. -
బాబూజీ మార్గదర్శకాలు.. ఉజ్వల భవిష్యత్తుకు నాంది
[ 01-05-2024]
బాబూజీ మహరాజ్ మార్గదర్శకాలు.. ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. -
నాగన్పల్లి పాఠశాలలో శతశాతం ఉత్తీర్ణత
[ 01-05-2024]
ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లిలోని రామోజీ ఫౌండేషన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు శత శాతం ఉతీర్ణులయ్యారు. 2018 వరకు ఈ గ్రామంలో శిథిలమైన ఇరుకైన 4గదుల్లో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల సాగేది. -
భారాస కథ ముగిసింది.. భవిష్యత్తు అంతా కాంగ్రెస్దే: వీర్లపల్లి
[ 01-05-2024]
తెలంగాణలో భారాస కథ ముగిసిందని, ఇక భవిష్యత్తు అంతా కాంగ్రెస్దే అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్కు తరలివస్తున్నారని, పార్టీలోకి ఎవరు వచ్చినా ఘనంగా స్వాగతిస్తామన్నారు. -
భాజపాతోనే రైతు సంక్షేమం: విశ్వేశ్వర్రెడ్డి
[ 01-05-2024]
భాజపాతోనే దేశంలోని రైతులందరికీ సంక్షేమం దక్కుతుందని ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్లలో మంగళవారం నిర్వహించిన భాజపా కిసాన్మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను రాజు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. -
కేంద్రంలోనూ అధికారంలోకి రావడం ఖాయం: కాంగ్రెస్
[ 01-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలించిన భాజపా, భారాసలకు ఇవే చివరి ఎన్నికలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొర్ర జ్ఞానేశ్వర్ముదిరాజ్ అన్నారు. -
మళ్లీ నిరాశే..
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లా మళ్లీ అట్టడుగున నిలిచింది. గతేడాదిలాగే ఈసారీ 33వ స్థానంతో నిరాశ పరిచింది. గతేడాది కంటే ఉత్తీర్ణత 6 శాతం పెరగడం మాత్రం ఊరట కలిగించే అంశం. 2022-23 విద్యాసంవత్సరంలో 59.46 శాతం పాస్ కాగా.. ఈసారి(2023-24)లో 65.10 శాతం నమోదైందని సర్ది చెబుతున్నారు. -
మాదిగలు ఏ పార్టీలో ఉన్నా భాజపాకే ఓటేయండి: మందకృష్ణ
[ 01-05-2024]
-
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తేనే రాష్ట్రం సుభిక్షం
[ 01-05-2024]
మతతత్వ పార్టీల మాటలు నమ్మరాదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. మంగళవారం మోమిన్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. -
ఐపీఎల్ ఒరవడి.. అభిమాన సందడి
[ 01-05-2024]
కొండాపూర్లోని శరత్సిటీ క్యాపిటల్ మాల్లో మంగళవారం ఐపీఎల్ క్రికెటర్లు సందడి చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్కుమార్రెడ్డి, ఉనద్కత్, నటరాజన్ విచ్చేసి అభిమానులతో ఉత్సాహంగా గడిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్