మనోళ్లే పనోళ్లు.. బినామీ వసూళ్లు
ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలని రాజకీయ నాయకులు.. ఎవరికి ఓటేయాలని ఓటర్లు ఆలోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాల్లోని కొందరు అధికారులు మాత్రం.. ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో మరోసారి సొమ్ము చేసుకోవడంపై దృష్టి సారించారు.
ఎంపీ ఎన్నికల పనులపై కన్నేసిన అధికారులు
బంధువుల పేరుతో దందా
ఈనాడు, హైదరాబాద్
ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలని రాజకీయ నాయకులు.. ఎవరికి ఓటేయాలని ఓటర్లు ఆలోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాల్లోని కొందరు అధికారులు మాత్రం.. ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో మరోసారి సొమ్ము చేసుకోవడంపై దృష్టి సారించారు. ఖర్చుకు ఐదింతలు సంపాదించడం ఎలా అని లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని సర్కిళ్లలో అధికారుల మధ్య నువ్వా.. నేనా అన్నట్లు పోటీ ఉంది. ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు రూ.లక్షలు వెనకేసుకున్నారు. ఇప్పుడు మాకూ అవకాశమివ్వండని’ తోటి ఉద్యోగులు గగ్గోలు పెడుతుండడంతో ఉన్నతాధికారులు తలలుపట్టుకుంటున్నారు.
టెండరుకే ‘టెండరు’..
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ గతేడాది అక్టోబరు 28న ఎన్నికల పనులకు టెండరు పిలవాలని, లైసెన్సు ఉన్న గుత్తేదారులతో పనులు చేయించాలని సర్క్యులర్ ఇచ్చారు. ఎల్బీనగర్, ఖైరతాబాద్, చార్మినార్ తదితర జోనల్ కమిషనర్లు ఆ నిబంధనను పూర్తిగా అమలు చేయలేదు. ఈవీఎంలను భద్రపరిచే గదుల వద్ద ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు పనులు, ఇంజినీరింగ్ పనులకు టెండర్లు పిలిచారు. శిక్షణ తరగతులకు భోజనాల సరఫరా, సిబ్బంది నియామకం, టెంట్లు, ఎన్నికల సామగ్రి, జిరాక్సు మిషిన్లు- బీరువాల కొనుగోలు, ఈవీఎంల తరలింపు, వాహనాలను సమకూర్చడం తదితర పనులను నామినేషన్లపై బంధువులు, బినామీ గుత్తేదారులకు అప్పగించారు. ఇష్టానుసారం ఖర్చులు రాసుకుని.. ఆయా సంస్థల లెటర్ హెడ్లపై బిల్లులు తీసుకున్నారు.
ఎక్కడెక్కడ ఎవరెవరు..
- ప్రస్తుతం ఎన్నికలు పార్లమెంటు నియోజకవర్గాలకు జరుగుతున్నప్పటికీ..ఏర్పాట్లు అసెంబ్లీ స్థానాలవారీగా జరుగుతాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు రెవెన్యూ శాఖ అధికారులు ప్రస్తుతం సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉండగా.. జోనల్ కమిషనర్లు సంబంధిత నియోజకవర్గాలకు ఏఆర్ఓలుగా పనిచేస్తున్నారు. డీఈఓ హోదాలో రోనాల్డ్రాస్ ఇచ్చిన ఉత్తర్వు హైదరాబాద్ జిల్లాకే వర్తిస్తుందని.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టెండరు లేకుండా పనులు చేద్దామని ఓ డిప్యూటీ ఇంజినీరు జోనల్ అధికారితో మంతనాలు చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. గతంలో సదరు ఇంజినీరు మురారి, వెంకటేశ్ తదితర బినామీ పేర్లతో భారీగా బిల్లులు పెట్టారనే విమర్శలున్నాయి.
- ఎల్బీనగర్ జోనల్ పారిశుద్ధ్య విభాగంలోని డిప్యూటీ ఇంజినీరు అసెంబ్లీ ఎన్నికలప్పుడు భోజనాలు సరఫరా చేసి రూ.లక్షల బిల్లులు తీసుకున్నారని.. ఆ ఇంజినీరు ఇంటి గృహప్రవేశానికి అయిన భోజనాల ఖర్చునూ ఎన్నికల వ్యయంలో కలిపేశారనే విమర్శలున్నాయి.
- కేంద్ర కార్యాలయం ఎన్నికల విభాగంలోని ఓ ఉన్నతాధికారి బంధువు భాగస్వామిగా ఉన్న సాయి ఎంటర్ప్రైజెస్కు గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు అనేక పనులు అప్పగించారు. ప్రజాపాలన దరఖాస్తుల డిజిటలీకరణ, ఓటర్ల నమోదు, ఇతర పనుల్లో అవకతవకలకు పాల్పడినా ఆ సంస్థపై చర్యలు లేవు. సాయి, జోయ్, ఈశ్వర్ అనే సంస్థలకు ప్రస్తుతం పాతబస్తీలోని ఎన్నికల ఏర్పాట్లను అప్పగిస్తున్నారని, మరో ముగ్గురు సహాయ మున్సిపల్ కమిషనర్లు సొంతంగా పనులు చేసేందుకు పోటీ పడుతున్నారని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓటరు సల్లగుండాలని..
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది. ఎండలు అదిరిపోతున్నాయి. మండుటెండలో వెళ్లి ఓటు వేయాలా? అని కొందరు బద్ధకించి ఊరుకునే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎన్నికల అధికారులు.. ఓటర్లకు చల్లదనంతో ఉపశమనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ప్రాంగణాల్లో టెంట్లు, టెంట్ల కింద కుర్చీలు, కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. గదుల్లో ఉండే ఎన్నికల సిబ్బందికి ఫ్యాన్ల కొరత లేకుండా చూడాలని నిర్ణయించారు. చల్లటి క్యాన్లలో నీరు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇలా ఓటర్లు ఎండలకు ఇబ్బంది పడకుండా తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
న్యూస్టుడే, శేరిలింగంపల్లి
సారూ.. ఎంతిస్తారూ..
మండుతున్న ఎండల్లో ప్రచారం అంటే కష్టమే. అందుకే ప్రచారానికి వచ్చే వారికి ఇచ్చే డబ్బులు కూడా మండిపోతున్నాయని నేతలు వాపోతున్నారు.ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు, సభలకు సంబంధించి కూలీలను తెచ్చుకుని వెంటతిప్పుకొంటూ హడావుడి చేయడం ఎన్నికల్లో ఆనవాయితీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇందుకోసం ఒక్కొక్కరికీ రూ.300- 500 వరకు చెల్లించారు. ఈ విడత అంత మొత్తానికి వచ్చేది లేదంటూ కూలీలు తేల్చి చెబుతున్నారు. కనీసం రూ.వెయ్యి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎండల్లో తిరగాలి కాబట్టి అడిగినంతా ఇవ్వాల్సివస్తుండడంతో ఆయా పార్టీల నాయకగణం లెక్కల్లో తేడా వస్తుందని మదనపడి పోతున్నారు.
న్యూస్టుడే, షాద్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది
[ 21-05-2024]
నగరంలో నాలుగు ఎంపీ సీట్లతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. -
వీడియోలు చూసి.. చోరీ చేసి
[ 21-05-2024]
ఎలాగైనా డబ్బు సంపాదించాలి. పేదరికం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో నలుగురు దేశ సరిహద్దు దాటారు. -
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
[ 21-05-2024]
బెంగళూరు శివారులో రేవ్ పార్టీ ఉదంతం హైదరాబాద్లో ప్రకంపనలు రేపుతోంది. నగర శివార్లలోని ఫాంహౌస్లలో తరచూ డ్రగ్స్ పట్టుబడడంతో పోలీసులు కఠిన చర్యలకు దిగారు. -
భర్తను వేధిస్తున్న భార్యపై కేసు
[ 21-05-2024]
భర్తను ఎంతోకాలంగా వేధిస్తూ.. చివరకు కూరగాయల కత్తితో దాడికి పాల్పడిన మహిళపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
వరద కదలక.. దారి వదలక
[ 21-05-2024]
వర్షాకాలం ఇంకా మొదలవలేదు. అడపాదడపా కురిసే అకాల వర్షాలకే నగరంలో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. -
విద్యా ప్రమాణాలు.. ఉపాధికి అవకాశాలు
[ 21-05-2024]
విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిటీ కళాశాల న్యాక్ (నేషనల్ అసెస్మెంట్, అక్రిడేషన్ కౌన్సిల్)గుర్తింపు కోసం వడివడిగా అడుగులు వేస్తున్నాయి. -
అనుమతి అడిగితే.. డబ్బులడిగారు!
[ 21-05-2024]
కూల్చిన ప్రహరీ, గదిని పునర్నిర్మించుకోవడానికి ఓ వ్యక్తి అనుమతి కోరగా అతడి నుంచి లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, కారోబార్లు అనిశా వలకు చిక్కారు. -
తాగునీటికి ఆరాటం.. ప్రాణాలతో చెలగాటం
[ 21-05-2024]
తాగునీటి కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితులకు ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. బాలానగర్ డివిజన్ రాజీవ్గాంధీనగర్లోని నాలాను ఆనుకొని కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. -
గుర్రపు పందేలపై బెట్టింగ్లు.. ఆరుగురి అరెస్ట్
[ 21-05-2024]
గుర్రపు పందేలు కాస్తూ.. బైక్లతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా బస్సు అద్దాలు పగులగొట్టిన ఘటనల్లో రెండు కేసులు నమోదు చేసినట్లు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్రెడ్డి తెలిపారు. -
బోటు షికారు.. పోటెత్తిన హుషారు
[ 21-05-2024]
అసలే వేసవి సెలవులు.. అందులోనూ వాతావరణం చల్లగా మారి నాలుగైదు రోజులుగా చినుకులు పలకరిస్తున్నాయి. -
కోడ్ ముగిసిన వెంటనే కొత్త ఎస్టీపీలకు టెండర్లు
[ 21-05-2024]
ఔటర్ పరిధిలో కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీలు) నిర్మాణానికి జలమండలి ప్రణాళిక రంగం సిద్ధం చేసింది. -
వరదతో కలిసి.. మురుగు తిష్ఠవేసి
[ 21-05-2024]
నగరంలో వర్షం మొదలైందంటే చాలు.. మురుగు రోడ్లను ముంచెత్తుతోంది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు మ్యాన్హోళ్ల నుంచి వరద పోటెత్తుతోంది. -
జేఎన్జీపీకి రాష్ట్రస్థాయి ర్యాంకులు
[ 21-05-2024]
ఈసెట్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ వినయ్కుమార్ తెలిపారు. -
సమస్యల వలయంలో.. సరస్వతీ నిలయాలు
[ 21-05-2024]
జిల్లాలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే సరస్వతీ నిలయాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఆరోగ్య పరీక్ష.. బాలింతకు రక్ష
[ 21-05-2024]
పుట్టిన శిశువుతో పాటు తల్లిని కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా స్త్రీ వ్యాధి నిపుణులు సూచిస్తుంటారు. -
వరద పారే దారేది..?
[ 21-05-2024]
జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులోని పలు కాలనీలకు వర్షా కాలంలో వరద ముప్పు తప్పేలా లేదు. -
పిడుగుపాటుకు మరొకరి మృతి
[ 21-05-2024]
జిల్లాలో తాండూరు, కొడంగల్ నియోజక వర్గాల పరిధిలో పిడుగు పడిన వేర్వేరు ఘటనల్లో ఒకరు మృతి చెందగా, ఓ బాలుడు స్పృహ కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
కోర్టు కేసున్న భూమి పట్టా ఎలా మార్చారు?
[ 21-05-2024]
కోర్టు కేసు ఉన్న భూమి పట్టాను ఎలా మార్చారని హక్కుదారులైన మహిళలు తహసీల్దార్తో వాగ్వాదానికి దిగిన ఘటన బషీరాబాద్లో సోమవారం చోటుచేసుకుంది. -
పెట్టుబడులకు లాభాలంటూ మోసం
[ 21-05-2024]
ఆయుర్వేదిక్ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని జనాలను నమ్మించి ముగ్గురు నిందితులు రూ.8.23 కోట్లు కొట్టేశారు. -
వానమ్మా.. వానమ్మా ఈ కష్టాలు ఏంటమ్మా
[ 21-05-2024]
వర్షాలు వస్తూవస్తూనే నగర ప్రజలకు కష్టాలను తెస్తున్నాయి. కొన్ని రోజులుగా నిత్యం ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. రహదారులపై నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
కళాకారులు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారు
[ 21-05-2024]
కళాకారులు ప్రజల హృదయాల్లో ఉంటారని అలాంటి వారే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని సినీ నటుడు మురళీమోహన్ కీర్తించారు. -
తెలుగు జాతీయతకు ప్రతీక ప్రకాశం పంతులు
[ 21-05-2024]
తెలుగు జాతీయతకు ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా, అలుపెరుగని కార్యదీక్షాపరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని మంత్రి శ్రీధర్బాబు కీర్తించారు. -
ప్రవాసాంధ్రుల ఆస్తుల రక్షణకు మంత్రి హామీ
[ 21-05-2024]
తెలంగాణలోని ప్రవాసాంధ్రుల ఆస్తులకు రక్షణను కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు నగరానికి చెందిన ప్రవాసాంధ్రుడు వడ్డేపల్లి రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సన్నవడ్లకు క్వింటాల్కు ₹500బోనస్.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
[ 21-05-2024]
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టార్ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్గా డెలివరీ బాయ్
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
-
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?