హనుమాన్ జయంతికి ప్రత్యేక ఏర్పాట్లు
వచ్చే నెల 23న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
న్యూస్టుడే, మల్యాల: వచ్చే నెల 23న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆయా వేడుకలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి దాదాపు మూడు లక్షలకుపైగా దీక్షాపరులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అంజన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కొండగట్టు ఇన్ఛార్జి ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ‘న్యూస్టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో పలు అంశాలను వెల్లడించారు.
ప్రశ్న: చిన్న జయంతి ఉత్సవాల ఏర్పాట్లను ఎప్పుడు ప్రారంభిస్తారు? ఆయా శాఖల అధికారులతో ఎలా సమన్వయం చేస్తున్నారు?
సమాధానం: హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల నిర్వహణలో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎండలు అధికంగా ఉండటంతో తడకల పందిళ్లు, నీటి వసతి, బారికేడ్లను ఏర్పాటు చేసేందుకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తున్నాం ఉత్సవాల సమయంలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల గురించి అర్చకులతో చర్చించి వారు నిర్ణయించిన తేదీలోగా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తాం. జిల్లా కలెక్టరు అనుమతితో త్వరలోనే తేదీ ప్రకటిస్తాం.్చ
ప్ర: ఇటీవల కొండగట్టులో నిధుల దుర్వినియోగం కారణంగా పలువురు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వహించేలా చేపట్టనున్న చర్యలు?
స: ఆలయంలో ప్రతీ ఉద్యోగి పనితీరుపై నిఘావేయడంతోపాటు ప్రతినెలా సమీక్షలు నిర్వహించి రికార్డులు పరిశీలిస్తాం. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటాం. సిబ్బంది పనితీరు గాడినపడేలా ప్రత్యేక దృష్టి సారిస్తాం.
ప్ర: ఆలయ పుష్కరిణి శుభ్రంగా ఉండటం లేదన్న విమర్శలున్నాయి. దీనిని ఎలా అధిగమిస్తారు?
స: ఆలయం ముందున్న పుష్కరిణిలో ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని నింపేందుకు చర్యలు చేపడుతున్నాం. ధర్మగుండం వద్ద పారిశుద్ధ్యం లోపించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. దీక్షాపరులు పడేసే దుస్తులను వెంటవెంటనే తొలగించడానికి పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తాం.
ప్ర: ఎండల తీవ్రత అధికంగా ఉంది. భక్తుల సౌకర్యం కోసం చలువ పందిళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది కదా?
స: ఆలయం ముందు భాగంలో కొంతమేర చలువ పందిళ్లను ఏర్పాటు చేశాం. వేడుకల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ పరిసరాల్లో సేదతీరేందుకు చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టేలా సిబ్బందితో సమీక్షిస్తున్నాం.
ప్ర: భక్తులకు శుద్ధజలం అందించేందుకు తీసుకుంటున్న చర్యలు?
స: ఆలయ పరిసరాల్లో మూడు శుద్ధజల కేంద్రాల ద్వారా భక్తులకు నిరంతరంగా రక్షిత తాగునీరు అందుతోంది. ఈసారి మిషన్ భగీరథ పథకం ద్వారా పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరిగే అవకాశం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి భక్తులకు తాగునీరు, ధర్మగుండంలోకి నీటి సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందిస్తాం.
ప్ర: పలువురు సిబ్బంది భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.? కొండపై పూజా సామగ్రి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.?
స: అంజన్న ఆలయంలో టెంకాయలు కొట్టే చోట ఎలాంటి రుసుము లేకపోయినా కొందరు సిబ్బంది భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. దీనిపై చర్యలు తీసుకుంటాం. టెంకాయ కొట్టడానికి ఎలాంటి రుసుము ఇవ్వకూడదు. ఈ అంశంపై బోర్డు ఏర్పాటు చేస్తాం. తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి డబ్బులు డిమాండు చేసే క్షురకులను కూడా హెచ్చరించాం. కొండపైన పూజా సామగ్రిని అధిక ధరలకు విక్రయించకుండా నియంత్రిస్తాం. భక్తులు ఆలయానికి అందజేసే ప్రతి కానుకను నేరుగా అర్చకులకు కాకుండా ఆలయ సిబ్బంది స్వీకరించి దాతలకు రశీదులు అందజేసి భద్రపరిచేలా చూస్తాం.
‘న్యూస్టుడే’ చంద్రశేఖర్ కొండగట్టు ఇన్ఛార్జి ఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సిద్ధం
[ 28-04-2024]
నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు.. ఓటర్ల మన్ననలు పొందేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. -
జిల్లా అభివృద్ధి చెందాలంటే వినోద్ గెలవాలి
[ 28-04-2024]
కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే ప్రజలు భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు కోరారు. -
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు పోటీ
[ 28-04-2024]
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య పోటీ అని.. ఎటు వైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కోరారు. -
పెరిగిన ఓటర్లు.. 8,758
[ 28-04-2024]
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి నెల 8వ తేదీన విడుదలైన ఓటరు ముసాయిదా తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఓటు వేసే వారి సంఖ్య పెరిగింది. -
విదేశాల్లో ఉన్నా వదిలేదే లే!
[ 28-04-2024]
కరీంనగర్ భూ దందాలో భాగమై కేసులు నమోదైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరు అరెస్టై జైలుకెళ్లగా ఇంకొందరు తప్పించుకు తిరుగుతున్నారు. -
కరీంనగర్లో 6.. పెద్దపల్లిలో 4
[ 28-04-2024]
దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ఆదరించారు. -
66.44 శాతమే అధికం
[ 28-04-2024]
మొదటి రెండు పర్యాయాలు కరీంనగర్ ద్విసభ్య నియోజకవర్గ పరిధిలో ఉన్న పెద్దపల్లి లోక్సభ స్థానానికి 1962 నుంచి విడిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 విడతల్లో ఎన్నికలు జరిగినా ఎప్పుడూ 67 శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. -
అనిశా వలలో ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్
[ 28-04-2024]
గిఫ్ట్ డీడ్ కింద పట్టా మార్పిడి కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ గంగాధర ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్ సురేశ్బాబు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. -
మొత్తం ఓటర్లు 15,96,430
[ 28-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. కొద్ది రోజులుగా క్షేత్ర స్థాయిలో అధికారులు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి నుంచి కొత్తగా స్వీకరించిన దరఖాస్తుల వడబోత చేపట్టారు. -
ఆస్తుల పరిరక్షణ.. చోరీల నియంత్రణ
[ 28-04-2024]
సింగరేణి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని.. చోరీల నియంత్రణకు నిరంతరం అధికారులతో చర్చిస్తున్నామని సింగరేణి ముఖ్య భద్రతాధికారి దీక్షితులు అన్నారు. -
అభివృద్ధి చూపి ఓట్లడగాలి
[ 28-04-2024]
గత ఎంపీ ఎన్నికల్లో తన భార్య మంగళసూత్రాలు అమ్మి పోటీ చేశానని చెబుతున్న బండి సంజయ్ అయిదేళ్లలో రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ఎన్నికల వేళ... పెరగని మద్యం అమ్మకాలు
[ 28-04-2024]
ఎన్నికలు అనగానే పోటీలో ఉన్న అభ్యర్థులు మద్యం పంపిణీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం చూపలేదు. -
వెంటాడుతున్న అకాల వర్ష భయం
[ 28-04-2024]
అన్నదాతలు వరి గింజలు పూర్తిగా ఎండకుండానే... కమతాలు తడారకుండానే వరి కోతలు చేపడుతున్నారు. అకాల వర్షాల భయంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ముమ్మరం చేశారు. వరి కోత యంత్రాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. -
విస్తరించని జాతీయ మార్కెట్ వ్యవస్థ
[ 28-04-2024]
రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలందిస్తూ దేశవ్యాప్తంగా విపణిపై పట్టుసాధించటం.. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నల్లబజారుకు తరలకుండా చూసి.. సరకుల నియంత్రణతో ధరల అదుపు ప్రధాన ఉద్దేశంగా కేంద్రప్రభుత్వం ఈ-నామ్(ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్)ను 2016 ఖరీఫ్నకు ముందు ప్రవేశపెట్టింది. -
కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమ పథకాలు
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుతో కలిసి కార్నర్ సమావేశంలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
-
సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి