logo

మాదిగలు ఏ పార్టీలో ఉన్నా భాజపాకే ఓటేయండి: మందకృష్ణ

Published : 01 May 2024 03:48 IST

మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

వికారాబాద్‌, న్యూస్‌టుడే: మాదిగలు ఏ పార్టీలో ఉన్నా భాజపాకే ఓటేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం వికారాబాద్‌ పట్టణంలోని చిగుళ్లపల్లి మైదానంలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ ఉప కులాల ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌, భారాస మాదిగలను మోసం చేశాయన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో ఒక్క మాదిగకూ పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. భాజపా మూడు స్థానాల్లో మాదిగలకు అవకాశం ఇచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోదీ అనుకూలంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వలేదన్నారు. అంతకుముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, భాజపా జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త వడ్ల నందు, నాయకులు నవీన్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు ఆనంద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని