హామీలతో కాంగ్రెస్ మోసం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పలు హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండు చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
మాజీ మంత్రి హరీశ్రావు
కోస్గిలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్రావు
కోస్గి, న్యూస్టుడే: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పలు హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండు చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 13 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు..డిసెంబర్ 9న రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు నెలలైనా అమలు చేయలేదని అన్నారు. రైతుబంధు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ఇచ్చారా, కౌలు రైతులకు. రైతుకూలీలకు రూ. 15 వేలు అందించారా, 24 గంటల కరెంటు అందిస్తున్నారా? అని కార్యకర్తలను అడిగారు. అవ్వ, తాతలకు రూ. 4 వేలు పింఛను రాలేదని, పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు రూ. 2500 రాలేదని, ఆడపిల్లలకు స్కూటీ, తులం బంగారం ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. రూ.4వేల భృతి ఇస్తామని నిరుద్యోగులను రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ హామీలపై ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. కేంద్రంలో భాజాపా ప్రభుత్వం ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించలేదని అన్నారు. కర్వెన వరకు జలాశయం పూర్తయ్యిందని, అక్కడి నుంచి కొడంగల్ వరకు కాలువలు తవ్వితే కొడంగల్లో 1.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, ఎర్సన్పల్లి గ్రామస్థుల పొలాలను ఫార్మాసిటీ పేరుతో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, ఆ రైతులకు భారాస అండగా నిలుస్తుందన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో భారాస కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దన్నారు.
రాష్ట్రం తెచ్చింది, కాపాడుకునేది మనమే: మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ తెచ్చినది మన పార్టీయేనని, రాష్ట్రాన్ని కాపాడుకునేది మనమేనని అన్నారు. భవిష్యత్తు భారాసదేనని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరం ఎండిపోలేదని, ఇప్పుడు రైతు, కూలీలు ముంబయికి వలస పోవాల్సి వస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో భారాస ఎంపీని గెలిపిస్తే తెలంగాణ గొంతు పార్లమెంట్లో వినిపించే అవకాశం కలుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్లో కుట్ర చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్లు ఆయనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. ఓడిపోతున్నామని తెలిసే అలా మాట్లాడుతున్నారన్నారు..తన హయాంలో కొడంగల్లో రూ.రెండు వేల కోట్లతో అభివృద్ధి చేశామని, ఇప్పుడు 50 వేల మెజార్టీ ఇస్తేనే అభివృద్ధి చేస్తామని మెలిక పెడుతున్నారని విమర్శించారు. అధికారులు భారాస కార్యకర్తల బిల్లులు ఇవ్వడంలేదని, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, అంజయ్య, చిట్టెం రాంమ్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచండ ఎండ!
[ 29-04-2024]
పాలమూరులో భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, నదులు, వాగులు, బావులు, చెక్డ్యాంలు, నీటికుంటలు ఎండిపోతున్నాయి. -
వలస ఓటర్లపై ఆశలు!
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని వలస ఓటర్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ముంబయి, పుణె, భీమండిలో ఈ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం
[ 29-04-2024]
వచ్చే వానాకాలంలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలపటంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేశారు. -
దుందుభి.. దుఃఖిస్తోంది!
[ 29-04-2024]
దుందుభి వాగులో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిళ్లు ఇసుక మాఫియా వాగును ఖాళీ చేస్తుండటంతో మండలంలోని కొత్తూర్, వెలుగొముల, రెడ్డిగూడ, చిల్వేరు, అయ్యవారిపల్లి, కొత్తపల్లి, వాడ్యాల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం
[ 29-04-2024]
మహబూబ్నగర్ - జడ్చర్ల రోడ్డులోని మయూరి పార్కు సమీప కేశవరెడ్డి ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి మే 5 వరకు రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు సంస్కృత భారతి, రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు యాదయ్య, వెంకట్రెడ్డి, రాజ్మల్లేశ్ వెల్లడించారు. -
ఈవీఎంల వయసు 35 ఏళ్లు
[ 29-04-2024]
ప్రస్తుతం ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు వినియోగించారు? దాని పుట్టు పూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్దాం. -
ఐదేళ్లకు ఓ పూట
[ 29-04-2024]
సినిమా అంటే క్యూలో నిలుచొని టిక్కెట్లు తీసుకుని మూడుగంటలు వెచ్చిస్తారు... స్నేహితులతో ముచ్చట్లు చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటారు... సామాజిక మాధ్యమాల్లో విహరించడానికి మరెంతో టైం ఖర్చవుతుంది... -
భారాస, భాజపా మాటలు నమ్మొద్దు : మంత్రి జూపల్లి
[ 29-04-2024]
భారాస, భాజపా నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. -
దోచుకున్న సొమ్ముతో దుబాయ్లో పెట్టుబడులు : వంశీచంద్రెడ్డి
[ 29-04-2024]
కేసీఆర్ కుటుంబం తెలంగాణలో పదేళ్ల పాటు దోచుకున్న సొమ్మంతా దుబాయ్లోని మాల్స్లో పెట్టుబడులు పెట్టిందని, అక్కడ అకాల వర్షాలతో మాల్స్ కొట్టుకుపోతే వారిలో అలజడి మొదలైందని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. -
ముగిసిన శిర్సనగండ్ల రాములోరి బ్రహ్మోత్సవాలు
[ 29-04-2024]
రెండో భద్రాదిగా పేరొందిన చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ముగిసాయి. -
అలంపూర్ బేనీషా.. ప్రియం
[ 29-04-2024]
ప్రఖ్యాతి గాంచిన అలంపూర్ బేనీషా ఈ ఏడాది దొరకడం గగనమే. అత్యంత రుచికరమైన ఈ పండుకు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో సగానికన్నా తక్కువ కాత కన్పిస్తోంది. -
ఎలుకా కొరకకే!
[ 29-04-2024]
నారాయణపేటలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో రోగులకు ఎలుకలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన చిన్న పిల్లలు, కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు. -
అందని ద్రాక్షగా.. టీ ఫైబర్ సేవలు
[ 29-04-2024]
గ్రామాలకు డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్ సేవల పథకం పడకేసింది. రెండేళ్లుగా అమలును విస్మరించడంతో గ్రామీణులకు డిజిటల్ సేవలు అందనిద్రాక్షగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505