ప్రభుత్వ బడులు.. ప్రవేశాలు భళా
ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతోంది. గత నెల బడిబాట కార్యక్రమం నిర్వహించడం, ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం మంచి ఫలితాలు ఇచ్చింది. మన ఊరు- మన బడి ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, 1 నుంచి 8 తరగతుల్లో
ఇప్పటి వరకు చేరింది 10,192 విద్యార్థులు
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ
ఇంటింటి ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతోంది. గత నెల బడిబాట కార్యక్రమం నిర్వహించడం, ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం మంచి ఫలితాలు ఇచ్చింది. మన ఊరు- మన బడి ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, 1 నుంచి 8 తరగతుల్లో ఆంగ్ల మాధ]్యమం ప్రవేశపెట్టడంతో ప్రవేశాలు పెరిగినట్లు విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పాఠశాలలకు ఇప్పటి వరకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు రాలేదు. ఇవి వస్తే ప్రవేశాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం..
జిల్లాలో 1,248 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. జూన్ 3 నుంచి ప్రారంభమైన ప్రవేశాల ప్రక్రియలో ఇప్పటి వరకు ప్రభుత్వ బడుల్లో అన్ని తరగతులకు కలిపి 10,192 మంది విద్యార్థులు చేరారు. వీటిలో ఎక్కువగా 1, 6, 8 తరగతుల్లో విద్యార్థులు చేరారు. ఈ మూడు తరగతుల్లో 7,111 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా వచ్చి చేరుతున్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో 3,067 మంది వివిధ తరగతుల్లో ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చారు. ఇప్పటికీ ఈ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగడంతో సంఖ్య పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్లో రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. చెల్లించలేని వారు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలో 72 మంది చేరారు. ప్రైవేట్ నుంచి వచ్చిన వారిలో 32 మంది ఉన్నారు. ఒక్క సంగారెడ్డే కాకుండా జహీరాబాద్, సదాశివపేట, పటాన్చెరు, రామచంద్రాపురం, జోగిపేటల్లో ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు: ప్రభుత్వ బడులను కాపాడుకునేందుకు ఉపాధ్యాయులు ముందుకు వస్తున్నారు. రేషనలైజేషన్తో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే మూత పడే అవకాశాలు ఉండడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి తమ పాఠశాలల్లో చేర్పించాలని చెబుతున్నారు. అంగన్వాడీలలో చదివే విద్యార్థులను 1వ తరగతిలో ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. ప్రభుత్వ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లోని విద్యార్థులు కూడా ఉన్నత పాఠశాలల్లో చేరేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇలా నేరుగా ఉపాధ్యాయులే ముందుకు రావడంతో తల్లిదండ్రుల్లో నమ్మకం కలుగుతోంది.
తల్లిదండ్రులకు నమ్మకం కలిగిస్తున్నాం
రాజేశ్, జిల్లా విద్యాధికారి
ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫాం ఉచితంగా అందిస్తున్నాం. 8వ తరగతి చదివే వారికి ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీటు దక్కించుకోవచ్చు. ఇలాంటి సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త హామీలు ఇవ్వక.. పాతవి రద్దు చేస్తున్నారు
[ 08-05-2024]
‘కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల హయాంలో ఘనపూర్ ఆనకట్ట నాశనమైంది, భారాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.150 కోట్లతో బాగు చేశాం, ఆనకట్ట ఎత్తుపెంచాం. -
లాడ్జిలో భారీగా వస్త్రాలు స్వాధీనం
[ 08-05-2024]
రామాయంపేట పట్టణంలోని ఓ లాడ్జిలో ఎన్నికల్లో పంపిణీ చేయడానికి సామగ్రి దాచి ఉంచారనే ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం పోలీసులు తనిఖీలు చేశారు. -
ఆరుగాలం పంట.. ఆగమాగం
[ 08-05-2024]
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరుబయట ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. -
ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు?
[ 08-05-2024]
ఇండియా కూటమిలోని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్షో, కొత్త బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. -
పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
[ 08-05-2024]
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మెదక్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు అన్నారు -
అనుత్తీర్ణులపై ప్రత్యేక శ్రద్ధ
[ 08-05-2024]
ఇంటర్మీడియట్ ఫలితాలు ఈసారి ఆశించిన స్థాయిలో రాలేదు. గత ఏడాదితో పోల్చితే రెండు స్థానాలు ఎగబాకి ఈ ఏడాది కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి -
ప్రజాస్వామ్య ఆయువుపట్టు.. ఓటరన్నా నిలబెట్టు
[ 08-05-2024]
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.. ఓటు. దాని సద్వినియోగంతోనే మనతో పాటు సమాజానికి మేలు చేకూరుతుంది. ఇదే నినాదంతో పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు ఓటరు చైతన్యానికి కంకణబద్ధులయ్యారు. -
పోలీసులు, ఎమ్మెల్యే పేర్లతో వసూళ్లు
[ 08-05-2024]
పోలీసులు, ఎమ్మెల్యే పేరు చెప్పి.. సీఎం రేవంత్రెడ్డి తమ్ముడితో సంబంధాలు ఉన్నాయంటూ ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండు చేస్తూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితుడిని మంగళవారం మెదక్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
వలస ఓటరు కలిసొచ్చేనా ..
[ 08-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటరూ కీలకమే. ఉపాధికి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని సైతం స్వగ్రామాలకు రప్పించేందుకు నాయకులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
కర్షకుల కరుణకు నేతల ఆరాటం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జిల్లా ఓటర్లలో అత్యధికులది రైతు కుటుంబాల నేపథ్యమే. -
వ్యవసాయాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్
[ 08-05-2024]
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బి.వినోద్కుమార్ విమర్శించారు -
‘గౌరవెల్లి’ నీరందించడమే అత్యంత ప్రాధాన్యం
[ 08-05-2024]
గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా సాగునీరందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.