logo

రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం

కల్వకుర్తి- జడ్చర్ల ప్రధాన రోడ్డుపై జరిగిన ప్రమాదంలో రైతు దుర్మరణం పాలైన సంఘటన మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై జయప్రసాద్‌ తెలిపిన వివరాలు.. మిడ్జిల్‌కు చెందిన రైతు

Published : 17 Jan 2022 01:48 IST

మిడ్జిల్‌, న్యూస్‌టుడే : కల్వకుర్తి- జడ్చర్ల ప్రధాన రోడ్డుపై జరిగిన ప్రమాదంలో రైతు దుర్మరణం పాలైన సంఘటన మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై జయప్రసాద్‌ తెలిపిన వివరాలు.. మిడ్జిల్‌కు చెందిన రైతు సత్యనారాయణ(56) శనివారం సాయంత్రం పొలం నుంచి సైకిల్‌పై తిరిగి ఇంటికి వస్తుండగా మండల కేంద్రం శివారులో కల్వకుర్తి వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. గమనించిన స్థానికులు 108లో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడన్నారు. సత్యనారాయణ భార్య మూడేళ్ల కిందట ఇంటి ఆవరణలో కొళాయి మోటారు పెడుతూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని