బలగం పెంచుకుని బరిలోకి!
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు.
కోడుమూరులో తెదేపాలోకి వలసలు
వైకాపాను వీడుతున్న కీలక నేతలు
ఈనాడు, కర్నూలు: వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. పసుపు దళం బలగం పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. నియోజకవర్గంలో 1962 నుంచి 2019 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి మొదటిసారి 1962లో దామోదరం సంజీవయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. తెదేపా ఒక్కసారే జెండా ఎగురవేసింది. ఈసారి ఎలాగైనా పాగా వేయాలని తెదేపా నేతలు ప్రయత్నిస్తున్నారు.
అధికారంలో విభేదాలు
నియోజకవర్గంలో కుడా మాజీ ఛైర్మన్ హర్షవర్దన్రెడ్డికి, ప్రస్తుత ఎమ్మెల్యే డా.సుధాకర్కు ఆది నుంచి విభేదాలు ఉన్నాయి. ఆదిమూలపు సతీశ్కు టికెట్ ఇప్పించడం వెనకు హర్షవర్దన్రెడ్డి కీలక పాత్ర పోషించారని డా.సుధాకర్ గుర్రుగా ఉన్నారు.ఎమ్మెల్యే సుధాకర్ వైకాపాను వీడనప్పటికీ ప్రస్తుత అధికార పార్టీ అభ్యర్థికి ఏమాత్రం సహకరించడం లేదు.
తెదేపా ‘స్థానిక’ అస్త్రం
డా.సతీశ్ స్థానికేతరుడన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. ప్రకాశం జిల్లా నుంచి కర్నూలుకు వలస వచ్చారు. తెదేపా అభ్యర్థి దస్తగిరి కోడుమూరు పసుపల గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన తల్లి ప్రస్తుతం సర్పంచిగా కొనసాగుతున్నారు. దస్తగిరి స్థానికుడు.. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
సైకిలెక్కిన ప్రజాప్రతినిధులు
ఎమ్మెల్యే డా.సుధాకర్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన సి.బెళగల్ జడ్పీటీసీ సభ్యుడు గిరిజోన్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఇదే మండలానికి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు, గార్గేయపురం వైస్ ఎంపీపీ జూటూరు శైలజారెడ్డి, గార్గేయపురం ఉప సర్పంచి కౌశిక్రెడ్డిలు సైకిలెక్కారు. ముడుమలగుర్తి సర్పంచి సువర్ణ తిరిగి తెదేపాలో చేరారు. గోరంట్ల సర్పంచి సద్దల బాలకృష్ణ, కళ్లపరి సర్పంచి రంగమ్మ, పులకుర్తి గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ ఇమ్మాన్యుయేల్ తదితరులు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకొన్నారు. కర్నూలు నగర పాలక సంస్థ 38వ వార్డు కార్పొరేటర్ గిబ్సన్ వైకాపాను వీడి తెదేపాలోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
గళమెత్తుతున్న జనం
నియోజకవర్గంలో సమస్యలు పేరుకుపోయాయి. ముఖ్యంగా మంచినీటి సమస్యల తీవ్రంగా ఉంది. నియోజకవర్గంలోనే పెద్ద మండలం కోడుమూరు.. ఇక్కడి జనాలకు మంచినీటి కష్టాలు తీర్చేందుకు గాజులదిన్నె నుంచి పైపులైను వేయాల్సి ఉంది. దీన్ని పట్టించుకోలేదు. ఇటీవల బస్సు యాత్రలో భాగంగా సీఎం జిల్లాలో పర్యటించారు. కోడుమూరు మండలం కొత్తూరుకు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కోట్ల హర్షవర్దన్రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సతీశ్లు ఇటీవల సి.బెళగల్ మండలంలో ప్రచారానికి వెళ్లగా గ్రామస్థులు ప్రశ్నల వర్షం కురిపించారు. సమాధానాలు చెప్పలేక ‘నీళ్లు’నమిలారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కురువల ఆత్మీయ సమావేశం
[ 05-05-2024]
పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో కురువల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ల్యాండ్.. సాండ్ మాఫియాను అరికడదాం: రాజ్నాథ్ సింగ్
[ 05-05-2024]
రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్ మాఫియాను తుది ముట్టిద్దామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 05-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. -
జగన్ ‘భూ’భక్ష చట్టం
[ 05-05-2024]
ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. వైకాపా నాయకులు గద్దల్లా వాలిపోతున్నారు.. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు.. ఐదేళ్ల వైకాపా హయాంలో రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, వక్ఫ్, అసైన్డ్, ప్రైవేటు భూములు పెద్దఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. -
మల్లన్న గడపన ‘కడప’ పెత్తనం
[ 05-05-2024]
భక్తుల కొంగుబంగారమైన శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్రం చెంత ఐదేళ్లుగా అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. జగన్ గద్దెనెక్కినప్పటి నుంచీ అక్రమాలు, ఆధిపత్య పోకడలు మిన్నంటాయి. భక్తుల సమస్యలు పట్టించుకోకుండా.. అధికార పార్టీ నేతలు, అధికారులు సొంత లాభాలు చూసుకున్నారు. -
కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు
[ 05-05-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆదోని పట్టణంలో ఆదివారం రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొంటారని.. -
7వ తేదీకల్లా ఓటరు చీటీల పంపిణీ
[ 05-05-2024]
ఫెసిలిటేషన్ సెంటర్లు, హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి పొరబాట్లు జరగకూడదని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. ఆమె పలు అంశాలపై రిటర్నింగ్ అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్సులో సమీక్షించారు. -
ప్రతి మహిళకు నెలకు రూ.1500
[ 05-05-2024]
తెదేపా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి మహిళకు రూ.1500 అందజేస్తామని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 33, 34వ వార్డుల్లో ప్రచారం చేశారు. -
జగన్ చట్టం.. లోపభూయిష్టం
[ 05-05-2024]
మద్దికెర మండలంలోని బురుజుల గ్రామంలో 1600 మంది రైతులు ఉండగా 5,500 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. బురుజుల రెవెన్యూ పరిధిలో పత్తికొండ మండలంలోని హోసూరుకు చెందిన రైతుల పొలాలున్నాయి. -
అహోబిలేశుని వసంతోత్సవం
[ 05-05-2024]
అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వేసవితాపం తీర్చేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామిని అర్చకులు పూజించారు. -
రూ.5 కోట్ల.. కోట భూమిని కొట్టేశారు
[ 05-05-2024]
రాజులు పోయారు.. కోటలు మిగిలాయి.. వాటి చుట్టూ ఉన్న భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడింది.. రూ.5 కోట్ల విలువైన భూమికి నకిలీ పట్టాలు పుట్టించి విక్రయిస్తున్నారు.. -
ప్రతి గ్రామానికి సాగునీరందిస్తాం
[ 05-05-2024]
సిద్ధాపురం చెరువు వద్ద ప్రత్యేక తూము ఏర్పాటుచేసి పక్కనున్న ఐదారు గ్రామాలకు సాగునీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 05-05-2024]
తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రితో మాట్లాడి వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
అద్దె మాటలు.. వైద్యవిద్యకు అవస్థలు
[ 05-05-2024]
‘‘మా వల్లే నంద్యాలకు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఇందుకు సంబంధించిన పనులూ శరవేగంగా జరుగుతున్నాయంటూ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి గొప్పలు చెబుతున్నారు.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా తిప్పలు పెడుతున్నారు. -
అక్రమాలు చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా
[ 05-05-2024]
మేం అక్రమాలు, అవినీతి చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా అని కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్యప్రకాశ్రెడ్డి ప్రశ్నించారు. శనివారం మండలంలోని ఓబులాపురం, చనుగొండ్ల, ఇందిరాంపల్లె, ఎర్రగుంట్ల, పెద్దమల్కాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..