సగం మందీ గట్టెక్కలే!
జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 50 శాతం లోపు ఉండటం గమనార్హం. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో న్యాల్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫలితాలు నిరాశాజనకం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 50 శాతం లోపు ఉండటం గమనార్హం. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో న్యాల్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10.32శాతమే పాసయ్యారు. హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ ఇదే తీరు. ఇక్కడ ఉత్తీర్ణత శాతం 15.96. కోహీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 277కు 86 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 11 కళాశాలల్లో ఉత్తీర్ణత 50శాతం లోపు ఉంది.
ఇదీ పరిస్థితి..: 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జిల్లాలో ఉన్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షకు 3,696 మంది హాజరుకాగా సగం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేదు. 1,248 మంది విద్యార్థులు మాత్రమే గట్టెక్కారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన 2,867 మందిలో 1,373 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 45.41శాతమే ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. పరీక్షకు 218 మంది హాజరుకాగా 99 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 189 మందికి 113 మంది ఉత్తీర్ణత సాధించారు. సంగారెడ్డిలోని బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత 60.75శాతం ఉండగా బాలుర కళాశాలలో ఇది 32.61 శాతమే.
ఇక్కడ ఆదర్శం: సమస్యలు తిష్ట వేసినా కొన్ని కళాశాలలు మెరుగైన ఉత్తీర్ణత శాతంతో ఆదర్శాన్ని చాటాయి. ప్రణాళికతో ముందుకు సాగడమే దీనికి కారణం. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక తరగతులు, వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఉత్తీర్ణత శాతం పెరిగింది. కల్హెర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 103 మందికి 90 మంది ఉత్తీర్ణత సాధించడం విశేషం. కంగ్టి కళాశాలలో 109 మందికి 90, హత్నూరలో 69కి 54 మంది గట్టెక్కారు.
మెరుగవ్వాలంటే..
* అధ్యాపకుల ఖాళీలను భర్తీచేయాలి.
* కళాశాలల్లో కనీస వసతులు కల్పించాలి.
* విద్యార్థులు చదువుపై దృష్టిసారించేందుకు వీలుగా ఆహ్లాదకర వాతావరణం ఉండాలి.
* కళాశాల నిర్వహణపై సరైన పర్యవేక్షణ ఉండటంలేదు. అధికారుల పర్యవేక్షణ పెరగాలి.
* విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక తరగతులతోపాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలి.
కారణాలు తెలుసుకుంటాం
-గోవిందరామ్, జిల్లా ఇంటర్ విద్యాధికారి
విద్యార్థుల ఉత్తీర్ణత తక్కువగా వచ్చిన కళాశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఉత్తీర్ణత తగ్గడానికి కారణాలు తెలుసుకుంటాం. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఫలితాల మెరుగుకు ప్రణాళికతో ముందుకు సాగుతాం. ప్రత్యేక తరగతులతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరి దరి చేరాలంటే..గులాబీ గుబాళించాలి
[ 09-05-2024]
నర్సాపూర్ ప్రాంతంలోని లక్షల ఎకరాల పొలాలు సస్యశ్యామలం చేసేందుకు, శాశ్వతంగా సాగు నీరందించేందుకు కాళేశ్వరం ప్రధాన కాల్వల పనులను ప్రారంభించాం.. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుందన్న నమ్మకం లేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
నేతల చూపు.. పల్లెల వైపు
[ 09-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో ఉంటారు. -
‘భాజపాతోనే దేశాభివృద్ధి’
[ 09-05-2024]
దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా అధికారంలో ఉండాలని, ప్రధాని మోదీతోనే సాధ్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. -
జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు: మంత్రి సురేఖ
[ 09-05-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని మంత్రి కొండా సురేఖ అన్నారు. -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
[ 09-05-2024]
‘లోక్సభ ఎన్నికల సమర్థ నిర్వహణకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. పటిష్ఠ నిఘాతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. -
షెట్కార్ విజయానికి కృషి చేయండి: మంత్రి
[ 09-05-2024]
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
మాదిగలను మోసం చేసిన సీఎం రేవంత్, కేసీఆర్: మందకృష్ణ
[ 09-05-2024]
మాదిగలను సీఎం రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. -
‘రివర్స్ గేర్లో రాష్ట్రంలో పాలన’
[ 09-05-2024]
‘కొత్త ప్రభుత్వం అధికారంలో వస్తే మంచి పథకాలు రావాలి... ప్రజలకు మేలు జరగాలి... అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక పాలన పూర్తిగా రివర్స్ గేర్లో నడుస్తుంది.. మార్పు రావాలి మార్పు రావాలి అన్నారు. -
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
[ 09-05-2024]
రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్, మరోవైపు భాజపా నాయకులు అస్థిర పరిచేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. -
నవోన్మేశమే.. ‘యువా’శయం
[ 09-05-2024]
ఎన్నికలు ఏవైనా.. యువ భాగస్వామ్యం కీలకం. వారు తీసుకునే నిర్ణయం సమాజ ప్రగతికి దోహదపడుతుంది. -
రేవంత్రెడ్డి.. మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం
[ 09-05-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి.. స్వల్ప కాలంలోనే మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.