logo

భారాస కథ ముగిసింది.. భవిష్యత్తు అంతా కాంగ్రెస్‌దే: వీర్లపల్లి

తెలంగాణలో భారాస కథ ముగిసిందని, ఇక భవిష్యత్తు అంతా కాంగ్రెస్‌దే అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌కు తరలివస్తున్నారని, పార్టీలోకి ఎవరు వచ్చినా ఘనంగా స్వాగతిస్తామన్నారు.

Updated : 01 May 2024 05:09 IST

పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్యే శంకర్‌, ప్రతాప్‌రెడ్డి

షాద్‌నగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో భారాస కథ ముగిసిందని, ఇక భవిష్యత్తు అంతా కాంగ్రెస్‌దే అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌కు తరలివస్తున్నారని, పార్టీలోకి ఎవరు వచ్చినా ఘనంగా స్వాగతిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నాగులపల్లి మాజీ సర్పంచి గోడల నర్సింహులు, ఎలికట్టకు చెందిన సింగిల్‌విండో డైరెక్టర్‌ మల్లయ్యలతో పాటు 50 మందికి పైగా కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.వారిని కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని