పోలింగ్ శాతం పెంచేలా చర్యలు
విధి నిర్వహణలో భాగంగా అధికారులు, ఉద్యోగులు నిబంధనలు పాటించాల్సిందేనని.. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ జి.సృజన అన్నారు.
కలెక్టర్ డా.సృజన
ఈనాడు, కర్నూలు: విధి నిర్వహణలో భాగంగా అధికారులు, ఉద్యోగులు నిబంధనలు పాటించాల్సిందేనని.. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ జి.సృజన అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సెంటర్ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చిన సీఐకి ఛార్జి మెమో ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 85 శాతం పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన నియోజకవర్గాలు, ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఓటరు చైతన్యంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆన్లైన్లో నామపత్రాలు సమర్పించేవారు ఆ పత్రాల కాపీని తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారులకు ఇవ్వాల్సిందేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. సి.విజిల్ యాప్నకు పెద్దఎత్తున ఫిర్యాదు వస్తున్నాయని.. గతంలో పరిష్కార శాతం 64 శాతం ఉండగా.. 89 శాతానికి పెంచినట్లు చెప్పారు.
294 మంది వాలంటీర్ల రాజీనామా
జిల్లాలో ఇప్పటివరకు 294 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని, వారందరి ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ డా.సృజన చెప్పారు. రాజీనామా చేసినవారు రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటే ఏమి చేయాలన్న అంశంపై ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదన్నారు. రాజీనామా చేయాలంటూ వాలంటీర్లపై ఒత్తిడి చేస్తున్నట్లు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని.. ఎవరైనా ఒత్తిడి చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
1,503 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
జిల్లాలో ఉన్న 2,204 పోలింగ్ కేంద్రాల్లో.. 1,503 ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్లో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. వెబ్కాస్టింగ్ లేని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. వారు కోరితే ఇంటి దగ్గరే ఓటు వేయించి పోస్టల్ బ్యాలెట్గా పరిగణిస్తామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పిస్తున్నామని.. నడవలేని వారి కోసం వీల్ఛైర్ సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రతి పైసా లెక్కిస్తారు
జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి వ్యయ పరిశీలకులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ డా.సృజన చెప్పారు. అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా చేసే ప్రతి ఖర్చును వారు లెక్కిస్తారని.. వ్యయ పరిశీలన నిశితంగా జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యక్రమాన్ని వీడియోగ్రఫీ చేయించి ఖర్చు లెక్కిస్తామన్నారు. పరిమితికి మించి ఖర్చు చేసినవారిని అనర్హులవుతారన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను‘దారి’ల కన్నీటి ప్రయాణం
[ 01-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో 1.40 లక్షల మంది పింఛనుదారులు ఉండగా తొంభై వేల మంది మండల కేంద్రం/ పట్టణానికి వెళ్లాల్సిందే. -
విజయోత్సవ ర్యాలీకి వస్తా
[ 01-05-2024]
సాధారణ ఎన్నికల అనంతరం నందికొట్కూరుకు మళ్లీ వస్తానని, విజయోత్సవ ర్యాలీ చేసుకుందామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. -
ప్రయాణ ప్రాంగణం పాలకుల నిర్లక్ష్యం
[ 01-05-2024]
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక.. ప్రజారవాణా సంస్థగా పేరు మార్చారు. ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు తిష్టవేశాయి. తాగేందుకు నీరు లేదు.. ఫ్యానులు తిరగవు.. మరుగుదొడ్లు మూసివేసి ఉంటున్నాయి -
జగన్ జమానాలో కూలిన బతుకులు
[ 01-05-2024]
ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది.. జగన్ మాత్రం వారిపై కక్ష కట్టారు.. ఇసుక కొరత తీసుకొచ్చారు.. నిర్మాణ రంగం నిలిచిపోయింది.. -
అంకితభావంతో పనిచేయండి
[ 01-05-2024]
‘‘పార్టీ విజయానికి అంకితభావంతో పనిచేసేవారిని గుర్తించి అందలం ఎక్కిస్తాం. ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రాగానే పార్టీకి సేవలందించినవారికి సముచిత స్థానం ఇస్తాం’’ అని తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. -
అన్నదాత ఆకలి తీరేనా!
[ 01-05-2024]
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు రాయితీ భోజనంలో సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రాయితీ భోజనం పెట్టాలనే సంకల్పంతో గత తెదేపా ప్రభుత్వం ఇస్కాన్ సహకారంతో మార్కెట్ యార్డుల్లో భోజన సేవలు అందుబాటులోకి తెచ్చింది. -
ఊరికి దూరం.. అసౌకర్యాల భారం
[ 01-05-2024]
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో ఉన్న రైల్వేస్టేషన్లలో సౌకర్యాలు కరవయ్యాయి. -
తెదేపా జెండా ఎగరేద్దాం
[ 01-05-2024]
ఆదోని పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి ఎన్డీయే పార్టీల నాయకులతో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు -
పర్యాటకం.. జగన్నాటకం
[ 01-05-2024]
నల్లమల్ల.. ఎర్రమల్ల కొండల ప్రాంతం.. నిత్యం శివనామస్మరణ.. నెమలి హొయలు పలికే ‘జల’తరంగాలు.. ఆదిమానవుడు నడిచిన నేల.. పర్యాటక పరంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నిస్తేజంగా మారింది. -
కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయండి
[ 01-05-2024]
తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయం కోసం సమష్టిగా కృషిచేయాలని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి కోరారు. -
దద్దణాలను ఎండబెట్టిన అసమర్థ ఎమ్మెల్యే కాటసాని: బీసీ
[ 01-05-2024]
దద్దణాల చెరువును ఎండబెట్టిన అసమర్థ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అని బనగానపల్లి తెదేపా నేత బీసీ జనార్దన్రెడ్డి విమర్శించారు
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర