రాందాస్.. వైరా బాస్
హోరా హోరీగా జరిగిన సార్వత్రిక పోరులో కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ రాందాస్నాయక్ విజయ ఢంకా మోగించారు.
రాందాస్నాయక్కు ఎన్నికల ధ్రువ పత్రం అందజేస్తున్న ఆర్ఓ సత్యప్రసాద్
వైరా, న్యూస్టుడే: హోరా హోరీగా జరిగిన సార్వత్రిక పోరులో కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ రాందాస్నాయక్ విజయ ఢంకా మోగించారు. భారాస నుంచి పోటీ చేసిన బాణోత్ మదన్లాల్పై 33,045 భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. 18 రౌండ్ల వారీగా లెక్కింపు చేపట్టారు. అన్ని రౌండ్లలోనూ రాందాస్ స్పష్టమైన మెజార్టీ కనబరిచారు. కాంగ్రెస్, భారాస అభ్యర్థులు మినహా ఇతర పార్టీలెవరు చెప్పుకోదగ్గ ఓట్లు సాధించలేకపోయారు. పోస్టల్ బ్యాలెటులోనూ కాంగ్రెస్ భారీ ఆధిక్యం సాధించింది. భారాసపై 1,104 పోస్టల్(హోమ్ ఓటింగ్తో కలిపి) మెజార్టీ వచ్చింది.
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తా
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన మాలోత్ రాందాస్నాయక్ పేర్కొన్నారు. ఫలితాల అనంతరం ఆయన ‘న్యూస్టుడే’తో మాట్లాడారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి గిరిజన మండలాల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ఆయా మండలాలకు ఐటీడీఏ నుంచి ప్రత్యేక నిధులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. సాగు సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని సీతారామ ప్రాజెక్టు నీటిని వైరా జలాశయానికి తీసుకొస్తానని ప్రతి ఎకరానికి నీరు అందిస్తామన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వైరా పురపాలకాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. అన్నివర్గాల ప్రజల సహకారంతో విద్య,వైద్యరంగాల్లో సమస్యలు లేకుండా మరింత ఉన్నతి కనిపించేలా ఉంటానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రశాంతమైన పాలన అందిస్తామన్నారు గురుకులాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి పేదవిద్యార్థులకు ఇబ్బందులు రానివ్వకుండా చేస్తామని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళ కమాండర్కు 3 ఏళ్లు జైలు శిక్ష, 10 వేల జరిమానా
[ 10-05-2024]
ఇల్లందు మండలం కొమరారంలో 2018 సంవత్సరంలో పోలీసుల వాహనాల తనిఖీల్లో అనుమానాస్పద స్థితిలో పట్టుబడిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలానికి చెందిన భోగి భద్రయ్య వద్ద ఒక రివాల్వర్ పట్టుబడింది. -
అక్రమ మద్యం పట్టివేత
[ 10-05-2024]
ఇల్లందు మండలం కొమరారంలో అక్రమ మద్యాన్ని పోలీసలు పట్టుకున్నారు. -
ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
[ 10-05-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం వీవీ ప్యాడ్స్ స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు. -
అందరూ రావాల్సిందే.. నిబంధనలు పాటించాల్సిందే
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే ఈవీఎంలు, సిబ్బందిని సిద్ధం చేసి ఆయా శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించారు. -
ఈ శోకం తీర్చలేనిది
[ 10-05-2024]
ఆ ఇద్దరు తల్లుల శోకం తీర్చలేనిది. అందులో ఓ మాతృమూర్తి తన భర్త చనిపోయాక పొట్టచేత పట్టుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది. గురుకులంలో చదువుతూ వేసవి సెలవుల్లో ఇంటికొచ్చిన చిన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవటాన్ని చూసి స్పృహతప్పి పడిపోయింది. -
ఐటీడీఏలకు రావాలి పూర్వవైభవం
[ 10-05-2024]
గిరిజనుల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూనే.. షెడ్యూల్ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆచార సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ఐటీడీఏలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా గిరిజనులకే కలెక్టరేట్గా పిలుచుకునే ఈ సంస్థలు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో కొలువుదీరగా.. -
రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: భట్టి
[ 10-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఎర్రుపాలెంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. -
1,395 పాఠశాలలు, రూ.41.48 కోట్లు
[ 10-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు సర్కారు ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’(ఏఏపీసీ)లను భాగస్వాములను చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతోనే అన్ని వసతులు కల్పించడం ద్వారా బడుల బలోపేతం చేయాలన్న లక్ష్యం. -
ఆదరిస్తే అండగా నిలుస్తా: తాండ్ర
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అండగా నిలుస్తానని భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కారేపల్లిలో గురువారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోవద్దు: పువ్వాడ
[ 10-05-2024]
కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోవద్దని, తాము అందించిన సంక్షేమాన్ని గుర్తించి లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఓటు వేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
రామాలయ అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమాలోచనలు
[ 10-05-2024]
భద్రాచలం రామాలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. సోలార్ విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
భారాస పాలనలోనే ఇల్లెందు అభివృద్ధి: సత్యవతి రాథోడ్
[ 10-05-2024]
పదేళ్ల భారాస పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా ఇల్లెందులో గురువారం -
బంగారు పర్వదినం
[ 10-05-2024]
అక్షయ తృతీయ అంటే బంగారు పర్వదినం. వైశాఖ మాసంలో వచ్చే మంచిరోజు. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించే విశేషమైన రోజు. -
పాలేరు మళ్లీ పోటెత్తాలి..
[ 10-05-2024]
సమర్థ నాయకత్వాన్ని చట్టసభలకు పంపించే వజ్రాయుధం ఓటు.. 18 ఏళ్లు పైబడి జీవించి ఉన్న ప్రతీ పౌరుడికీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
భాజపాకు మాదిగలు ఓటేయొద్దు
[ 10-05-2024]
అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న భాజపాకు మాదిగలు ఓటు వేయవద్దని మాదిగ ఐకాస వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు. -
దేవుడి తోడు.. మేం ఓటెయ్యం!
[ 10-05-2024]
‘ఎన్నికలొచ్చిన ప్రతిసారీ హామీలివ్వటం.. ఆపై ప్రతిజాప్రతినిధులు మోసగించటం షరామామూలైంది. మా గ్రామాన్ని అధికారులు, నేతలెవరూ పట్టించుకోవడం లేదు. అందుకే.. దేవుడిపై ఒట్టు.. -
ఎన్నికలను బహిష్కరిస్తాం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని పెద్దవెంకటాపురం గ్రామస్థులు గురువారం తీర్మానించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు తర్వాత తమవైపు కన్నెత్తి చూడటం లేదని వాపోయారు. -
ఎన్నికల వేళ మందుపాతరల దడ..!
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టుల మందుపాతరల ఏర్పాటుతో ఏజెన్సీలో దడ పుడుతోంది. భద్రాచలం ఏజెన్సీలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!