స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు
ధన దాహంతో రగిలిపోతున్న ఓ స్థిరాస్తి వ్యాపారికి.. నంద్యాల ప్రజల పాలిట కల్పతరువుగా మారిన చెక్డ్యాం కంట్లో నలుసుగా మారింది.
ప్ర‘జల’ అవసరాలు తీరుస్తున్న చెక్డ్యాంపై పగ
ప్రజాప్రతినిధుల అండతో రూ.1.30 కోట్ల కట్టడం ధ్వంసం
చెక్డ్యాంను పగులగొట్టిన అక్రమార్కులు, కనిపించని నీటి జాడ
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : ధన దాహంతో రగిలిపోతున్న ఓ స్థిరాస్తి వ్యాపారికి.. నంద్యాల ప్రజల పాలిట కల్పతరువుగా మారిన చెక్డ్యాం కంట్లో నలుసుగా మారింది. చెక్డ్యాంలో నీరు నిల్వ ఉంటే తన వెంచర్లో నిర్మాణాలకు సమస్యలు ఎదురవుతున్నాయని భావించి దాని అడ్డు తొలగించుకునేందుకు కుట్రలు పన్నారు. అధికార పార్టీ అండ ఉంది.. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో రాత్రికి రాత్రే చెక్డ్యాంను ధ్వంసం చేశారు. దీంతో నంద్యాల పట్టణం ఎన్జీవోకాలనీ వాసులను మళ్లీ తాగునీటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
ఖర్చులు పెరుగుతున్నాయని కసి
ఈ చెక్డ్యాంను అనుకునే ఒక బడా స్థిరాస్తి వ్యాపారి కొన్నేళ్ల కిందట ఒక వెంచర్ వేశారు. ఈ వెంచర్లో గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణ సమయంలో పునాదులు తీస్తుంటే ఊట ఎక్కువగా వస్తోంది. మోటార్లు పెట్టి తోడుతున్నా ఊట ఆగడం లేదు. నిర్మాణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఊట ప్రభావంతో గతేడాది వెంచర్ చుట్టూ నిర్మించిన ప్రహరీ కూడా కూలింది. దీంతో స్థిరాస్తి వ్యాపారి చెక్డ్యాంపై పగ పెంచుకున్నారు. కొన్ని రోజుల కిందట గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళ్లలో దీన్ని పగులకొట్టించారు. పటిష్టంగా నిర్మించిన కట్టడాన్ని యంత్రాలతో ధ్వంసం చేశారు. భూమి లోపల నుంచి సుమారు ఆరు అడుగుల ఎత్తులో నిర్మించిన కట్టడాన్ని మధ్యలో పగులగొట్టించి నీళ్లు నిల్వకుండా చేశారు. దీంతో చెక్డ్యాంలోని నీరంతా కిందికి వెళ్లిపోయింది.
నీటి కష్టాలకు చెక్డ్యాం
నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రూ.1.30 కోట్ల వ్యయంతో అప్పటి తెదేపా ప్రభుత్వం 2015లో ఈ చెక్డ్యాంను నిర్మించింది. నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురిసిన సమయంలో మహానంది మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి పాలేరు వాగు ద్వారా వర్షంనీరు నంద్యాల పట్టణంలోని చామకాల్వలోకి వస్తాయి. పాలేరు వాగు నుంచి చామకాల్వకు వరద నీరు చేరే సమయంలో నంద్యాల పట్టణంలోని ఎన్జీవో కాలనీ- ఎస్బీఐకాలనీ మధ్య ప్రవాహం ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నీటికి అడ్డుకట్ట వేస్తే ఎన్జీవో కాలనీలో భూగర్భ జల మట్టం పెరుగుతుందనే సదుద్దేశంతో తొమ్మిదేళ్ల కిందట పాములేటి స్వామి ఆశ్రమం సమీపంలో ఆనకట్ట కట్టారు. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చొరవతో అప్పట్లో కేసీ కెనాల్ అధికారులు దీనిని నిర్మించారు. చెక్డ్యాం నిర్మాణంతో ఈ ప్రాంతంలో నీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. ఎన్జీవో కాలనీలో భూగర్భజల మట్టం పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మండల తెదేపా నాయకులు రామాంజనేయులు తిరుపతయ్య, రంగముని, రహంతుల్లా అన్నారు. -
ఎన్నికల సమయంలో గొడవలు సృష్టిస్తే కేసులే..
[ 30-04-2024]
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గోనెగండ్ల సీఐ రామకృష్ణయ్య అన్నారు. -
ముస్లింలకు జగన్ ధోకా
[ 30-04-2024]
తెదేపా హయాంలో ముస్లిం మైనార్టీలకు న్యాయం చేశాం.. ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. ఉర్దూను రెండో భాషగా గుర్తించాం.. దుకాన్ మకాన్, దుల్హన్ లాంటి పథకాలు తెచ్చాం.. రంజాన్ తోఫా ఇచ్చి అండగా నిలిచా.. ఈ పథకాలన్నీ జగన్రెడ్డి రద్దు చేసి మైనార్టీలకు అన్యాయం చేశారు. -
పండుటాకులతో జగన్ పింఛనాట
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల వ్యవహారంలో జగన్నాటకం కొనసాగుతోంది.. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ అమలు చేస్తున్నారు. -
జలం కోసం జనం ఆందోళన
[ 30-04-2024]
మండలంలోని కులుమాల గ్రామంలో నెలలు తరబడిగా వేధిస్తున్న తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్థులు సోమవారం గోనెగండ్లలోని మండల పరిషత్తు కార్యాలయాన్ని ముట్టడించారు. -
అసెంబ్లీ బరిలో 126 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో 126 మంది అభ్యర్థులు నిలిచారు. నంద్యాల పార్లమెంటు స్థానానికి 31 మంది పోటీలో ఉన్నారు. -
పరిహారం ఇచ్చే వరకు పనులు ఆపండి
[ 30-04-2024]
మండలంలోని పిన్నాపురం గ్రామంలో గ్రీన్కో సంస్థ చేపట్టిన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. -
1 వరకు దరఖాస్తుకు గడువు
[ 30-04-2024]
ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలనుకునేవారు ఫామ్-8 ఇవ్వడంతోపాటు వ్యయ నిర్వహణ కోసం ఒకరిని ఏర్పాటుచేసుకోవాలని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య అన్నారు. -
రాక్షస పాలనను తరిమేద్దాం
[ 30-04-2024]
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి త్వరలోనే చరమగీతం పాడాలని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. -
5 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
[ 30-04-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలు, అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. -
స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ టంబ్లర్ గుర్తు
[ 30-04-2024]
కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి భరత్.ఎన్కు అధికారులు గ్లాస్ టంబ్లర్ గుర్తు కేటాయించారు. -
ఫైనాన్స్ సంస్థకు మొట్టికాయ
[ 30-04-2024]
నిబంధనలు పాటించని మణిప్పురం ఫైనాన్స్ సంస్థకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మొట్టికాయ వేసింది. -
వంతెనలు కూలుతున్నా.. కునుకు వీడరా!
[ 30-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు అని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. వంకలు, నదులపై నిర్మించిన వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నా జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం వాటి మరమ్మతుకు అడుగు ముందుకు పడలేదు. -
జగనన్నా.. న్యాయం ఏదన్నా..
[ 30-04-2024]
మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. వీటిద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. -
ప్రతి ఎకరాకు నీరందిస్తాం
[ 30-04-2024]
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఎకరాకు నీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉమ్మడి కూటమితోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
ఉమ్మడి కూటమితోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో విలేకరి మృతి
[ 30-04-2024]
ఆత్మకూరుకు చెందిన నెత్తికొప్పుల మహేష్(48) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విలేకరిగా పని చేస్తున్న మహేశ్ పట్టణ శివారులోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు