ఉద్యానం.. అధ్వానం
కోరుట్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యానవనం నిర్మాణ దశలోనే ఆధ్వానంగా తయారైంది. పట్టణంలో సుమారు లక్ష వరకు జనాభా ఉంటుంది. ప్రజలు సేదతీరేందుకు పట్టణంలో
వాగులో 3.20 ఎకరాల స్థలం కేటాయింపు
కోరుట్ల, న్యూస్టుడే
వరద నీటికి కూలిన కట్టడం
కోరుట్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యానవనం నిర్మాణ దశలోనే ఆధ్వానంగా తయారైంది. పట్టణంలో సుమారు లక్ష వరకు జనాభా ఉంటుంది. ప్రజలు సేదతీరేందుకు పట్టణంలో కావాల్సిన పార్క్లు, క్రీడా మైదానాలు, ఇతర సౌకర్యాలు అందుబాటులో లేకుండా ఉన్నాయి. సాయిరాంకాలనీలో తక్కువ విస్తీర్ణంలో ఉన్న పిల్లల పార్క్ ఆధునికీకరణ పేరిట ఏళ్ల తరబడి జాప్యం చేస్తుండటంతో అది వినియోగంలో లేకుండా పోయింది. పట్టణవాసుల కోసం నూతన ఉద్యానవనం నిర్మించాలని పుర పాలకులు యోచించారు. ఇందుకోసం జగ్జీవన్రామ్ విగ్రహం దగ్గర్లోనున్న పెద్దవాగు మధ్యలోని 3.20 ఎకరాల స్థలాన్ని రెవెన్యూశాఖ కేటాయించింది. ఇందులో పార్క్ నిర్మాణం కోసం మున్సిపల్ టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.40 లక్షలను కేటాయించారు. 2021 ఫిబ్రవరిలో భూమిపూజ చేసి ఉద్యానవన నిర్మాణ పనులను ప్రారంభించారు. పనులు చేపట్టి ఏడాది కావస్తున్నా మధ్యలోనే వదిలేశారు.
పనులు చేపట్టకుండా వదిలేసిన దృశ్యం
వరదకు కొట్టుకుపోయిన నిర్మాణం
ఉద్యానవనం కోసం వాగులో కేటాయించిన 3.20 ఎకరాల స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు. పిల్లర్లను నిర్మించి వాటిపై గోడను నిర్మిస్తున్నారు. ఇంతలో ఇటీవల వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు వాగులో పెద్దఎత్తున వరదనీరు వారాల తరబడి ప్రవహించింది. వరదనీటి ఉద్ధృతి ఉద్యానవన కట్టడాలను తాకడంతో పిల్లర్లు, గోడ కింది నుంచి ఓవైపు కూలిపోయింది. నిర్మాణ దశలోనే కట్టడాలు దెబ్బతింటుండగా రానున్న రోజుల్లో ఇది ఎంత సురక్షితంగా ఉంటుందో అర్థమౌతోంది. ఉద్యానవన గోడలకు వరదనీరు రాకుండా ఉండేందుకు వాగులో పాతకట్టడాల నుంచి తొలగించిన రాళ్లు, సిమెంట్, మట్టి పెల్లలను పోస్తున్నారు. దీంతో వాగు విస్తీర్ణం పూర్తిగా కుచించుకుపోతోంది.
ఆక్రమణలో వాగు స్థలం
పట్టణంలోనున్న ఏకైక పెద్దవాగు చాలా విస్తీర్ణంతో వ్యాపించి ప్రవహిస్తుండేది. కొన్నేళ్లుగా పైప్రాంతంలో వాగుకు అడ్డంగా డ్యాంలను నిర్మించడంతో వాగులో నీటి ప్రవాహం, వరద తగ్గిపోయింది. దీంతో వాగు ఒడ్డుకు, వాగు స్థలంను ఆక్రమించుకుని ఆక్రమంగా వందల సంఖ్యలో ఇళ్లను, కట్టడాలను చేపట్టారు. వాగు స్థలంలో నిర్మాణాలు నిషేధం అని తెలిసినా వాటిని అడ్డుకోవడంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వాగును ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లకు మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు వేసి కాలనీలో సీసీరోడ్డు, మురుగు కాలువలను నిర్మించి, తాగునీటి సౌకర్యం, విద్యుత్తు సౌకర్యం కల్పించారు. దీంతో అందరిముందే వాగు స్థలంను యథేచ్ఛగా ఆక్రమించుకుని ఇళ్లను నిర్మిస్తున్నారు. వాగు స్థలం ఖాళీగా ఉంటే ఆక్రమణకు గురవుతుందనే కారణంతో ఉద్యానవనం నిర్మిస్తే అందరికి ఉపయోగకరంగా ఉంటుందని రెవెన్యూశాఖ భావించింది. వాగు స్థలం ఉద్యానవనం నిర్మాణానికి అనువైనది కాకపోయినా లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టడం పాలకుల పనితీరులకు అద్దం పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?