logo

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తేనే రాష్ట్రం సుభిక్షం

మతతత్వ పార్టీల మాటలు నమ్మరాదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుందామని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మోమిన్‌పేటలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.

Published : 01 May 2024 03:48 IST

సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

మోమిన్‌పేట, న్యూస్‌టుడే: మతతత్వ పార్టీల మాటలు నమ్మరాదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుందామని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మోమిన్‌పేటలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అంబేడ్కర్‌ కూడలి నుంచి వేదిక వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని సమావేశంలో మాట్లాడారు. మతాన్ని అడ్గుపెట్టుకొని రాజకీయాలు చేసే భాజపా నాయకుల మాటలు నమ్మి మోసపోరాదన్నారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సీనియర్‌ నాయకుడు నరోత్తంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శంకర్‌, నాయకులు మహేందర్‌రెడ్డి, బాగ్దాద్‌, సుభాష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని