ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
తంగేడు పూలు కోసుకు రావడానికి వెళ్లిన యువకుడు.. చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో పలుసార్లు యువకుడు మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తించేవాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం శివారులో చోటుచేసుకుంది.
న్యూస్టుడే, కొండపాక: తంగేడు పూలు కోసుకు రావడానికి వెళ్లిన యువకుడు.. చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో పలుసార్లు యువకుడు మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తించేవాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం శివారులో చోటుచేసుకుంది. కుకునూరుపల్లి ఎస్ఐ పుష్పరాజ్, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు.. తిప్పారం గ్రామానికి చెందిన గడ్డం కొమురయ్య, నాగలక్ష్మి కుటుంబం తుర్కపల్లిలోని కోళ్లఫారంలో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి నరేశ్, ప్రశాంత్ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నరేశ్(22) టీవీ మరమ్మతులు చేసేవాడు. అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తించేవాడు. సద్దుల బతుకమ్మ, దసరా పండగలు చేసుకునేందుకు సోమవారం వారంతా తిప్పారం చేరుకున్నారు. ఆరోజు ఉదయం 6 గంటలకు బతుకమ్మ పేర్చడానికి తంగేడు పూలు తెస్తానని నరేశ్ వెళ్లాడు. ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం తిప్పారం శివారులోని పొలంలో చింత చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. పర్వదినాల్లో ఈ విషాదకర సంఘటన గ్రామస్థులను ఆవేదనలో ముంచెత్తింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చేపల వేటకు వెళ్లి ఇద్దరి మృతి
హవేలిఘనపూర్, న్యూస్టుడే: చేపల వేటలకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడిన ఘటనలు హవేలిఘనపూర్ మండలంలో చోటుచేసుకున్నాయి. స్థానిక ఎస్ఐ మురళి తెలిపిన వివరాలు.. మండలంలోని స్కూల్ తండాకు చెందిన నేనావత్ అరుణ, లాల్య (32) దంపతులకు నలుగురు సంతానం ఉన్నారు. లాల్య కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లాల్య సోమవారం రాత్రి తండాకు సమీపంలోని హవేలిఘనపూర్ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో చెరువులోకి దిగిన లాల్య ప్రమాదవశాత్తు నీటి మునిగి ఊపిరాడక మృతి చెందాడు. మంగళవారం ఉదయమైనా భర్త ఇంటికి రాకపోవడంతో అరుణ.. చెరువు వద్దకు వెళ్లి వెతకగా చెరువు గట్టు మీద లాల్య చెప్పులు, దుస్తులు కనిపించాయి. దీంతో ఈతగాళ్ల సాయంతో గాలించగా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ వివరించారు.
వలలో చిక్కుకొని..
హవేలిఘనపూర్ మండల పరిధి గాజిరెడ్డిపల్లికి చెందిన ఉప్పలపు సత్తయ్య (55), సత్తమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. సత్తయ్య.. ముగ్గురితో కలిసి గ్రామానికి సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపల కోసం చెరువులో వల వేసి వస్తుండగా ప్రమాదవశాత్తు సత్తయ్య కాళ్లు అందులో చిక్కుకున్నాయి. దీంతో నీటిలో మునిగాడు. గమనించిన దాసు, లక్ష్మీపతి, మంగయ్యలు సత్తయ్యను బయటకు తీసి చూసే సరికి సత్తయ్య మృతిచెందాడు. మృతుడి భార్య సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ వివరించారు.
కడుపునొప్పితో రైతు..
చిన్నకోడూరు, న్యూస్టుడే: కడపునొప్పి భరించలేక ఆత్మహత్యకు యత్నించిన రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని మెట్టుపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివానందం తెలిపిన వివరాలు.. మెట్టుపల్లికి చెందిన ధర్మాజిపేట తిరుపతిరెడ్డి(34) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి భార్య జ్యోతి, కుమారుడు రేవంత్రెడ్డి, కూతురు మానస ఉన్నారు. తిరుపతిరెడ్డి గత మూడేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. మనస్తాపానికి గురై తన ఇంట్లో శనివారం సాయంత్రం పురుగు మందు తాగాడు. తండ్రి సత్తిరెడ్డి గమనించి, గ్రామస్థుల సాయంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జీవితంపై విరక్తితో... బలవన్మరణం
ఝరాసంగం: కొన్నేళ్లుగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తి చెంది తాగునీటి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఝరాసంగం ఎస్సై రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం... కొన్నాళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న చీల్కేపల్లి గ్రామానికి చెందిన మంగలి మైపాల్(35) చికిత్స చేయించుకున్నా తగ్గడం లేదని మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తాగునీటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన భార్య ప్రేమలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మైపాల్కు పదేళ్లలోపు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త హామీలు ఇవ్వక.. పాతవి రద్దు చేస్తున్నారు
[ 08-05-2024]
‘కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల హయాంలో ఘనపూర్ ఆనకట్ట నాశనమైంది, భారాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.150 కోట్లతో బాగు చేశాం, ఆనకట్ట ఎత్తుపెంచాం. -
లాడ్జిలో భారీగా వస్త్రాలు స్వాధీనం
[ 08-05-2024]
రామాయంపేట పట్టణంలోని ఓ లాడ్జిలో ఎన్నికల్లో పంపిణీ చేయడానికి సామగ్రి దాచి ఉంచారనే ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం పోలీసులు తనిఖీలు చేశారు. -
ఆరుగాలం పంట.. ఆగమాగం
[ 08-05-2024]
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరుబయట ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. -
ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు?
[ 08-05-2024]
ఇండియా కూటమిలోని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్షో, కొత్త బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. -
పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
[ 08-05-2024]
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మెదక్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు అన్నారు -
అనుత్తీర్ణులపై ప్రత్యేక శ్రద్ధ
[ 08-05-2024]
ఇంటర్మీడియట్ ఫలితాలు ఈసారి ఆశించిన స్థాయిలో రాలేదు. గత ఏడాదితో పోల్చితే రెండు స్థానాలు ఎగబాకి ఈ ఏడాది కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి -
ప్రజాస్వామ్య ఆయువుపట్టు.. ఓటరన్నా నిలబెట్టు
[ 08-05-2024]
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.. ఓటు. దాని సద్వినియోగంతోనే మనతో పాటు సమాజానికి మేలు చేకూరుతుంది. ఇదే నినాదంతో పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు ఓటరు చైతన్యానికి కంకణబద్ధులయ్యారు. -
పోలీసులు, ఎమ్మెల్యే పేర్లతో వసూళ్లు
[ 08-05-2024]
పోలీసులు, ఎమ్మెల్యే పేరు చెప్పి.. సీఎం రేవంత్రెడ్డి తమ్ముడితో సంబంధాలు ఉన్నాయంటూ ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండు చేస్తూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితుడిని మంగళవారం మెదక్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
వలస ఓటరు కలిసొచ్చేనా ..
[ 08-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటరూ కీలకమే. ఉపాధికి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని సైతం స్వగ్రామాలకు రప్పించేందుకు నాయకులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
కర్షకుల కరుణకు నేతల ఆరాటం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జిల్లా ఓటర్లలో అత్యధికులది రైతు కుటుంబాల నేపథ్యమే. -
వ్యవసాయాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్
[ 08-05-2024]
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బి.వినోద్కుమార్ విమర్శించారు -
‘గౌరవెల్లి’ నీరందించడమే అత్యంత ప్రాధాన్యం
[ 08-05-2024]
గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా సాగునీరందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.