జగన్తత్వం కుతంత్రం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
పంచాయతీలకు మరణ శాసనం రాసిన వైకాపా
పల్లె ప్రథమ పౌరులను అప్పుల్లో ముంచిన సర్కారు
నంద్యాల పట్టణం, న్యూస్టుడే
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆర్థిక సంఘం, సాధారణ, సీనరేజీ నిధులు పంచాయతీలకు ప్రధాన ఆదాయం. జగన్ గద్దెనెక్కిన తర్వాత పంచాయతీ నిధులు దారి మళ్లిస్తున్నారు. మురుగు కాల్వలను శుభ్రం చేసేందుకు సొమ్ముల్లేవు.. మంచినీటి పైప్లైన్ల మరమ్మతులకు పైసల్లేవు.. ఆఖరికి బ్లీచింగ్, ఫాగింగులకూ డబ్బు వెతుక్కోవాల్సిన దుస్థితిని కల్పించారు. ఏ పని చేయడానికి కూడా సర్పంచుల దగ్గర సరిపడా సొమ్ము లేకుండా చేశారు జగన్. ఏదీ చేయలేక గ్రామస్థులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని సర్పంచులు నెత్తీనోరూ కొట్టుకున్నా జగన్ వినిపించుకోలేదు.
‘ప్రాధాన్యం’ మరిచి.. ఉపాధి నిధులు ధారబోసి
అంతకు ముందు ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేవారు. జగన్ వచ్చాక వాటికీ టెండర్ పెట్టారు. ప్రతి పంచాయతీలో సచివాలయం, ఆరోగ్య, ఆర్బీకే, పాలకేంద్రం, డిజిటల్ గ్రంథాలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి ప్రాధాన్య భవనాలుగా నామకరణం చేసింది.. అన్నీ కలిపి ఉమ్మడి జిల్లాలో 1,452 నిర్మించాలని నిర్ణయించింది. ఉపాధి హామీ పథకంలో 60 శాతం కూలీలకు, 40 శాతం సామగ్రి విభాగం కింద ఖర్చు చేయాలనేది నిబంధన పెట్టారు. ప్రభుత్వం ఒత్తిడి చేసి స్థానిక నేతలకు పనులు అప్పగించింది. చాలా మంది సొంత డబ్బులు వెచ్చించారు. ఇంకా రూ.26 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. పల్లెల అవసరాలను పట్టించుకోకుండా సొంత ప్రాధాన్య కార్యక్రమాలకు ‘ఉపాధి’ నిధులు ధారపోశారు.
ఆర్థిక సంఘం నిధులు హాంఫట్
కొన్ని మేజర్ పంచాయతీలకు తప్ప మిగిలిన వాటికి సొంత ఆదాయ వనరులు ఉండవు. ప్రత్యేకంగా నిధులు కేటాయించి పల్లెలను ప్రగతి బాట పట్టించాలి. జగన్ ఆ పని చేయకపోగా వచ్చిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులనూ ‘హాంఫట్’ అనిపించేశారు. రాష్ట్రం సాధారణ నిధులనూ వెనక్కి తీసుకోవడం గమనార్హం. 2021-22, 2022-23 సంవత్సరాల్లో కలిపి దాదాపు రూ.180 కోట్ల వరకు విద్యుత్తు బిల్లుల బకాయిలకు మళ్లించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత రూ.59 కోట్లు మంజూరయ్యాయి. వాటినీ మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని పల్లె పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో పది శాతాన్నే పరిపాలన అవసరాలకు వెచ్చించాలి. ఆ సొమ్ములోంచే విద్యుత్తు బకాయిలను చెల్లించాలి. కానీ, జగన్ సర్కారు మాత్రం సగటున 24 శాతం నుంచి 90 శాతం వరకు ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల నుంచి ఖాళీ చేసింది.
ప్రజల కష్టాలు గుర్తించని నీరో చక్రవర్తి
ఉమ్మడి జిల్లాలో 672 గ్రామాల్లో 4.75 లక్షల మందికి సగటున నిత్యం 50 లీటర్ల నీటిని అందించే ఉద్దేశంతో జల్జీవన్ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. రెండు జిల్లాల్లో రూ.201 కోట్లతో చేపట్టే 1,008 పనులను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నాలుగు విడతల్లో టెండర్లు పిలించారు. కేంద్రం తన వాటా నిధులు అందించినా.. రాష్ట్రం నిధులు జమ చేయలేదు. దీంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. నంద్యాలలో రూ.58 కోట్ల పనులు జరగ్గా 20 శాతం కూడా బిల్లులు చెల్లించలేదు. కర్నూలులో ఇప్పటివరకు కేవలం రూ.30 కోట్ల పనులే జరిగాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 594 గ్రామాల్లో జలఘంటికలు మోగుతున్నాయి.
గనుల వాటా గయాబ్
- గనుల ఆదాయంలో గ్రామాల వాటాకు ప్రభుత్వం ఎగనామం పెడుతోంది. సీనరేజీ నిధులు వసూలు చేస్తున్నా గ్రామాల ఖాతాల్లో కన్పించడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గనులు లీజుకు ఇవ్వడంతో ఏటా రూ.80 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. లీజుదారుల నుంచి మైనింగ్ శాఖ అధికారులు పన్ను వసూలు చేస్తారు. వాటిని డీపీవో ఖాతాలకు బదిలీ చేస్తారు. ప్రభుత్వ ఆమోదం మేరకు డీపీవోలు పంచాయతీలకు బదిలీ చేస్తారు.
- నిబంధనల మేరకు ఆదాయంలో 25 శాతం పంచాయతీలకు, 50 శాతం మండల పరిషత్తులకు, 25 శాతం జడ్పీలకు కేటాయించాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొలిమిగుండ్ల, అవుకు, బేతంచెర్ల, డోన్ మండలల నుంచే రూ.8 కోట్లు సీనరేజీ కింద ప్రభుత్వానికి సమకూరింది. కానీ పంచాయతీలకు ఈ నిధులు బదిలీ చేయలేదు.
ప్రగతి దీపాలు కొండెక్కించారు
సంప్రదాయ వీధి దీపాల వ్యవస్థ స్థానంలో గత తెదేపా ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్ఎల్), నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీ)లకు వీటి ఏర్పాటుతోపాటు నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అప్పగించింది. వైకాపా వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్వహణ సంస్థలకు నిధులు సరిగా చెల్లించలేదు. 2021 మార్చి నుంచి వీధి దీపాల నిర్వహణను పంచాయతీలకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. పంచాయతీల వద్ద నిధుల్లేక వీధి దీపాలు వెలగడం లేదు.
- పల్లెల్లో చెత్తను సేకరించి సంపదగా మార్చుతామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ఉమ్మడి జిల్లాలో గ్రామాల్లో 25 లక్షల జనాభా ఉంది. ఒక్కో పంచాయతీ నుంచి 400 కిలోల చెత్తను సేకరిస్తున్నారనుకున్నా...రోజుకు 400 టన్నుల చెత్త, 60 శాతం ఎరువు వస్తుంది. దీన్ని కిలో రూ.5 చొప్పున విక్రయించినా రోజుకు రూ.1.25 లక్షలు వస్తుంది. కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఆదాయం లేదు.
నీటి ఎద్దటి నివారణకు రూ.22.75 కోట్లు అవసరమని అంచనా వేశారు. గత నెలలో ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూడ్స్ బోగిలో మంటలు
[ 29-04-2024]
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చిప్పగిరి మండలం నేమకల్లు రైల్వే స్టేషన్లో ఆదివారం గూడ్స్ బోగిలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే అగ్ని మాపక శాఖ వారికి సమాచారం అందించారు. -
జలం తీసుకొస్తాం.. జనాలను బాగు చేస్తాం
[ 29-04-2024]
పశ్చిమ ప్రాంతం పూర్తిగా వెనుకబడింది.. మంత్రాలయం నియోజకవర్గంలో వలసలు ఎక్కువ.. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. వలసలకు అడ్డుకట్ట వేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. -
వైకాపాలో రగడ
[ 29-04-2024]
పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఆదివారం వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక సగర (ఉప్పర) సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీరశైవ సంఘం ఛైర్మన్ రుద్రగౌడ్, పట్టణ బ్యాంకు ఛైర్మన్ యు.కె.రాజు తదితరులు హాజరయ్యారు. -
జగన్ పాలన.. కష్టాల‘పాలు’
[ 29-04-2024]
చంద్రబాబు ఆలోచన: తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం.. ‘పాడి’ రంగాన్ని ప్రోత్సాహం ఇచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేనివిధంగా కల్లూరు మండలం తడకనపల్లెలో పశు వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు. -
పశ్చిమాన వలస విలాపం
[ 29-04-2024]
పశ్చిమాన పల్లెలు కన్నీరు పెడుతున్నాయి.. వలస వెళ్తున్న ప్రజలను చూసి. ఇళ్లకేసిన తలుపులు, తాళాలు ప్రశ్నిస్తున్నాయి.. మళ్లీ ఎప్పుడు తీస్తారని. ఇంటికి కాపలా ఉన్న పెద్దలు ఎదురు చూస్తున్నారు.. అయినవాళ్లు ఎప్పుడు తిరిగొస్తారని. -
విలీనం చేసి.. జగన్ నిలువునా ముంచి
[ 29-04-2024]
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూరుతాయి. -
జగన్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
[ 29-04-2024]
ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పోలవరం కట్టలేదని, రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయకుండా మాట తప్పారని, మరోసారి మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. -
అరాచక పాలనకు అంతం తప్పదు
[ 29-04-2024]
రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే అంతం తప్పదని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. మండలంలోని చెన్నంశెట్టిపల్లెలో తెదేపా నేత వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
నెరవేరని మాటలు.. అవస్థల పాఠాలు
[ 29-04-2024]
విద్యార్థులు చదువుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పలు ప్రసంగాల్లో ఊదరగొడుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పొంతన ఉండటం లేదు. -
వైకాపాను నమ్మి మళ్లీ మోసపోవద్దు
[ 29-04-2024]
ఆదోని పట్టణంలోని శివశంకర్నగర్లో భాజపా అభ్యర్థి డా.పార్థసారథి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట తెదేపా సీనియర్ నాయకులు భూపాల్చౌదరి, తెదేపా మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశం
[ 29-04-2024]
ఆర్థికమంత్రి బుగ్గన నామినేషన్ బందోబస్తుకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 22న బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్కు ఆవుకు పోలీస్స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తు నిమిత్తం డోన్కు వచ్చారు. -
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెబుదాం: బీసీ
[ 29-04-2024]
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెప్పి ఇంటికి పంపిద్దామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పెండేకంటి నగర్, శివనందినగర్లో ‘ప్రజాగళం’లో భాగంగా రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖరరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. -
కల్తీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారులను ఓడించాలి
[ 29-04-2024]
నంద్యాలలో నకిలీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిలను ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్ కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య