logo

kurnool News : చెల్లెలు.. అమ్మను చంపేసింది

కర్నూలు పాతబస్తీ సుబేర్‌దార్‌ వీధికి చెందిన చాకలి భాగ్యలక్ష్మి మృతి వివాదాస్పదంగా మారింది. ఆమె భర్త జైహింద్‌బాబు గతంలో చనిపోయారు. ఆమెకు దామగట్ల యశోద, కల్పనాదేవి అనే ఇద్దరు పెళ్లైన కుమార్తెలు సంతానం. భాగ్యలక్ష్మి చనిపోయిన నేపథ్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

Updated : 07 Aug 2022 10:41 IST

కోర్టులో అక్క పిటిషన్‌ దాఖలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు పాతబస్తీ సుబేర్‌దార్‌ వీధికి చెందిన చాకలి భాగ్యలక్ష్మి మృతి వివాదాస్పదంగా మారింది. ఆమె భర్త జైహింద్‌బాబు గతంలో చనిపోయారు. ఆమెకు దామగట్ల యశోద, కల్పనాదేవి అనే ఇద్దరు పెళ్లైన కుమార్తెలు సంతానం. భాగ్యలక్ష్మి చనిపోయిన నేపథ్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. తన చెల్లెలు కల్పననే తల్లి భాగ్యలక్ష్మిని చంపిందని, బీమా డబ్బు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువుల కోసం ఈ దారుణానికి ఒడిగట్టిందని, బంధువులకు చెప్పకుండా అంత్యక్రియలు పూర్తి చేసిందని.. విచారణ జరిపి న్యాయం చేయాలని కర్నూలు నర్సింహారెడ్డినగర్‌కు చెందిన యశోద కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్పందించిన కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఒకటో పట్టణ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో హత్య, కుట్ర.. ఇతర చట్టాల  కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని పోలీసలు బయటకు తీసి శవపరీక్ష చేయించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని