శ్రీసూర్యనారాయణా.. తేజోమయా
నందికొట్కూరు పట్టణం కోటా వీధిలోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో రెండవ సూర్యనారాయణ స్వామి దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది.
నేడు రథసప్తమి
నందికొట్కూరులోని సూర్యనారాయణ స్వామి ఆలయం
నందికొట్కూరు, న్యూస్టుడే: నందికొట్కూరు పట్టణం కోటా వీధిలోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో రెండవ సూర్యనారాయణ స్వామి దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ సూర్యారాధన చేసినవారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యకిరణాలు గాలిగోపురంగుండా మంటపాన్ని దాటుకుని గర్భగుడిలోని మూలవిరాట్ విగ్రహం వక్షస్థలాన్ని తాకుతాయి. ప్రతి ఆదివారం వందలాది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి యాగాలు నిర్వహిస్తారు. పదమూడో శతాబ్దంలో చోళ వంశీయుడైన సిరిసింగరాయుడు వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చాడని, అలసటతో అక్కడే ఉన్న ఓ వృక్షం కింద నిద్రిస్తుండగా సూర్యనారాయణస్వామి కలలోకి వచ్చి నిద్రిస్తున్న ప్రాంతంలో తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించినట్లు స్థలపురాణం ప్రచారంలో ఉంది. ఆలయంలో కూర్మ యంత్రం ఉండటం విశేషం. మూలవిరాట్ కుడిచేతుల్లో తెల్లటి పద్మం, ఎడమచెయ్యి అభయముద్రలో ఉంటుంది.
28న కల్యాణోత్సవం
ఈనెల 28వ తేదీన రథసప్తమి, సూర్యనారాయణస్వామి జయంతిని పురస్కరించుకుని ఛాయా ఉషాసమేత సూర్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం జరుపుతున్నట్లు దేవాలయం కమిటీ సభ్యులు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకు స్వామి అభిషేకం, ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కుంకుమార్చన, అనంతరం కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. భక్తులకు మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం తీర్థప్రసాదాల పంపిణీ ఉంటుందన్నారు. సాయంత్రం 3 గంటలకు పురవీధుల గుండా కల్యాణమూర్తుల రథోత్సవం నిర్వహిస్తారు.
స్వామి మూలవిరాట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా గెలిస్తే ఇంటి వద్దకే పింఛన్
[ 10-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటి వద్దకే వృద్ధులకు రూ.4,000 పెన్షన్, వికలాంగులకు రూ.6,000 పెన్షన్లు అందిస్తామని తెదేపా మండల కన్వీనర్ షేక్షావలి అన్నరు. -
ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టంతో వైకాపా మోసం
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ ఆక్ట్ చట్టం అమలులోకి తీసుకొచ్చి రైతాంగాన్ని మోసం చేస్తోందని ఎమ్మిగనూరు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆరోపించారు. -
ఘనంగా బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు
[ 10-05-2024]
జిల్లా కేంద్రంలో బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
సున్నిపెంటలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. -
ఘనంగా బస్వేశ్వరస్వామి జయంతి వేడుకలు
[ 10-05-2024]
మండల కేంద్రమైన సీబెళగల్లో శుక్రవారం వీరశైవ సంఘం ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
తెదేపా తెచ్చింది.. వైకాపా ఆపింది
[ 10-05-2024]
ప్రజల దాహం తీర్చాలని.. విద్యారంగాన్ని ముందుకు నడిపించాలని.. అతివకు అండగా నిలవాలని.. పల్లెల పొలాలు తడపాలని.. వారధి నిర్మాణంతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని.. పేదలకు గూడు నిర్మించి నీడ కల్పించాలని భావించారు. -
జగన్ మాటలు వినని జనం
[ 10-05-2024]
నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాటలు వినే వారు కరవయ్యారు. కార్పొరేటర్లు, కొందరు నేతలు సీఎం సభకు మహిళలను తీసుకొచ్చారు -
జగన్ సభ.. అబద్ధాలకు వేదిక
[ 10-05-2024]
నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ సభలో ఆ పార్టీ నేతలు అబద్ధాలే ప్రచార అస్త్రాలు చేసుకొన్నారు. -
సాగు యంత్రం.. జగన్ కుతంత్రం
[ 10-05-2024]
‘‘ సాగు వ్యయం తగ్గించి.. నికర ఆదాయం పెంచాలనే తపనతో ఆర్బీకే పరిధిలోని రైతుబృందాలకు కనీసం ఒక వైఎస్సార్ యంత్రసేవ కేంద్రం (సీహెచ్సీ) ఏర్పాటు చేస్తున్నాం.. -
గద్దెనెక్కారు.. కొండలు కూల్చారు
[ 10-05-2024]
ఆపదలో ఆదుకుంటాడని.. అవసరమొస్తే సాయం చేస్తాడని నమ్మి మండుటెండలో గంటల తరబడి నిలబడి ఓటేశాం.. తీరా గద్దెనెక్కాక.. ప్రజా అవసరాలు మరిచారు.. ఊళ్లకు దారి వేయలేదు.. గుక్కెడు నీరివ్వలేదు.. -
ముగిసిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 10-05-2024]
జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్లలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
జగన్ పాలనలో అన్ని రంగాలు నాశనం
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, నంద్యాల తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 10-05-2024]
‘‘ఎన్నికల పోలింగ్కు 72 గంటల సమయం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశాం. ప్రతి ఒక్కరూ ఓటేసి పోలింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి’’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. -
జగన్మాయా..వైద్యం అందదయా!
[ 10-05-2024]
ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి జగన్, ప్రజాప్రతినిధులు పలు ప్రసంగాల్లో చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. -
నిర్వాసితులపై జగన్ పైసాచికత్వం
[ 10-05-2024]
నీళ్లొస్తే బతుకులు బాగుపడతాయని ఆలోచించారు. జీవనాధారమైన భూములను త్యాగం చేశారు. పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
మంత్రి ఇలాకా...అరాచకాల కేక
[ 10-05-2024]
‘‘డోన్లో గత ప్రభుత్వంలా కాకుండా అక్రమాలకు తావులేకుండా ప్రజలకు మేలైన పాలన అందించాం. నేరాలు అదుపు చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
తాజా వార్తలు (Latest News)
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్