చెట్ల కొమ్మలతో దాడి చేసి వ్యక్తి హత్య
పాత కక్షలతో వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన మండలంలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపిన వివరాలు.. ఉండవల్లికి చెందిన మధుసూదన్రెడ్డి(35).. కుటుంబంతో కలిసి ఐదేళ్లుగా కర్నూలులో ఉంటున్నారు.
దాడికి పాల్పడిన వ్యక్తి ఇంటి వద్ద మృతదేహాంతో బాధితులు (మధుసూదన్రెడ్డి)
ఉండవల్లి, న్యూస్టుడే : పాత కక్షలతో వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన మండలంలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపిన వివరాలు.. ఉండవల్లికి చెందిన మధుసూదన్రెడ్డి(35).. కుటుంబంతో కలిసి ఐదేళ్లుగా కర్నూలులో ఉంటున్నారు. వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఉండవల్లికి చెందిన ఈడిగ రాఘవేంద్రగౌడ్ మధుసూదన్రెడ్డికి ఫోన్ చేశారు. అయిదేళ్ల కిందట మధుసూదన్రెడ్డి భార్య విషయంలో జరిగిన ఘర్షణ గురించి మాట్లాడేందుకు రావాలంటూ తిట్టాడు. మధుసూదన్రెడ్డి ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు వారించి ఉండవల్లికి వెళ్లకుండా ద్విచక్రవాహన తాళాన్ని దాచారు. దీంతో బయటకు వెళ్లిన ఆయన వెల్డింగ్ దుకాణంలో పనిచేసే అనిల్కుమార్ ద్విచక్రవాహనంపై శుక్రవారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారి నుంచి ఉండవల్లికి వచ్చే రోడ్డులో కాపుకాసిన ఈడిగ రాఘవేంద్రగౌడ్, ఆయన మిత్రులు యాగంటి నాయుడు, గణేశ్, రూబీ కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్న వారిని అడ్డుకున్నారు. చెట్ల కొమ్మలను విరిచి మధుసూదన్రెడ్డిపై దాడి చేశారు. అడ్డుకున్న అనిల్కుమార్ను సైతం కొట్టడంతో ఆయన దాడి విషయాన్ని మధుసూదన్రెడ్డి భార్య కృష్ణవేణికి ఫోన్లో సమాచారం ఇచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర గాయాలైన మధుసూదన్రెడ్డిని అనిల్కుమార్ ద్విచక్రవాహనంపై కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఉండవల్లికి వస్తున్న కృష్ణవేణి, ఆమె బావ మద్దిలేటిరెడ్డి వారిని గుర్తించారు. మధుసూదన్రెడ్డిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మధుసూదన్రెడ్డి అన్న మద్దిలేటిరెడ్డి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన నలుగురిపై ఎస్సై బాలరాజు కేసు నమోదు చేశారు. శాంతినగర్ సీఐ శివశంకర్గౌడ్ దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. బాధితులు మృతదేహంతో శనివారం సాయంత్రం ఉండవల్లిలో ఈడిగ రాఘవేంద్రగౌడ్ ఇంటి వద్ద దాదాపు గంటపాటు ధర్నా చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ రంగస్వామి బాధితులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. బాధితులు మృతదేహాన్ని అక్కణ్నుంచి తీసుకెళ్లారు. సీఐ శివశంకర్గౌడ్, కోదండపురం ఎస్సైలు శ్రీనివాసులు నాయక్, వెంకటస్వామి, ఏఎస్సై అయ్యన్న, పోలీసుసిబ్బంది భద్రతను పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాలో పలువురి చేరిక
[ 08-05-2024]
రాజోలు మండలం చిన్నదానవాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి భాజపా తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జిల్లా కేంద్రానికి పాఠ్య పుస్తకాల రాక
[ 08-05-2024]
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలు బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాయి. -
నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుందాం
[ 08-05-2024]
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో భారాస నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించుకుందామని అలంపూర్ ఎమ్మెల్యే విజయడు అన్నారు. -
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
[ 08-05-2024]
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. -
పాలమూరు ఓటర్లు @ 34,20,724
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024 ఓటర్ల జాబితాకు అదనంగా కొత్త ఓటర్లను చేర్చి ఎన్నికల అధికారులు తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో కొత్త ఓటర్లను చేర్చడంతోపాటు చనిపోయిన, స్థానికంగా లేనివారి ఓట్లను తొలగించారు. -
అథ్లెటిక్స్ ఛాంపియన్ సాయి సంగీతకు అభినందన
[ 08-05-2024]
జూనియర్ ఏషియన్ పోటీల్లో స్వర్ణం సాధించిన మహబూబ్నగర్కు చెందిన అథ్లెట్ సాయి సంగీతను పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి లక్ష్మికాంత్ రాథోడ్ మంగళవారం సన్మానించారు. -
ఆగిన రైతు భరోసా చెల్లింపులు
[ 08-05-2024]
రైతు భరోసా పథకానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. యాసంగి సీజన్లో పంట సాగు చేసిన రైతులందరికీ సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా డిసెంబర్ మూడో వారంలో ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేసింది. -
కళాశాల లేక.. చదువు సాగక!
[ 08-05-2024]
రాజోలి మండలంలో ఏటా 230 మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. వీరు ఇంటర్ విద్య చదువుకోవడానికి స్థానికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు. పక్క మండలమైన వడ్డేపల్లిలోనూ లేదు. -
వేలిపై పెట్టే వీలు లేకుంటే..
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరుగనుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు చెరిగిపోని సిరాను అంటిస్తారు. ఓటరు మళ్లీ రెండో సారి ఓటు వేసేందుకు అవకాశం లేకుండా ఈ నిబంధన విధించారు. -
గతమంతా ఘనం... ఇప్పుడంతా ధనం
[ 08-05-2024]
ప్రధాన పార్టీల ప్రచారం, జాతీయ స్థాయి నేతలు సభలు జనసమీకరణకు ప్రస్తుతం అభ్యర్థులకు, నాయకులకు తలకుమించిన భారమే. భారీ సభలకు అంతే మొత్తంలో భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. -
ష్... ఈసీ చూస్తోంది
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. భాజపా అభ్యర్థుల తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
ఐదునెలల్లో పాతరోజులు తీసుకొచ్చారు: మన్నె
[ 08-05-2024]
తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని ఎంపీ, భారాస మహబూబ్నగర్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. మంగళవారం మహబూబ్నగర్ అర్బన్ మండలం బోయపల్లి, గ్రామీణ మండలం జైనల్లీపూర్, లాల్యానాయక్ తండాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆయన ప్రచారం చేశారు. -
గద్వాలకు మిషన్ భగీరథ తాగునీరిచ్చాం: ఎమ్మెల్యే
[ 08-05-2024]
గద్వాల పురపాలక సంఘం పరిధిలో అన్ని వార్డుల్లో మిషన్ భగీరథ పథకం కింద తాగునీరు అందిస్తున్న ఘనత భారత రాష్ట్ర సమితిదేనని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
భవనంపై నుంచి పడి విద్యార్థి మృతి
[ 08-05-2024]
భవనంపై నుంచి ఓ విద్యార్థి కిందపడి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. నంచర్లకు చెందిన శివకుమార్(16) మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. -
పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాలు
[ 08-05-2024]
సర్కారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభించిన రోజునే పాఠ్య పుస్తకాలు అందజేయడానికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
రెడ్కో దెబ్బ.. పంచాయతీలు అబ్బా!
[ 08-05-2024]
పరిమిత గ్రామాలలో మాత్రమే మూడోలైన్ ఏర్పాటుచేసి వాటికి మీటర్లు బిగించారు. చాలా గ్రామాలలో మూడోలైన్ ఏర్పాటు చేయకుండా వీధిదీపాలు అమర్చి వదిలేశారు. ఆయా గ్రామాల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధిదీపాలు వెలుగుతున్నాయి. -
గోదాం అగ్నిప్రమాదం బాధ్యులెవరు?
[ 08-05-2024]
ఏప్రిల్ ఒకటో తేదీన పెబ్బేరులోని గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గోదాంలో మిల్లర్లు నిల్వ చేసిన సీఎంఆర్ ధాన్యం, పౌరసరఫరాలశాఖకు చెందిన గోనె సంచులు భారీగా కాలిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం