పంచాయతీల ఖజానా ఖాళీ
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
నిధుల కొరతతో వెక్కిరిస్తున్న సమస్యలు
కాలువలో పేరుకుపోయిన మురుగు
న్యూస్టుడే, సిరిసిల్ల పట్టణం: ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఫిబ్రవరి 2 నుంచి జిల్లాలో 139 మంది ప్రత్యేకాధికారులకు పరిపాలన, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. చెక్ పవర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారికి కల్పించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన సమానంగా నిధులు కేటాయిస్తుంటాయి. గత ప్రభుత్వ హయాంలో సుమారు సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. ఎన్నికలకు ముందు కొంత మొత్తం ఖాతాల్లో జమయ్యాయి. ఎఫ్ఎఫ్సీ (15వ ఆర్థిక సంఘం) నిధులు సైతం సరిపడా రావడం లేదు. సీసీ ఛార్జీలు (కరెంటు బిల్లులు) కచ్చితంగా చెల్లించాలన్న ఆదేశంతో ఆ నిధులకు కోత పడుతుంది. జనరల్ ఫండ్తోపాటు మిగతా చాలీచాలని నిధులతో పల్లెలను నెట్టుకురావడం పెద్ద తలనొప్పిగా మారింది. దాదాపు పదహారు నెలలుగా పల్లెలకు నిధులు విడుదల కావడం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 20 పంచాయతీలు ట్రాక్టర్ వాయిదాలు చెల్లించలేకపోవడంతో నోటీసులు అందాయి. చెత్త సేకరణకు ఇంధనం కొనుగోలు, ట్రాక్టర్ నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దీనికి తోడు చాలా చోట్ల రెండు గ్రామ పంచాయతీలకు ఒక్కరే అధికారిని నియమించారు. ఇతర శాఖల అధికారులకు చెందిన వారికి పంచాయతీల నిర్వహణ, విధులపై అంతగా పట్టు లేదు. దీనికి తోడు తమ కార్యాలయాల్లో పని భారంతో పంచాయతీలకు అంతగా సమయం కేటాయించడం లేదు. దీంతో పాలనలో ఆశించిన మేర ఫలితాలు ఉండటం లేదు.
వేతనాలు లేక...
కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లు కదలకపోవడంతో వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోతోంది. కాలువల్లో పూడిక తొలగించక దుర్వాసన వస్తోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు హడావుడిగా అక్కడక్కడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి వదిలేస్తున్నారు. నాలుగు నెలలుగా పంచాయతీల్లో మల్టీపర్పస్ కార్మికులకు సకాలంలో వేతనాలు అందకపోవడమే ఇందుకు కారణం. సరిపడా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటి ఎద్దడి మొదలైంది. అద్దె బోరులతో నీటి సరఫరా చేయాల్సి వస్తోంది. పంచాయతీ బోర్లలో నీటి మట్టం తగ్గడంతో హరితహారం, నర్సరీల్లో మొక్కలు ఎండుతున్నాయి. పంచాయతీల్లో సమస్యలపై జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్యతో మాట్లాడగా నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా పల్లెల్లో ఇబ్బంది కలుగుతున్నది వాస్తవమేనన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించడంతోపాటు ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని, ప్రత్యేకాధికారులు పర్యవేక్షణ చేసేలా చూస్తామని చెప్పారు. జిల్లాలో తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం
[ 27-04-2024]
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్