లోక్సభలో పనితీరుపై చర్చకు సిద్ధమా..
తాను లోక్సభలో ప్రజా సమస్యలపై పెదవి విప్పలేదని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ఆరోపించటంపై మహబూబ్నగర్ ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి తీవ్రంగా స్పందించారు.
వంశీచంద్రెడ్డికి భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి సవాల్
భారాస కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి
హన్వాడ, న్యూస్టుడే : తాను లోక్సభలో ప్రజా సమస్యలపై పెదవి విప్పలేదని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ఆరోపించటంపై మహబూబ్నగర్ ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి తీవ్రంగా స్పందించారు. 2019 ఎన్నికల నుంచి కనపడని నాయకులు ఎన్నికలు రాగానే ప్రజల్లోకి వచ్చి తప్పుడు హామీలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తన పనితీరు తెలుసుకోవాలంటే పార్లమెంట్లో తన హాజరుశాతం తెలుసుకోవాలన్నారు. సోమవారం హన్వాడలో నిర్వహించిన భారాస విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన ఐదేళ్లలో వంశీచంద్రెడ్డి ఏం చేశారో.. ఎక్కడ ఉన్నారో.. తాను ఏం చేశానో.. ఎక్కడ ఉన్నానో.. చర్చించేందుకు మహబూబ్నగర్లోని క్లాక్టవర్కు రావాలని సవాల్ విసిరారు. పార్లమెంట్లో సైనిక్ పాఠశాల, నిరుద్యోగం, రైల్వే సమస్యలపై ప్రశ్నించానని చెప్పారు. 4వేల మందికి తన కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించానని, కార్యకర్తలు, అభిమానుల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీలు పార్లమెంట్కు ఎన్ని రోజులు హాజరయ్యారు.. ఏ సమస్యలను ప్రస్తావించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రితో పాటు అలుపెరగకుండా తిరిగానని ఎంపీ చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, తాగు, సాగునీటి రంగాలను మెరుగుపరిచారని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించిన క్యాంపు కార్యాలాయాల్లో నేడు ఎమ్మెల్యేలు ఉంటున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్రెడ్డి, అంజయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నారని, వారిని ప్రజలు నమ్మవద్దని కోరారు. ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయనిర్మల, భారాస మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచండ ఎండ!
[ 29-04-2024]
పాలమూరులో భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, నదులు, వాగులు, బావులు, చెక్డ్యాంలు, నీటికుంటలు ఎండిపోతున్నాయి. -
వలస ఓటర్లపై ఆశలు!
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని వలస ఓటర్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ముంబయి, పుణె, భీమండిలో ఈ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం
[ 29-04-2024]
వచ్చే వానాకాలంలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలపటంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేశారు. -
దుందుభి.. దుఃఖిస్తోంది!
[ 29-04-2024]
దుందుభి వాగులో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిళ్లు ఇసుక మాఫియా వాగును ఖాళీ చేస్తుండటంతో మండలంలోని కొత్తూర్, వెలుగొముల, రెడ్డిగూడ, చిల్వేరు, అయ్యవారిపల్లి, కొత్తపల్లి, వాడ్యాల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం
[ 29-04-2024]
మహబూబ్నగర్ - జడ్చర్ల రోడ్డులోని మయూరి పార్కు సమీప కేశవరెడ్డి ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి మే 5 వరకు రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు సంస్కృత భారతి, రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు యాదయ్య, వెంకట్రెడ్డి, రాజ్మల్లేశ్ వెల్లడించారు. -
ఈవీఎంల వయసు 35 ఏళ్లు
[ 29-04-2024]
ప్రస్తుతం ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు వినియోగించారు? దాని పుట్టు పూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్దాం. -
ఐదేళ్లకు ఓ పూట
[ 29-04-2024]
సినిమా అంటే క్యూలో నిలుచొని టిక్కెట్లు తీసుకుని మూడుగంటలు వెచ్చిస్తారు... స్నేహితులతో ముచ్చట్లు చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటారు... సామాజిక మాధ్యమాల్లో విహరించడానికి మరెంతో టైం ఖర్చవుతుంది... -
భారాస, భాజపా మాటలు నమ్మొద్దు : మంత్రి జూపల్లి
[ 29-04-2024]
భారాస, భాజపా నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. -
దోచుకున్న సొమ్ముతో దుబాయ్లో పెట్టుబడులు : వంశీచంద్రెడ్డి
[ 29-04-2024]
కేసీఆర్ కుటుంబం తెలంగాణలో పదేళ్ల పాటు దోచుకున్న సొమ్మంతా దుబాయ్లోని మాల్స్లో పెట్టుబడులు పెట్టిందని, అక్కడ అకాల వర్షాలతో మాల్స్ కొట్టుకుపోతే వారిలో అలజడి మొదలైందని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. -
ముగిసిన శిర్సనగండ్ల రాములోరి బ్రహ్మోత్సవాలు
[ 29-04-2024]
రెండో భద్రాదిగా పేరొందిన చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ముగిసాయి. -
అలంపూర్ బేనీషా.. ప్రియం
[ 29-04-2024]
ప్రఖ్యాతి గాంచిన అలంపూర్ బేనీషా ఈ ఏడాది దొరకడం గగనమే. అత్యంత రుచికరమైన ఈ పండుకు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో సగానికన్నా తక్కువ కాత కన్పిస్తోంది. -
ఎలుకా కొరకకే!
[ 29-04-2024]
నారాయణపేటలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో రోగులకు ఎలుకలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన చిన్న పిల్లలు, కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు. -
అందని ద్రాక్షగా.. టీ ఫైబర్ సేవలు
[ 29-04-2024]
గ్రామాలకు డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్ సేవల పథకం పడకేసింది. రెండేళ్లుగా అమలును విస్మరించడంతో గ్రామీణులకు డిజిటల్ సేవలు అందనిద్రాక్షగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు