Revanth Reddy: కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ బ్యాంకుల వడ్డీకే చాల్లేదు: రేవంత్రెడ్డి
ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదింటిని 100 రోజుల్లోనే అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
మద్దూరు: ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదింటిని 100 రోజుల్లోనే అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. కేసీఆర్ మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన రైతు రుణమాఫీ బ్యాంకుల వడ్డీకే సరిపోలేదని విమర్శించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో పార్టీ కార్యకర్తలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ బిడ్డకు కాంగ్రెస్ సీఎం, పీసీసీ పదవిని ఇచ్చిందన్నారు.
‘‘కేసీఆర్ చేసిన అప్పులకు మేం రూ.24వేల కోట్లు వడ్డీ కట్టా్ం. రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని నేను హామీ ఇచ్చా. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తా. నేను రుణమాఫీ చేసిన వెంటనే కేసీఆర్ భారాసను రద్దు చేస్తారా?ఏ రైతూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. రైతులను బ్యాంకులు ఇబ్బంది పెట్టొద్దు. రుణమాఫీ చేసే బాధ్యత నాది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి. భాజపా నేతలు దేవుడిని రోడ్లపైకి తెస్తున్నారు. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. మోదీ ఏ హామీని నెరవేర్చలేదు’’ అని రేవంత్రెడ్డి విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపోయి కాంగ్రెస్కు ఓటేయొద్దు: భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అభివృద్ధిపై జానారెడ్డికి సవాలు విసిరిన భారాస ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాలు విసిరారు. -
పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు విముక్తి కల్పిస్తా: రేవంత్ రెడ్డి
ఆరునూరైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని సీఎం రేవంత్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. -
కొండా విశ్వేశ్వర్రెడ్డి వినతిపై నిర్ణయం తీసుకోండి: ఈసీకి హైకోర్టు సూచన
కొండా విశ్వేశ్వర్రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. -
భాజపాకు ఓటు వేస్తే.. రాజ్యాంగాన్ని మార్చేస్తారు: సీఎం రేవంత్రెడ్డి
రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పుపై మాట్లాడుతున్నానన్న కారణంతోనే తనపై కేసులు పెడుతున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
ఫోన్ ట్యాపింగ్.. నాతో పాటు రేవంత్, హరీశ్రావు బాధితులే: బండి సంజయ్
సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
భారాసకు ఒక్క స్థానం రావడమూ కష్టమే: మంత్రి ఉత్తమ్
మతాన్ని అడ్డుపెట్టుకుని భాజపా విద్వేషాలు రెచ్చగొడుతోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
లోక్సభ ఎన్నికలు.. తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్ (Congress) పార్టీ విడుదల చేయనుంది. -
కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) 48 గంటల పాటు నిషేధం విధించింది. -
రేవంత్రెడ్డిపై నిషేధం ఏదీ?
ఎన్నికల ప్రచారంలో 48 గంటలపాటు పాల్గొనవద్దని తనపై నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ).. ‘పేగులు మెడలో వేసుకుంటా.. గుడ్లు పీకుతా’ అంటూ అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్రెడ్డిపై నిషేధం ఎందుకు పెట్టలేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. -
భాజపాకు రజాకార్లకు పట్టిన గతే
‘గుజరాత్ ఆధిపత్యానికి.. తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరు ఇది.. కుట్రలకు పాల్పడుతున్న భాజపాకు నిజాం, రజాకార్లకు పట్టిన గతే పడుతుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. -
రాజ్యాంగం ఉండాలా.. వద్దా..?
దేశంలో భాజపాకు వేసే ప్రతి ఓటూ రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు దూరమవుతాయని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. -
రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి
రజాకార్ల వారసుల నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రజలను కోరారు. గత 40 ఏళ్లుగా రజాకార్ల వారసులు హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈసారి హైదరాబాద్ లోక్సభ స్థానానికి భాజపా తరఫున పోటీ చేస్తున్న మాధవీలతకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
106 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 గంటల వరకు పోలింగ్
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉత్తర్వులు జారీ చేసింది. -
తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలి
పదేళ్ల యూపీఏ హయాంలో, తొమ్మిదిన్నరేళ్ల ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారన్న అంశంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సవాల్ విసిరారు. -
రిజర్వేషన్లు తొలగిస్తే దేశ సమగ్రతకు దెబ్బ: మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే గొప్ప అవకాశం లోక్సభ ఎన్నికల రూపంలో వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. -
అక్షింతలు పంచి ఓట్లు అడుగుతున్న మోదీ: మంత్రి పొంగులేటి
అయోధ్య రామయ్య పేరుతో ప్రధాని మోదీ నాలుగు అక్షింతలు పంచి ఓట్లు అడుగుతున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. -
రాజ్యాంగ మూలసూత్రాలు తుడిచివేసేందుకు భాజపా యత్నం
రాజ్యాంగ మూల సూత్రాలను తుడిచివేయడానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. -
మోదీ సర్కారును గద్దె దింపే వరకు విశ్రమించొద్దు: కె.నారాయణ
కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న మోదీ సర్కారును గద్దె దింపేవరకు కార్మికలోకం విశ్రమించవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ పిలుపునిచ్చారు. -
రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి: లక్ష్మణ్
ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి విలువలు పాటించడంలేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. -
రాహుల్, ప్రియాంకాగాంధీల ప్రచార షెడ్యూల్ ఖరారు
రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీలతో పాటు ఇతర ముఖ్యనేతలు మే మొదటి వారంలో విస్తృత ప్రచారం చేపట్టనున్నారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్