logo

ఉల్లంఘనులు

అధికారం చేతిలో ఉందని నిబంధనలు లెక్కచేయరు.. ఎన్నికల నియమావళిని పాటించరు.. అధికారులు పట్టించుకోరు..

Published : 20 Apr 2024 05:40 IST

నిబంధనలు లెక్కచేయని వైకాపా నేతలు
నామినేషన్‌ కేంద్రం వద్ద హంగామా

పత్తికొండ, పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: అధికారం చేతిలో ఉందని నిబంధనలు లెక్కచేయరు.. ఎన్నికల నియమావళిని పాటించరు.. అధికారులు పట్టించుకోరు.. పత్తికొండలో నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట 144 సెక్షన్‌ విధించారు. పత్తికొండ వైకాపా అభ్యర్థి శ్రీదేవి శుక్రవారం నామినేషన్‌ వేసేందుకు వెళ్లారు. ఆమెతో పాటు వందల మంది కార్యకర్తలు జెండాలు పట్టుకుని తరలొచ్చినా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఎన్నికల నిబంధనల మేరకు నిషేధిత ప్రాంతాలుగా గుర్తించిన చోట కూడా వైకాపా కార్యకర్తలు జెండాలు చేతపట్టి నానా హంగామా సృష్టించారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న విలేకరులు వెళ్లిపోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని వదిలేసి.. విలేకరులపై ఇలా వ్యవహరించడం ఏమిటని కొందరు ప్రశ్నించారు. దీంతో పోలీసులు కార్యకర్తలను అక్కడి నుంచి పంపివేశారు. గ్రామాల్లో ఉపాధి పనులు నిలిపివేసి, కూలీలను ఆటోల్లో ఇతర వాహనాల్లో వైకాపా జెండా పట్టించి నామినేషన్‌ ర్యాలీకి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని