సహజ ప్రసవానికే ప్రాధాన్యం
తూప్రాన్కు చెందిన ఓ గర్భిణి రెండో కాన్పు నిమిత్తం మెదక్లోని మాతాశిశు సంరక్షణ కేంద్రాని(ఎంసీహెచ్)కి వచ్చింది. నెలలు నిండటంతో వైద్యబృందం ప్రసవం చేయగా పాపకు జన్మనిచ్చారు.
కేంద్రంలో బాలింతలు
న్యూస్టుడే, మెదక్: తూప్రాన్కు చెందిన ఓ గర్భిణి రెండో కాన్పు నిమిత్తం మెదక్లోని మాతాశిశు సంరక్షణ కేంద్రాని(ఎంసీహెచ్)కి వచ్చింది. నెలలు నిండటంతో వైద్యబృందం ప్రసవం చేయగా పాపకు జన్మనిచ్చారు. ఆ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కాగా వైద్యులు గర్భ సంచి తొలగించారు. పరిస్థితి విషమించడంతో గాంధీకి పంపించగా రక్తాన్ని అందించి ప్రాణాన్ని కాపాడారు. సదరు మహిళ మరోసారి ఎంసీహెచ్కు వచ్చి వైద్యసిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
* మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఈనెల 11న 24 గంటల్లో 25 ప్రసవాలు జరిగాయి. ఇందులో 12 సాధారణ, మిగతావి సిజేరియన్ ప్రసవాలు. ఇది వరకు ఆసుపత్రిలో 23 ప్రసవాలు జరుగగా, ఆ రికార్డును తిరగరాశారు. కార్పోరేట్ స్థాయిలో వసతులు, కేసీఆర్ కిట్ అమలు, వైద్యానికి ఇంటి నుంచి ఆసుపత్రి వరకు వాహన సౌకర్యం కల్పించడం.. పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల వైపు గర్భిణులు మొగ్గుచూపుతున్నారు. గతంలో అసౌకర్యాల మధ్య ప్రసవాలు జరగ్గా, ఇప్పుడు అధునాతన వసతులు అందుబాటులోకి రావడంతో వచ్చే వారికి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో సహజ కాన్పులపై దృష్టిపెడుతున్నారు.
అధునాతన సౌకర్యాలు
జిల్లా కేంద్రం మెదక్లో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఇది వరకు ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనంలో కొనసాగేది. గతేడాది మే నెలలో రూ.17 కోట్లతో స్థానిక పిల్లికొట్టాల వద్ద అధునాతన భవనం అందుబాటులో రాగా, అక్కడికి మార్చారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాలతో ఇక్కడ సహజ కాన్పులు జరిగేలా వైద్యులు దృష్టిసారించారు. గర్భిణిగా పేరు నమోదైనప్పటి నుంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో చికిత్స పొందుతుండగా, ఆరు నెలల తర్వాత ఎంసీహెచ్కు వచ్చి సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు వాకబు చేస్తున్నారు. రక్తహీనత, రక్తపోటు ఉంటే చికిత్స అందిస్తున్నారు. ఒక వేళ కుటుంబీకులు శస్త్రచికిత్స చేయాలని కోరినా.. సహజ కాన్పుపై అవగాహన కల్పిస్తున్నారు.
ఆరు నెలల తర్వాత..
శివదయాళ్, సివిల్ సర్జన్, ఎంసీహెచ్
గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రసవాలు జరిగేలా దృష్టి సారించాం. ఆరు నెలలుగా ఉన్న సమయం నుంచి వచ్చే వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధవహిస్తున్నాం. వారికేమైనా సమస్యలుంటే సమయం సమీపించే నాటికి తొలగిపోయేలా చర్యలు తీసుకుంటున్నాం. కాన్పు సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే తగిన చికిత్సతో తల్లి, బిడ్డల ప్రాణాలు కాపాడుతున్నాం. ఎంసీహెచ్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండటం కలిసొచ్చింది.
అందుబాటులో వైద్యులు
పరీక్షిస్తున్న వైద్యులు
మాతా శిశుసంరక్షణ కేంద్రం అందుబాటులోకి రావడంతో వైద్యసేవలు మెరుగయ్యాయి. మెదక్ సమీపంలోని మండలాలతో పాటు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, గోపాల్పేట, మేడ్చల్ జిల్లాల నుంచి గర్భిణులు ఇక్కడికి వస్తున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయి. గత జులై నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది జులైలో 308, ఆగస్టులో 338, సెప్టెంబరులో 377, అక్టోబరులో 384, నవంబరులో 407, డిసెంబరులో 376 వరకు జరిగాయి. ఈ ఏడాది జనవరి 27 వరకు 310 వరకు జరగ్గా, ఇందులో 166 సాధారణమైనవే కావడం గమనార్హం. నిత్యం ఇక్కడ 15 వరకు చేస్తున్నారు. ఒక సివిల్ సర్జన్తో పాటు మరో ముగ్గురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇద్దరు అనస్తీషియా వైద్యులు ఉన్నారు. ఇద్దరు చిన్నపిల్లల వైద్యులు సేవలందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు రంగులు ఎగరాలి.. మెతుకు సీమ మురవాలి
[ 10-05-2024]
ముష్కరుల చేతిలో ఇందిరాగాంధీ తూటాలకు బలైనప్పుడు దేశానికి ప్రధానిగా, మెదక్కు ఎంపీగా ఉన్నారని, చివరి శ్వాస, ఆఖరి రక్తపుబొట్టు చిందేవరకు ఈ ప్రాంతానికి ఆమె ప్రాతినిధ]్యం వహించారని.. మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే ఆమె కన్ను మూశారని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. -
343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
[ 10-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
ఓటెందుకు వేయాలంటే..
[ 10-05-2024]
ఎంత ఎక్కువ పోలింగ్ నమోదైతే అంత చక్కటి తీర్పు వస్తుందన్నది నిపుణుల మాట. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలో గణనీయంగా పోలింగ్ నమోదవుతున్నా.. -
భారాస అభ్యర్థికి మద్దతిస్తూ తీర్మానం
[ 10-05-2024]
చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్ యాదవ సంఘం సభ్యులు మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేస్తామని గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 10-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
స్థానిక నాయకా.. బాధ్యత నీదిక!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు. -
వేగులు.. నేతలకు గుబులు
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడింది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనున్నారు. -
రూ.లక్ష వేతనం.. వైద్యసేవలు ఉచితం
[ 10-05-2024]
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
ఓటు పవిత్రమైనది
[ 10-05-2024]
ఓటు పవిత్రమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యతగా గుర్తించాలి. -
నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్
[ 10-05-2024]
‘శత చండీ హోమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో కాంగ్రెస్, భాజపా ముఖ్యమంత్రులు ఎవరూ ఈ హోమం చేయలేదు. -
మోదీతో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవు
[ 10-05-2024]
కేంద్రంలో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. -
12 వేల కోట్లతో అభివృద్ధి చేశా: బండి సంజయ్
[ 10-05-2024]
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
గురుశిష్యుల ప్రయాణమే.. బ్రహ్మచారి
[ 10-05-2024]
ముప్పై ఏళ్ల గురుశిష్యుల కలల ప్రయాణంతో పురుడుపోసుకుంది బ్రహ్మచారి చిత్రం. -
మద్యం తాగొద్దన్నందుకు తండ్రిని హతమార్చిన తనయుడు
[ 10-05-2024]
మద్యం తాగి కుటుంబ సభ్యులను హింసిస్తున్నావని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన తండ్రిని, తనయుడు కత్తితో పొడిచి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 10-05-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM