‘ఉమామహేశ్వర’తో నల్లమలకు సాగునీరు
రాష్ట్ర మంత్రిమండలి గురువారం తీసుకున్న పలు నిర్ణయాలు పాలమూరుపై ప్రభావం చూపనున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం ఫేజ్-1, ఫేజ్-2 మంజూరు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
సీఎంకు పుష్పగుచ్ఛం అందిస్తున్న ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. చిత్రంలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్ : రాష్ట్ర మంత్రిమండలి గురువారం తీసుకున్న పలు నిర్ణయాలు పాలమూరుపై ప్రభావం చూపనున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం ఫేజ్-1, ఫేజ్-2 మంజూరు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలో 57,200 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.1,534 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఫేజ్-1లో భాగంగా బల్మూరు మండలం మైలారం సమీపంలో ఉమామహేశ్వర జలశాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఫేజ్-2లో అమ్రాబాద్ మండలం మన్ననూరు సమీపంలో చెన్నకేశవ జలాశయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు వస్తే నల్లమలకు కృష్ణా జలాల ద్వారా సాగునీరు సరఫరా జరుగుతుంది.
* మంత్రి మండలిలో రెండో విడత గొర్రెల పంపిణీని 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో 68,340 యూనిట్లను పంపిణీ చేయనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మాదాసి కురవలకు అదనంగా మరో 30వేల యూనిట్ల పంపిణీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మొదటి విడత గొర్రెల పంపిణీలో 67 వేల యూనిట్లను పంపిణీ చేశారు. ఇప్పటికే కలెక్టర్ల పర్యవేక్షణలో రెండో విడతలో మహబూబ్నగర్లో 16,167 యూనిట్లు, గద్వాల-8,354, వనపర్తి-11,667, నాగర్కర్నూల్-19,762, నారాయణపేట జిల్లాలో 12,390 యూనిట్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు.
* కొత్త మండలాల్లో పీహెచ్సీలను ఏర్పాటు చేస్తామని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2016లో కొత్తగా ఏర్పడిన పలు మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి, కేటీదొడ్డి, నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ, వనపర్తి జిల్లా చిన్నంబావి, అమరచింత, నారాయణపేట జిల్లా కృష్ణలో పీహెచ్సీలు ఏర్పాటు చేయలేదు. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలో కౌకుంట్ల, నారాయణపేట జిల్లాలో కొత్తపల్లి, గుండుమాల్ను మండల కేంద్రాలుగా మార్చారు. కౌకుంట్ల, కొత్తపల్లిలో పీహెచ్సీలు లేవు. క్యాబినెట్ నిర్ణయంతో ఈ మండలాలకు పీహెచ్సీలు మంజూరయ్యే అవకాశాలున్నాయి.
* నకిలీ విత్తనాలపై పీడీ కేసులు నమోదు చేస్తామని ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోని భూత్పూర్, గద్వాల కేంద్రంగా సాగుతున్న పత్తి విత్తనాల కేంద్రాలపై దాడులు కొనసాగనున్నాయి. గతంలో ఈ ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. గద్వాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్న వారిపై గతంలో పీడీ కేసులను నమోదు చేశారు. మూడు రోజుల కిందట నారాయణపేట జిల్లా ఊట్కూర్లో నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. ఇప్పటికే ఠాణాలవారీగా అనుమానితులను గుర్తించి తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేశారు. వానాకాలం సీజన్లో ఉమ్మడి జిల్లాలో సుమారు 9 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేసే అవకాశాలున్నాయి. ఈ వర్షాకాలం సీజన్లో భారీగా పత్తి విత్తనాల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలపై పూర్తి స్థాయి నిఘా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
ఎత్తిపోతల మంజూరుపై సీఎంకు కృతజ్ఞతలు
ఈనాడు, హైదరాబాద్: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై సీఎం కేసీఆర్కు మంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకం ఒకటో దశలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల్లోని ఏదుల జలాశయం నుంచి అయిదు టీఎంసీల నీటిని ఉమామహేశ్వర జలాశయానికి తరలించి 57,200 ఎకరాలకు సాగునీరు, దారి మధ్యలో ఉండే గ్రామాలకు తాగునీరు అందించనున్నారు. దీనికోసం రూ.1534.50 కోట్లు మంజూరు చేస్తూ.. ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండో దశ విస్తరణ కూడా ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వర్షంతో చల్లబడిన వాతావరణం
[ 09-05-2024]
జిల్లాలో బుధవారం అర్ధరాత్రి, గురువారం సాయంత్రం ఓ మోస్తారుగా వర్షం కురిసింది. -
ఓట్లడిగే నాయకులు కళాశాల మంజూరు హామీ ఇవ్వాలి
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా రాజోలి మండలంలోని గ్రామాల్లో ప్రచారానికి వచ్చే నాయకులు మండలానికి జూనియర్ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇవ్వాలని కాలేజీ సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. -
భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యం
[ 09-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, మూడోసారి అధికారంలోకి వస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి అన్నారు. -
పట్టణంలోని పలు వార్డుల్లో భారాస ఎన్నికల ప్రచారం
[ 09-05-2024]
నాగర్కర్నూలు భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మన అలంపూర్ బిడ్డ అని, ఆయనను గెలిపించుకుందామని వడ్డేపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ కరుణ అన్నారు. -
అధిక స్థానాల్లో గెలిస్తే రాష్ట్ర రాజకీయాలనే మారుస్తాం
[ 09-05-2024]
లోకసభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్లో భారాస అభ్యర్థులు గెలిస్తే, ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను మారుస్తారని, మన జీవితాలను బాగుచేస్తారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న గద్వాల జిల్లాను నడిగడ్డ పౌరుషం యువత నిలబెట్టుకుంటుందని తనకు నమ్మకం ఉందన్నారు. -
పది సప్లిమెంటరీకి సన్నద్ధతేదీ?
[ 09-05-2024]
పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాలేదు. అన్ని యాజమాన్యాల పరిధిలో జిల్లాలో 12,673 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 11,338 మంది (89.47 శాతం) ఉత్తీర్ణులయ్యారు. -
అడుగంటిన జలం.. సమస్య తీవ్రం
[ 09-05-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. చాలా ప్రాంతాల్లోని జల వనరులైన చెరువులు, వాగుల్లో చుక్క నీరు లేక భూమి నెర్రెలు బారింది. -
తాగునీటికి ఊరట!
[ 09-05-2024]
నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు 1.90 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలకు కాస్త ఊరటనిచ్చే అంశమే. -
ఆ దేశాల్లో ఓటు వినియోగం తప్పనిసరి
[ 09-05-2024]
పోలింగ్ శాతం పెంచేలా ఎన్నికల సంఘం అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా పెద్దగా స్పందన ఉండటం లేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ మరింత తక్కువగా ఉంటోంది. -
పథకాల అమలుపై మంత్రిని నిలదీసిన మహిళలు
[ 09-05-2024]
ప్రభుత్వ పథకాలు ఇంతవరకు అమలు కావడం లేదని, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కొల్లాపూర్లోని 11వ వార్డులో మహిళలు మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీశారు. బుధవారం పట్టణంలోని 11, 10వ వార్డుల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇక్కడ ‘అధ్యక్ష’.. అక్కడ ‘మహోదయ్!’
[ 09-05-2024]
రాష్ట్రంలో అసెంబ్లీ, కేంద్రంలో పార్లమెంట్ చట్టసభలు. ఈ రెండు సభల్లోనూ అడుగుపెట్టారు కొందరు నేతలు. అసెంబ్లీలో అధ్యక్షా అని, పార్లమెంట్లో సభాధ్యక్ష మహోదయ్ అంటూ పాలమూరు వాణి వినిపించారు. -
పాలమూరు ఎత్తిపోతల పూర్తికి కృషి : వంశీచంద్రెడ్డి
[ 09-05-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. -
22 రోజులు ఉత్కంఠ తప్పదు
[ 09-05-2024]
ఎంపీగా గెలిచేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా సభలు, సమావేశాలు, రోడ్షోలు, ఇంటింటి ప్రచారం చేస్తూ.. తీరిక లేకుండా గడుపుతున్నారు. -
అతివేగం.. కుటుంబాలు చిన్నాభిన్నం
[ 09-05-2024]
వాహనచోదకుల తొందరపాటు, మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు అతివేగంగా నడపటం వలన జిల్లాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టడానికి అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన వాటి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. -
దొంగల హల్చల్..
[ 09-05-2024]
పట్టణాలు, గ్రామాల్లో దొంగలు కొత్త పంతాకు తెరదీసి చోరీలకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు. గతంలో రాత్రిళ్లు మాత్రమే దొంగతనాలకు పాల్పడేవారు. ఇప్పుడు పట్టపగలు సైతం చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారు. -
నాటారు.. నరికారు
[ 09-05-2024]
హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు చెట్లుగా పెరిగి పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కొన్ని చోట్ల ముందుచూపు లేకుండా విద్యుత్తు లైన్ల కింద నాటినవి నరికివేతకు గురవుతున్నాయి. -
ఈవీఎం స్ట్రాంగ్రూం భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 09-05-2024]
వనపర్తి మండలం చిట్యాల శివారులో వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ఈవీఎం స్టాంగ్ర్ రూంను ఎస్పీ రక్షితకృష్ణమూర్తి బుధవారం పరిశీలించారు. -
ఇక 3 రోజలే!
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుండటంతో పాలమూరులో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టి పెట్టారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్, భారాస, భాజపా మధ్య గట్టి పోటీ నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM