భాజపా అభ్యర్థిగా తాండ్ర వినోద్రావు
ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థిగా తాండ్ర వినోద్రావును ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. కమలం టికెట్ కోసం పలువురు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్రావు వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది.
ఈటీవీ ఖమ్మం: ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థిగా తాండ్ర వినోద్రావును ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. కమలం టికెట్ కోసం పలువురు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్రావు వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది. తాండ్ర స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామం. చాలా ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. దశాబ్దకాలంగా సామాజిక సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉన్నత చదువుల అనంతరం అమెరికాలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చి భాజపాలో చేరారు. ‘ఏకలవ్య ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2015 నుంచి 2021 మధ్యకాలంలో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఫౌండేషన్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లోనూ సేవలందించింది.
అసలే పోటాపోటీ.. ఆపై అనూహ్య నిర్ణయం!
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఖమ్మం పార్లమెంట్ స్థానానికి భాజపా ఆశావహులు పోటీపడ్డారు. ఈ క్రమంలో ముఖ్యనేతలు, అధిష్ఠానం ఆశీస్సుల కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో కమలం సత్తాచాటాలనే ఆలోచనతో అగ్రనేతలు సైతం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించారు. ఆశావహుల బలాబలాలను బేరీజు వేశారు. ఇతర పార్టీల్లోంచి బలమైన నేతలెవరైనా మొగ్గుచూపుతున్నారా? అనే అంశాన్నీ పరిశీలించారు. చివరగా వినోద్రావు అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. కమలం టికెట్ ఆశించి ఇటీవల ఆ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు భంగపాటు తప్పలేదు. బలమైన అభ్యర్థిని అన్వేషిస్తున్న తరుణంలో కమల తీర్థం పుచ్చుకున్నందున ఆయనకు అభ్యర్థిత్వం దక్కే అవకాశం ఉందన్న ప్రచారమూ జరిగింది. జలగం సైతం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ అనూహ్యంగా వినోద్రావు అభ్యర్థిత్వం వైపు అధిష్ఠానం మొగ్గుచూపింది. తన పేరును ఖరారు చేసిన అగ్రనేతలు, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి తాండ్ర ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఈ సారి కమలం జెండా ఎగురవేసి ప్రధాని నరేంద్రమోదీకి కానుకగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నట్టేట ముంచే నకిలీలలు
[ 21-05-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభంకానుంది. ఈ ఏడాది సాగుకు సానుకూల వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయిన అన్నదాతలు ఈసారైనా కాలం కలిసొస్తుందన్న కోటి ఆశలతో ఉన్నారు. -
ఉప ఎన్నికల సమరం.. రసవత్తరం
[ 21-05-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు అధికారులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. -
మాతృక.. గిరిపుత్రులకు బాసట..!
[ 21-05-2024]
రెవెన్యూ భూములు కాకుండా.. అటవీశాఖకు సంబంధం లేని మాతృక భూములను భూమిలేని అత్యంత నిరుపేద గిరిజనులకు పంపిణీ చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. -
పాతాళానికి పరుగులు
[ 21-05-2024]
గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఇటీవల మండే ఎండలకు జిల్లాలో భూగర్భ జలం పాతాళానికి పరుగులు తీస్తోంది. చెరువులు, కుంటల్లో నీటి జాడ లేక పూర్తిగా ఎండిపోవడంతో జిల్లావ్యాప్తంగా భూగర్భ జలమట్టం పడిపోయింది. -
అర్హులందరికీ రేషన్ కార్డులు: పొంగులేటి
[ 21-05-2024]
రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, ఆరు గ్యారంటీల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దు: కేటీఆర్
[ 21-05-2024]
శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హస్తం పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. -
పదవికి వన్నె తెచ్చేందుకే పోటీ: తీన్మార్ మల్లన్న
[ 21-05-2024]
మాజీ మంత్రి కేటీఆర్ అమెరికా నుంచి కాదుగదా అంతరిక్షం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి తీసుకొచ్చినా గెలవలేరని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. -
పట్టభద్రుల సమస్యలపై నిలదీసేందుకు భాజపాకు మద్దతివ్వాలి: ఈటల
[ 21-05-2024]
ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై చట్టసభల్లో నిలదీసేందుకు భాజపా అభ్యర్థికి మద్దతు తెలపాలని ఆపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ కోరారు. -
పునాది దశ దాటని వంతెన
[ 21-05-2024]
అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగుపై వంతెన ఈఏడాది వర్షాకాలంలోనూ అందుబాటులోకి రాకపోవచ్చు. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా పునాది దశ దాటలేదు. -
ఆదివాసీ సంప్రదాయం ‘చల్ల’గుండాలి
[ 21-05-2024]
వేసవి వచ్చిందంటే ఆదివాసీల వద్ద ఆనప(సొరకాయ) బుర్ర ఉండాల్సిందే. ఇది వారికి కదిలే ఫ్రిజ్. గిరిజన ఆచార వ్యవహారాలపై మక్కువ ఉన్న భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ కొద్ది రోజుల నుంచి ఆనప బుర్రను ఉపయోగించి అందులో నీటినే తాగుతున్నారు. -
ఎర్ర చీమల గుడ్లూ.. ఆదివాసీల ఆహారమే..!
[ 21-05-2024]
తెలంగాణ-ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివాసీలు ఏప్రిల్ మాసం చివరిలో ఎర్ర చీమల గుడ్లతో కూర, పచ్చడి తయారు చేసుకుని తింటుంటారు. -
ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
[ 21-05-2024]
ప్రజా ఉద్యమాలతోనే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య అన్నారు. -
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు దరఖాస్తు చేసుకోండి
[ 21-05-2024]
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. -
హత్య కేసు నిందితుల అరెస్టు
[ 21-05-2024]
ఆస్తికోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితుణ్ని, అతని రెండో భార్యను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యూరప్ ట్రిప్ మరింత భారం.. షెంజెన్ వీసా ఫీజు పెంపు
-
బీఎస్ఈ మార్కెట్ క్యాప్ @ 5 ట్రిలియన్.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం
-
తొలి క్వాలిఫయర్.. అభిషేక్కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్
-
సిట్ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్తో డీజీపీ భేటీ
-
రీకాల్, కోక్రియేట్ ఫీచర్లతో ఏఐ తరం కోసం మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పీసీలు