విలవిల్లాడి.. ప్రాణం వీడె..!
అప్పటి దాకా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. పండగ వేళ కోడి కోసే క్రమంలో చేతికి గాయం అయింది. దీంతో పరిచయం ఉన్న ఆర్ఎంపీ వద్దకు వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. భార్యతో కలిసి
భీమన్న
మంచిర్యాలనేరవిభాగం, న్యూస్టుడే: అప్పటి దాకా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. పండగ వేళ కోడి కోసే క్రమంలో చేతికి గాయం అయింది. దీంతో పరిచయం ఉన్న ఆర్ఎంపీ వద్దకు వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. భార్యతో కలిసి సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ తిరిగి ఇంటికి బయలుదేరారు. మరో రెండు.. మూడు నిమిషాల్లో ఇంటికి చేరేవారు.. కానీ విధి ఏమనుకుందో.. పండగ పూట విషాద రాత రాసింది. పతంగి మాంజా రూపంలో ఆయన ఆయువు తీసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి ఎస్సై తైసోద్దిన్ తెలిపిన ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన భీమన్న(39) పదిహేను సంవత్సరాల క్రితం మంచిర్యాలకు వలస వచ్చాడు. కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భీమన్న శనివారం కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నాడు. ఇంట్లో కోడి కోస్తుండగా చేతికి కత్తి గాయం అయింది. కట్టుతో పాటు టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలని భార్య శారదతో కలిసి మేదరివాడలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో స్థానిక రాళ్లవాగు వంతెన దాటే క్రమంలో.. రోడ్డుపక్కనే ముళ్లపొదలో చిక్కిన గాలిపటం చైనా మాంజా భీమన్న మెడకు చుట్టుకుంది. వాహన వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ మాంజా ఆయన మెడను చుట్టూ కోసుకుంటూ వెళ్లింది. పదడుగుల ముందుకు వెళ్లే సరికి మాంజా భీమన్న మెడను పూర్తిస్థాయిలో కోసింది. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న భీమన్నను భార్య శారదతో పాటు స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేపించే క్రమంలోనే తుదిశ్వాస విడిచాడు. భీమన్న భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తైసోద్దిన్ తెలిపారు.
గ్రామంలో విషాదఛాయలు
గుంజపడుగు(గొల్లపల్లి) : మంచిర్యాల జిల్లాలో చైనా మంజాతో శనివారం జరిగిన ప్రమాదంలో మండలంలోని గుంజపడుగుకు చెందిన భీమన్న(39) మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. భీమన్న చిరు వ్యాపారం చేసుకోవడానికి పలు గ్రామాలు తిరుగుతుంటాడు. ఇలా జీవనోపాధి కోసం వీరి కుటుంబం మంచిర్యాలలో ఉంటోంది. శనివారం జరిగిన ప్రమాదంలో భీమన్న అకాల మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భీమన్న వేలికి గాయమవడంతో ప్రాథమిక చికిత్స చేయించడానికి డాక్టర్ వద్దకు వెళ్లామని, బయటకు వెళ్లకుంటే తన భర్త ప్రాణాలతో ఉండేవాడని బాధితుడి భార్య శారద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటికి ఓటర్ చీటీల పంపిణీ
[ 05-05-2024]
నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ఇవ్వగా, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేశారు. -
ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలి
[ 05-05-2024]
పోలింగ్ రోజున దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, దివ్యాంగులకు చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. -
బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తారా.. ఇవ్వరా?
[ 05-05-2024]
-
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
[ 05-05-2024]
రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం, లింగంపల్లి, హన్మాజీపేట, మర్రిపల్లి, నాగాయ్యపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
బరిలో 42 మంది.. 3 బ్యాలెట్ యూనిట్లు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల జాబితా కొలిక్కి వచ్చింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో అదనపు యంత్రాల అవసరం ఏర్పడింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ యూనిట్(బీయూ), కంట్రోల్ యూనిట్(సీయూ), వీవీప్యాట్ (ఓటర్ వెరీఫైడ్ పేపర్) యంత్రాలను వినియోగించనున్నారు. -
ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలి
[ 05-05-2024]
ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య తెలిపారు. శనివారం పలుప్రాంతాల్లో జరుగుతున్న ఇంటివద్ద ఓటింగ్ను పరిశీలించారు. -
జగిత్యాలలో నేడు కేసీఆర్ రోడ్షో
[ 05-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వరకు రోడ్షో నిర్వహిస్తారు. -
భానుడి భగభగలు!
[ 05-05-2024]
భానుడి భగభగలు ఉమ్మడి జిల్లావాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు.. సాయంత్రం 6 గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు. -
ప్రజా సేవకుడిగా పార్లమెంటులో గళం వినిపిస్తా
[ 05-05-2024]
‘కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై నాకు ప్రణాళిక ఉంది.. నాన్న ఆశయ సాధన కోసం కరీంనగర్ ప్రజల సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తా’ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు. -
దేవుళ్ల పేరుతో రాజకీయాలు వద్దు: వినోద్
[ 05-05-2024]
కరీంనగర్కు స్మార్ట్సిటీని తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నిలిపిన తాను ఎంపీగా గెలిచాక నగర రూపురేఖలను మరింతగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు భారాస ఎంపీ అభ్యర్థి బోయిపల్లి వినోద్కుమార్ తెలిపారు. -
కష్టమొస్తే అండగా ఉన్నా: సంజయ్
[ 05-05-2024]
ఓటును నియంతృత్వ పాలన సాగించిన గడీల వారసులకు వేస్తారా? మోదీని ప్రధాన మంత్రిని చేసే గరీబోల్ల నాయకుడు బండి సంజయ్కుమార్కు వేస్తారో ప్రజలు నిర్ణయించుకోవాలని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు. -
రిజర్వేషన్లను రక్షించుకుందాం
[ 05-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లను రక్షించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని.. ప్రజలు ఆలోచించి అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని కోరారు. -
రూ.10.88 లక్షల నగదు పట్టివేత
[ 05-05-2024]
హుజూరాబాద్ మున్సిపల్ పరిధి పరకాల అడ్డదారి చెక్పోస్టు వద్ద శనివారం వాహన తనిఖీల్లో రూ.10.88 లక్షల నగదు పట్టుకున్నట్లు సీఐ బొల్లం రమేష్ తెలిపారు. -
వీణవంకకు చేరుకున్న కేసీఆర్
[ 05-05-2024]
మంచిర్యాలలో రోడ్ షో ముగించుకున్న భారాస అధినేత కేసీఆర్ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీణవంక మండల కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంట్లో ఆయన బస చేశారు. -
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగం
[ 05-05-2024]
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర శనివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధర్మపురి ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. -
భారాసకు ఆరుగురు కౌన్సిలర్ల రాజీనామా
[ 05-05-2024]
జగిత్యాలలో ఆరుగురు భారాస కౌన్సిలర్లు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. పట్టణంలోని 7, 10, 17, 21, 33, 38వ వార్డుల కౌన్సిలర్లు పల్లెపు రేణుక, సిరికొండ పద్మ, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లె గంగాసాగర్ భారాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.