పశ్చిమాన ప్రాజెక్టులు భ్రష్టు పట్టించారు
ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్కు వంద ఎకరాలు కేటాయిస్తే దాన్ని స్థిరాస్తి వెంచర్గా మార్చారు... రైతులకు సాగునీరందించడానికి ఆర్డీఎస్ కోసం రూ.1984 కోట్లతో టెండర్ పిలిస్తే వైకాపా ప్రభుత్వం పనుల్ని ఆపేసింది..
జగన్ తీరుపై మండిపడ్డ బాలకృష్ణ
మాట్లాడుతున్న బాలకృష్ణ, వేదికపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డి, ఎంపీ అభ్యర్థి నాగరాజు
ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్కు వంద ఎకరాలు కేటాయిస్తే దాన్ని స్థిరాస్తి వెంచర్గా మార్చారు... రైతులకు సాగునీరందించడానికి ఆర్డీఎస్ కోసం రూ.1984 కోట్లతో టెండర్ పిలిస్తే వైకాపా ప్రభుత్వం పనుల్ని ఆపేసింది.. గాజులదిన్నె నుంచి రూ.146 కోట్లతో ప్రతి ఇంటికి తాగునీరిచ్చే పథకాన్ని తెదేపా మంజూరు చేస్తే వైకాపా నాయకులు పనులు ఆపేశారు.. ఎమ్మిగనూరువాసుల తాగునీటి అవసరాలను తీర్చడానికి వీలుగా గుడేకల్లులో వంద ఎకరాల్లో ఎస్ఎస్ ట్యాంకు నిర్మించడానికి తెదేపా ప్రయత్నిస్తే... వైకాపా నాయకులు ఆ భూమిని స్థిరాస్తి వెంచర్లుగా మార్చి... రూ.250 కోట్ల విలువైన ఆ భూమిని స్వాహా చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా మంగళవారం కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో కొనసాగింది. ఎమ్మిగనూరు, కోసిగిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.
చేనేతపురి జనసంద్రం
అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. క్రేన్ల సాయంతో గజమాలలు వేసి సన్మానించారు. కర్నూలు రోడ్ నుంచి ఎద్దుల మార్కెట్ మీదుగా శివ సర్కిల్ వరకు బాలకృష్ణ రోడ్షో నిర్వహించారు. అంచనాలకు మించి జనం భారీగా తరలివచ్చారు. ప్రచారరథం పైనుంచి బాలకృష్ణ ప్రజలకు అభివాదం చేస్తూ శివ సర్కిల్లో ఏర్పాటుచేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. రోడ్షోలో వేలాది మంది తెదేపా నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. శివ సర్కిల్లో ఎటుచూసినా జనమే కనిపించారు. సర్కిల్ నుంచి నాలుగు వైపులా ఉన్న రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.
ఎమ్మిగనూరులో సభకు హాజరైన జనం
చేనేతల ఆత్మహత్యల పర్వం....
శంకరయ్య అనే చేనేత కార్మికుడు రెండు సెంట్ల భూమి కోసం తీవ్ర క్షోభ అనుభవించి చివరకు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్టలో ముగ్గురు చేనేతలు భూమాఫియా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. అప్పుల బాధ తాళలేక పెడనలో ముగ్గురు, ధర్మవరంలో ఇద్దరు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. గోనెగండ్ల మండలానికి చెందిన హజీరాబీని అత్యాచారం చేసి చంపేశారు. వైకాపా వాళ్లు చేసిన దారుణాలెన్నో ఉన్నాయన్నారు. ఓటును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలన్నారు. జగన్ దుర్మార్గ పాలనను ప్రజలంతా ఏకమై మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. తెదేపా తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీవీ జయనాగేశ్వరరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజును గెలిపించాలని కోరారు.
ఎర్రకోటకు బీటలు
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సోదరుల కుమారులు ఐదుగురు బాలకృష్ణ సమక్షంలో మంగళవారం తెదేపాలో చేరారు. ఎమ్మిగనూరు పరిధిలో 50 ఏళ్లపాటు రాజకీయం చేసిన ఆయన ఎర్రకోట, కడిమెట్ల, రాళ్లదొడ్డి, సిరాలదొడ్డి, గువ్వలదొడ్డి గ్రామాలను తనకు కంచు కోటలుగా మార్చుకున్నారు. ఆయా గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీ కార్యకలాపాలేవీ జరగకుండా, ప్రతిపక్ష పార్టీకి ముఖ్యమైన నాయకులు కూడా లేకుండా చేశారు. ఆయా గ్రామాల్లో ఆయన అనుచరులు చెప్పిందే వేదం అన్నట్లుగా మారింది. ప్రతి ఎన్నికల్లోనూ సుమారు 12 వేల ఓట్లు ఆయా గ్రామాల నుంచి ఆయనకు పడేవి. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి ఆయా గ్రామాల్లో దశాబ్దాలుగా వెన్నుదన్నుగా ఆయన సోదరుల కుమారులు, పలువురు నాయకులు తెదేపాలో చేరడం సంచలనంగా మారింది.
కడిమెట్ల గ్రామానికి చెందిన విరూపాక్షిరెడ్డి, చెన్నారెడ్డి, బాలకృష్ణారెడ్డి, రాళ్లదొడ్డికి చెందిన కరుణాకర్రెడ్డి, చెన్నారెడ్డి తమతమ అనుచర వర్గాలతో ఎమ్మిగనూరు వచ్చి బాలకృష్ణ సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ నాయకులే ఐదు గ్రామాల్లో ఎమ్మెల్యే తరపున కీలక వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. ప్రతి ఎన్నికల్లో ఆయా గ్రామాల ఓట్లు గంపగుత్తగా చెన్నకేశవరెడ్డికి పడటంలో కీలకపాత్ర పోషించేవారు. అలాంటి కీలక నాయకులు తెదేపాలో చేరడం ఆసక్తికరంగా మారింది.
విద్యుత్తు ఆపేసి కక్ష సాధించారు..
బాలకృష్ణ సభ జరుగుతున్నంతసేపూ ఎమ్మిగనూరులో విద్యుత్తు సరఫరా ఆపేసి ప్రజలు ఆ కార్యక్రమాన్ని చూడకుండా అధికారులు అడ్డుకోవడం గమనార్హం. విద్యుత్తు అంతరాయాల కారణంగా మైకులు సరిగా వినిపించని పరిస్థితి తలెత్తింది. బాలకృష్ణ ప్రసంగం అందరికీ స్పష్టంగా వినిపించేందుకు వీలుగా పలుచోట్ల భారీ స్పీకర్లు ఏర్పాటుచేసినప్పటికీ విద్యుత్తు సరఫరా లేక కొన్ని స్పీకర్లు పనిచేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మండల తెదేపా నాయకులు రామాంజనేయులు తిరుపతయ్య, రంగముని, రహంతుల్లా అన్నారు. -
ఎన్నికల సమయంలో గొడవలు సృష్టిస్తే కేసులే..
[ 30-04-2024]
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గోనెగండ్ల సీఐ రామకృష్ణయ్య అన్నారు. -
ముస్లింలకు జగన్ ధోకా
[ 30-04-2024]
తెదేపా హయాంలో ముస్లిం మైనార్టీలకు న్యాయం చేశాం.. ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. ఉర్దూను రెండో భాషగా గుర్తించాం.. దుకాన్ మకాన్, దుల్హన్ లాంటి పథకాలు తెచ్చాం.. రంజాన్ తోఫా ఇచ్చి అండగా నిలిచా.. ఈ పథకాలన్నీ జగన్రెడ్డి రద్దు చేసి మైనార్టీలకు అన్యాయం చేశారు. -
పండుటాకులతో జగన్ పింఛనాట
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల వ్యవహారంలో జగన్నాటకం కొనసాగుతోంది.. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ అమలు చేస్తున్నారు. -
జలం కోసం జనం ఆందోళన
[ 30-04-2024]
మండలంలోని కులుమాల గ్రామంలో నెలలు తరబడిగా వేధిస్తున్న తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్థులు సోమవారం గోనెగండ్లలోని మండల పరిషత్తు కార్యాలయాన్ని ముట్టడించారు. -
అసెంబ్లీ బరిలో 126 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో 126 మంది అభ్యర్థులు నిలిచారు. నంద్యాల పార్లమెంటు స్థానానికి 31 మంది పోటీలో ఉన్నారు. -
పరిహారం ఇచ్చే వరకు పనులు ఆపండి
[ 30-04-2024]
మండలంలోని పిన్నాపురం గ్రామంలో గ్రీన్కో సంస్థ చేపట్టిన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. -
1 వరకు దరఖాస్తుకు గడువు
[ 30-04-2024]
ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలనుకునేవారు ఫామ్-8 ఇవ్వడంతోపాటు వ్యయ నిర్వహణ కోసం ఒకరిని ఏర్పాటుచేసుకోవాలని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య అన్నారు. -
రాక్షస పాలనను తరిమేద్దాం
[ 30-04-2024]
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి త్వరలోనే చరమగీతం పాడాలని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. -
5 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
[ 30-04-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలు, అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. -
స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ టంబ్లర్ గుర్తు
[ 30-04-2024]
కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి భరత్.ఎన్కు అధికారులు గ్లాస్ టంబ్లర్ గుర్తు కేటాయించారు. -
ఫైనాన్స్ సంస్థకు మొట్టికాయ
[ 30-04-2024]
నిబంధనలు పాటించని మణిప్పురం ఫైనాన్స్ సంస్థకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మొట్టికాయ వేసింది. -
వంతెనలు కూలుతున్నా.. కునుకు వీడరా!
[ 30-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు అని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. వంకలు, నదులపై నిర్మించిన వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నా జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం వాటి మరమ్మతుకు అడుగు ముందుకు పడలేదు. -
జగనన్నా.. న్యాయం ఏదన్నా..
[ 30-04-2024]
మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పారు. వీటిద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. -
ప్రతి ఎకరాకు నీరందిస్తాం
[ 30-04-2024]
తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఎకరాకు నీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి హామీ ఇచ్చారు. -
ఉమ్మడి కూటమితోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం
[ 30-04-2024]
ఉమ్మడి కూటమితోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో విలేకరి మృతి
[ 30-04-2024]
ఆత్మకూరుకు చెందిన నెత్తికొప్పుల మహేష్(48) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విలేకరిగా పని చేస్తున్న మహేశ్ పట్టణ శివారులోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్