అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం!
దెబ్బతిన్న పంట పొలాల్లో కలియదిరుగుతూ.. జరిగిన నష్టాన్ని కళ్లారా చూస్తూ.. అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని.. రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానిచ్చారు.
రైతులకు భరోసానిచ్చిన సీఎం కేసీఆర్
ఈనాడు, కరీంనగర్, న్యూస్టుడే- రామడుగు
పంట నష్టాన్ని సీఎంకు వివరిస్తున్న రైతు రాంచంద్రారెడ్డి, చిత్రంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రవిశంకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
దెబ్బతిన్న పంట పొలాల్లో కలియదిరుగుతూ.. జరిగిన నష్టాన్ని కళ్లారా చూస్తూ.. అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని.. రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానిచ్చారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రామడుగు మండలంలోని లక్ష్మీపూర్, రాంచంద్రాపూర్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్, తర్బూజా పంటలను సాగు చేసిన రైతు రాంచంద్రారెడ్డి పంట పొలానికి చేరుకున్న సీఎం బాధిత రైతుతో మాట్లాడారు. రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన పంట పూర్తిగా ఎందుకు పనికిరాకుండా పోయిందని ఆయన వివరించారు. పెద్దపెద్ద రాళ్ల వాన పడటంతోనే ఇంతటి నష్టం జరిగిందని.. తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం ధైర్యం చెప్పారు. ఈ సమయంలోనే బండారి శంకరయ్య అనే కౌలు రైతు తనకు జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి ఎదుట ఏకరవు పెట్టుకోగా, ఈ సారి పంటనష్టం సాయాన్ని కౌలు రైతులకు అందిస్తున్నామని చెప్పారు. ఈ రైతు వివరాల్ని నమోదు చేసుకోవాలని పక్కనే ఉన్న కలెక్టరు ఆర్వీ కర్ణన్ను ఆదేశించారు. సుమారు 15 నిమిషాల పాటు పక్కపక్కనే ఉన్న పొలాలను పరిశీలించారు. అక్కడి రైతులు సుమారుగా 14 మంది సీఎంకు తమ వేదనని విన్నవించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలుగకుండా చూస్తానని.. త్వరలోనే రైతుల వారీగా పరిహారాన్ని ఎకరానికి రూ.10వేల చొప్పున బాధితులైన అన్నదాతలకు అందిస్తామన్నారు. నష్టపోయిన ప్రతి రైతు వివరాల్ని పక్కాగా సేకరించాలని, ఏ ఒక్క బాధితుడికి ఇబ్బంది ఎదురవకుండా చూడాలని మంత్రి గంగుల కమలాకర్ను ఆదేశించారు.
గంటపాటు పర్యటన...
సాయంత్రం 4 గంటలకు సీఎం హెలికాప్టర్లో గాయత్రి పంప్హౌజ్ సమీపంలోని హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, శాసనమండలి విప్ కౌశిక్రెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ రవీందర్సింగ్, జడ్పీ ఛైర్పర్సన్ విజయ, కరీంనగర్ మేయర్ సునీల్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అనిల్కుమార్గౌడ్, సుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణారావులతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టరు ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, పోలీసు కమిషనర్ సుబ్బారాయుడులు పుష్పగుచ్ఛాలను అందించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కారులో సీఎం పంట పొలాలను పరిశీలించేందుకు వెళ్లారు. ఈసందర్భంగా గాయత్రి పంప్హౌజ్ నుంచి కాలువలో పారుతున్న నీటిని చూస్తూ సీఎం ముందుకు సాగారు. దాదాపు 3 కి.మీ.ల దూరంలో ఉన్న లక్ష్మీపూర్, రాంచంద్రాపూర్ పొలిమేరలో ఉన్న పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. ఈ సమయంలోనే స్వామిరెడ్డి అనే రైతు సీఎం కాళ్లను మొక్కేందుకు ప్రయత్నించగా సీఎం వద్దని వారిస్తూ ముందుకు కదిలారు. అన్నదాతల ఆవేదనను తెలుసుకున్న అనంతరం రామడుగు క్లస్టర్ రైతువేదిక వద్దకు చేరుకుని విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముందుగా రైతులతో మాట్లాడుతానని సీఎం అన్నారు. అప్పటికప్పుడు ఎమ్మెల్యే రైతులను మైక్లో పిలుస్తుండటంతో సీఎం వద్దని చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించారు. సాయంత్రం 5 గంటల సమయంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తిరుగుపయనమయ్యారు. సుమారు గంటపాటు పర్యటన కొనసాగింది. సీఎం విలేకరుల సమావేశం నిర్వహించిన రైతు వేదిక లోపలికి అనుమతించలేదని స్థానిక ఎంపీపీ కవిత, చిప్పకుర్తి సర్పంచి రాజేశ్వర్ నిరసన తెలిపారు.
మామిడి కాయను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటికి ఓటర్ చీటీల పంపిణీ
[ 05-05-2024]
నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ఇవ్వగా, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేశారు. -
ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలి
[ 05-05-2024]
పోలింగ్ రోజున దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, దివ్యాంగులకు చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. -
బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తారా.. ఇవ్వరా?
[ 05-05-2024]
-
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
[ 05-05-2024]
రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం, లింగంపల్లి, హన్మాజీపేట, మర్రిపల్లి, నాగాయ్యపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
బరిలో 42 మంది.. 3 బ్యాలెట్ యూనిట్లు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల జాబితా కొలిక్కి వచ్చింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో అదనపు యంత్రాల అవసరం ఏర్పడింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ యూనిట్(బీయూ), కంట్రోల్ యూనిట్(సీయూ), వీవీప్యాట్ (ఓటర్ వెరీఫైడ్ పేపర్) యంత్రాలను వినియోగించనున్నారు. -
ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలి
[ 05-05-2024]
ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య తెలిపారు. శనివారం పలుప్రాంతాల్లో జరుగుతున్న ఇంటివద్ద ఓటింగ్ను పరిశీలించారు. -
జగిత్యాలలో నేడు కేసీఆర్ రోడ్షో
[ 05-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వరకు రోడ్షో నిర్వహిస్తారు. -
భానుడి భగభగలు!
[ 05-05-2024]
భానుడి భగభగలు ఉమ్మడి జిల్లావాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు.. సాయంత్రం 6 గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు. -
ప్రజా సేవకుడిగా పార్లమెంటులో గళం వినిపిస్తా
[ 05-05-2024]
‘కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై నాకు ప్రణాళిక ఉంది.. నాన్న ఆశయ సాధన కోసం కరీంనగర్ ప్రజల సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తా’ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు. -
దేవుళ్ల పేరుతో రాజకీయాలు వద్దు: వినోద్
[ 05-05-2024]
కరీంనగర్కు స్మార్ట్సిటీని తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నిలిపిన తాను ఎంపీగా గెలిచాక నగర రూపురేఖలను మరింతగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు భారాస ఎంపీ అభ్యర్థి బోయిపల్లి వినోద్కుమార్ తెలిపారు. -
కష్టమొస్తే అండగా ఉన్నా: సంజయ్
[ 05-05-2024]
ఓటును నియంతృత్వ పాలన సాగించిన గడీల వారసులకు వేస్తారా? మోదీని ప్రధాన మంత్రిని చేసే గరీబోల్ల నాయకుడు బండి సంజయ్కుమార్కు వేస్తారో ప్రజలు నిర్ణయించుకోవాలని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు. -
రిజర్వేషన్లను రక్షించుకుందాం
[ 05-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లను రక్షించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని.. ప్రజలు ఆలోచించి అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని కోరారు. -
రూ.10.88 లక్షల నగదు పట్టివేత
[ 05-05-2024]
హుజూరాబాద్ మున్సిపల్ పరిధి పరకాల అడ్డదారి చెక్పోస్టు వద్ద శనివారం వాహన తనిఖీల్లో రూ.10.88 లక్షల నగదు పట్టుకున్నట్లు సీఐ బొల్లం రమేష్ తెలిపారు. -
వీణవంకకు చేరుకున్న కేసీఆర్
[ 05-05-2024]
మంచిర్యాలలో రోడ్ షో ముగించుకున్న భారాస అధినేత కేసీఆర్ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీణవంక మండల కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంట్లో ఆయన బస చేశారు. -
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగం
[ 05-05-2024]
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర శనివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధర్మపురి ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. -
భారాసకు ఆరుగురు కౌన్సిలర్ల రాజీనామా
[ 05-05-2024]
జగిత్యాలలో ఆరుగురు భారాస కౌన్సిలర్లు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. పట్టణంలోని 7, 10, 17, 21, 33, 38వ వార్డుల కౌన్సిలర్లు పల్లెపు రేణుక, సిరికొండ పద్మ, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లె గంగాసాగర్ భారాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.