logo

ట్రాక్టర్ కింద పడి విద్యార్థి మృతి

మండలంలోని పెద్దతాండ్రపాడులో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ట్రాక్టర్‌పై నుంచి కిందపడి చికిత్స పొందుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు.

Published : 16 Apr 2024 18:58 IST

రాజోలి: మండలంలోని పెద్దతాండ్రపాడులో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ట్రాక్టర్‌పై నుంచి కిందపడి చికిత్స పొందుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. ఎస్ఐ జగదీశ్వర్ వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దతాండ్రపాడు గ్రామానికి చెందిన ఓ విద్యార్థి సోమవారం తమ పొలంలో ఎరువు వేసేందుకు చిన్నాన్న కృష్ణతో కలసి ట్రాక్టర్‌పై పనికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా, గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద కిందపడిన తన చరవాణి తీసుకునేందుకు వంగి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో ట్రాక్టర్ ట్రాలీ అతనిపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలవ్వడంతో అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని