ఆఫర్ పేరిట టోకరా..
పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఎక్కడో చోట సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఆన్లైన్లో నేరగాళ్లు బురడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఇదే తరహాలో జగదేవపూర్ మండలం తిమ్మాపూర్లో
ఆగని సైబర్ నేరాలు
జగదేవపూర్, న్యూస్టుడే: పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఎక్కడో చోట సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఆన్లైన్లో నేరగాళ్లు బురడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఇదే తరహాలో జగదేవపూర్ మండలం తిమ్మాపూర్లో ఘటన చోటుచేసుకుంది. గత నెల 26న గ్రామానికి చెందిన చిప్ప నరేందర్ అనే యువకుడికి ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. ల్యాప్టాప్, చరవాణులు 50 శాతం తక్కువ ధరకే ఆఫర్లో అందిస్తామని వాటి ఫొటోలు పంపాడు. రూ.70 వేలు వెంటనే పంపించాలని సూచించాడు. నమ్మిన యువకుడు ఫోన్పే ద్వారా రూ.70 వేల పంపించాడు. తర్వాత రెండు రోజులకు అదే నెంబరుకు ఫోన్ చేయగా ఏమ్రాతం స్పందన లేదు. దీంతో మోసపోయానని గ్రహించి గత నెల 30న జాతీయ హెల్ప్లైన్ 1930కు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడికి చెందిన రూ.11,000 ఫ్రీజ్ అయినట్లు పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. 24 గంటలోపు సమాచారం ఇస్తే 99 శాతం మేర సొమ్ము రికవరీ చేయడానికి అవకాశాలు ఉంటాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరి దరి చేరాలంటే..గులాబీ గుబాళించాలి
[ 09-05-2024]
నర్సాపూర్ ప్రాంతంలోని లక్షల ఎకరాల పొలాలు సస్యశ్యామలం చేసేందుకు, శాశ్వతంగా సాగు నీరందించేందుకు కాళేశ్వరం ప్రధాన కాల్వల పనులను ప్రారంభించాం.. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుందన్న నమ్మకం లేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
నేతల చూపు.. పల్లెల వైపు
[ 09-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో ఉంటారు. -
‘భాజపాతోనే దేశాభివృద్ధి’
[ 09-05-2024]
దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా అధికారంలో ఉండాలని, ప్రధాని మోదీతోనే సాధ్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. -
జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు: మంత్రి సురేఖ
[ 09-05-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని మంత్రి కొండా సురేఖ అన్నారు. -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
[ 09-05-2024]
‘లోక్సభ ఎన్నికల సమర్థ నిర్వహణకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. పటిష్ఠ నిఘాతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. -
షెట్కార్ విజయానికి కృషి చేయండి: మంత్రి
[ 09-05-2024]
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
మాదిగలను మోసం చేసిన సీఎం రేవంత్, కేసీఆర్: మందకృష్ణ
[ 09-05-2024]
మాదిగలను సీఎం రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. -
‘రివర్స్ గేర్లో రాష్ట్రంలో పాలన’
[ 09-05-2024]
‘కొత్త ప్రభుత్వం అధికారంలో వస్తే మంచి పథకాలు రావాలి... ప్రజలకు మేలు జరగాలి... అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక పాలన పూర్తిగా రివర్స్ గేర్లో నడుస్తుంది.. మార్పు రావాలి మార్పు రావాలి అన్నారు. -
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
[ 09-05-2024]
రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్, మరోవైపు భాజపా నాయకులు అస్థిర పరిచేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. -
నవోన్మేశమే.. ‘యువా’శయం
[ 09-05-2024]
ఎన్నికలు ఏవైనా.. యువ భాగస్వామ్యం కీలకం. వారు తీసుకునే నిర్ణయం సమాజ ప్రగతికి దోహదపడుతుంది. -
రేవంత్రెడ్డి.. మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం
[ 09-05-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి.. స్వల్ప కాలంలోనే మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.