చిన్నబోతున్న.. కోడి గుడ్డు..!
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడి గుడ్ల్లు చాలా చిన్నవిగా ఉంటున్నాయి. అదేమిటని కేంద్రాల ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే మాకేం తెలుసు సరఫరా చేసే వారినే అడగండని అంటున్నారు. అధికారులను ప్రశ్నిస్తే గుడ్డు పరిమాణం ప్రధానం కాదు ఒక ట్రే
అంగన్వాడీ కేంద్రాలకు తక్కువ పరిమాణంలో ఉన్నవి సరఫరా
న్యూస్టుడే, నర్సాపూర్
నర్సాపూర్ కేంద్రంలో చిన్నారులు
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడి గుడ్ల్లు చాలా చిన్నవిగా ఉంటున్నాయి. అదేమిటని కేంద్రాల ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే మాకేం తెలుసు సరఫరా చేసే వారినే అడగండని అంటున్నారు. అధికారులను ప్రశ్నిస్తే గుడ్డు పరిమాణం ప్రధానం కాదు ఒక ట్రే బరువు కిలోన్నర ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. ఒక్కో గుడ్డును తూకం వేయలేం కదా అని వాదిస్తున్నారు. ఇలాగైతే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఎలా సరిపోతుందనేది అధికారులకే తెలియాలనే విమర్శలు వినిపిస్తున్నాయి. నర్సాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి అంగన్వాడీ కేంద్రాల్లో నిబంధనల మేరకు కాకుండా తక్కువ పరిమాణంతో ఉన్నవి సరఫరా చేస్తున్న తీరుపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
సరఫరా చేసిన గుడ్లు ఇలా..
ఆరు మండలాల్లో..
ప్రాజెక్టు పరిధిలో నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, చిలప్చెడ్, తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు ఉన్నాయి. వీటిలో 11 సెక్టార్లు, 208 ప్రధాన, 80 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 3-6 ఏళ్లలోపు చిన్నారులు 5,661, గర్భిణులు 1,589, బాలింతలు 1,419 మందికి పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఒక్క నర్సాపూర్ పట్టణంలోనే 12 ప్రధాన, 2 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. నిబంధనల ప్రకారం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు 50 గ్రాముల గుడ్డు రోజూ ఇవ్వాలి. వారంలో మొదటి రోజు, నాలుగో రోజు గుడ్డు కూర, మిగతా అన్ని రోజులు ఉడకబెట్టింది ఇవ్వాలి. బుధవారం మాత్రం అందరికీ రెండు గుడ్లు ఇవ్వాల్సి ఉంది. వీటిలో అధిక పోషకాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ గుడ్లు తినాలని సూచిస్తున్న అధికారులు చిన్న పరిమాణం గల గుడ్లు సరఫరా చేస్తే ఎలా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. చాలా చోట్ల గుడ్డు బరువు 40 గ్రాములు లేదా అంతకంటే తక్కువే ఉంటోంది. ప్రాజెక్టు పరిధిలో సింహభాగం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న గుడ్లే సరఫరా అవుతున్నాయి. నర్సాపూర్లోని పలు కేంద్రాల్లో పరిశీలిస్తే చిన్న సైజులో ఉన్నవి దర్శనమిచ్చాయి. ప్రాజెక్టు కార్యాలయం పక్కన, కాగజ్మద్దూర్ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
వెంటనే తిరస్కరిస్తున్నాం..
- హేమాభార్గవి, సీడీపీవో, నర్సాపూర్
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడి గుడ్లు నిర్ణీత పరిమాణంలో లేకుంటే వెంటనే తిప్పి పంపుతున్నాం. గతంలో రెండు మూడు సార్లు ఇలాగే చేశాం. కేంద్రాల ఉపాధ్యాయులకు సైతం వాటిని తీసుకోకుండా తిప్పి పంపించాలని సూచించాం. గుడ్డు పరిమాణం ప్రధానం కాదు, ట్రే బరువు కిలోన్నర ఉంటే చాలు. గుత్తేదారుకు సైతం సమాచారం అందించి తీరు మార్చుకోమని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
[ 07-05-2024]
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఉపాధి ప్రశ్నార్థకం.. జీవనం భారం!
[ 07-05-2024]
రేయింబవళ్లు చెమటోడ్చి.. బీడీలు చుట్టే కార్మికుల కష్టం అంతాఇంతా కాదు. ఆరోగ్యాన్ని లెక్కచేయక.. కుటుంబ పోషణ భారం మోసే మహిళలు అనేకం. కొన్నేళ్లుగా ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి కరవవుతోంది. -
గ్యారంటీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
[ 07-05-2024]
హామీలను నెరవేర్చడంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. సోమవారం వెల్దుర్తిలో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
హామీల అమలులో మాట తప్పిన సీఎం
[ 07-05-2024]
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారని, మాట తప్పిన ముఖ్యమంత్రికి ఓటు ద్వారానే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. -
అధినేత యాత్రపై ఆశలు
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. సిట్టింగ్ స్థానమైన మెదక్ లోక్సభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు, -
పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే
[ 07-05-2024]
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సోమవారం హవేలిఘనపూర్ నుంచి బూర్గుపల్లి వరకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్తో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. -
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 07-05-2024]
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
అత్యవసరమైతేనే బయటకు రండి
[ 07-05-2024]
జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వడగాలులు వీస్తున్నాయి. పిల్లలు, పెద్దలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యం సగటున 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా?
[ 07-05-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. ఎక్కువ మంది డిపాజిట్లు కోల్పోతున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో ఎన్నిక జరుగుతోంది. -
రిజర్వేషన్లపై అసత్య ప్రచారం: రాజాసింగ్
[ 07-05-2024]
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనలో ఇబ్బందులు పడ్డారని, రేవంత్రెడ్డి పాలనతో అంతకు మించిన కష్టాలు అనుభవిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. -
భాజపా ఓడితేనే అన్ని వర్గాలకు న్యాయం
[ 07-05-2024]
దేశంలో అన్నివర్గాలకు న్యాయం జరగాలన్నా, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా.. భాజపా ఓడిపోవాల్సిందేనని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
కాంగ్రెస్లో చేరిన హుస్నాబాద్ భాజపా ఇన్ఛార్జి
[ 07-05-2024]
హుస్నాబాద్ నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జి, హౌజ్ఫెడ్ మాజీ ఛైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి తన అనుచరులతో కలసి తిరిగి కాంగ్రెస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. -
సామాజిక మాధ్యమం.. ప్రచారానికి ఊతం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమీపిస్తుండటంతో మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రతి ఓటరును చేరాలన్న ఉద్దేశంతో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్నారు. -
అక్కడ తప్పని సరి.. ఇక్కడ ఇంతేమరి
[ 07-05-2024]
చెల్లించే పన్నుకి జరిగే అభివృద్ధికి ఏ మాత్రం తేడా కనిపించినా కొన్ని దేశాల్లో పౌరులు ఉపేక్షించరు. నాయకులు ఎదురుపడితే నిలదీస్తారు. ఎదురు మాట్లాడితే ‘వి ఆర్ టాక్స్ పేయర్స్’ అంటూ ఉద్యమాలు చేపడతారు. -
కాస్త దృష్టిసారిస్తే ఆరోగ్యమే
[ 07-05-2024]
ఓ వైపు ఎండ తీవ్రత పెరిగింది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సమయంలోనే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ప్రచారం శనివారంతో ముగియనుంది. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
[ 07-05-2024]
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
దొంగల వెంట పోలీస్ పరుగో పరుగు
[ 07-05-2024]
తాళం వేసిన ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగలు పోలీసులపై దాడికి యత్నించి పరారైన సంఘటన తూప్రాన్లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM